మధ్యప్రాచ్యంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా సాయుధ సంస్థల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తన మధ్యవర్తిత్వంలో కుదిరిన ఈ ఒప్పందం.. తక్షణమే అమలులోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరుపక్షాలతో తాను జరిపిన సుదీర్ఘ చర్చలు విజయవంతమయ్యాయని, ఇకపై పరస్పరం దాడులకు పాల్పడబోమని ఇరు వర్గాలు అంగీకరించాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం కేవలం తాత్కాలికం కాకూడదని, ఇది శాశ్వతంగా, అనంతకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఈ అసాధారణ ఒప్పందానికి ముందు తెరవెనుక దౌత్యపరమైన ఒత్తిళ్లు నడిచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడారు. అలాగే హిజ్బుల్లాకు చెందిన అత్యున్నత స్థాయి ప్రతినిధులతోనూ విడివిడిగా సంప్రదింపులు జరిపారు. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులకు సిద్ధమవుతున్న తరుణంలో ట్రంప్ జోక్యం చేసుకుని నెతన్యాహును వారించారు.
బీరూట్ నగరంపై పెద్ద ఎత్తున దాడులు చేయవద్దని ట్రంప్ చెప్పడంతో ఇజ్రాయెల్ ప్రధాని తన సైనిక బలగాలను వెనక్కి తిప్పారని అమెరికా శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి హిజ్బుల్లా గనుక ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై దాడులు ఆపకపోతే బీరూట్ను నామరూపాలు లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం గమనార్హం.
ఈ నూతన ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్ సైన్యం బీరూట్తో పాటు లెబనాన్ దక్షిణ శివార్లలోని దాహియే ప్రాంతంపై ఎలాంటి దాడులు చేయదు. దీనికి బదులుగా హిజ్బుల్లా ఇజ్రాయెల్ భూభాగాలపై కానీ, అక్కడి సైనికులపై కానీ ఎలాంటి దాడులకు పాల్పడదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/easefire-between-israel-and-hezbollah-36-221473.html
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.