తెలుగు రాష్ట్రాల్లో ‘ముందస్తు’ ముచ్చట్లు.. తెలంగాణతో పాటే జగనూ..!

Publish Date:Apr 29, 2022

Advertisement

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హీట్ ఓ రేంజ్ లో ఉంది. రెండు రాష్ట్రాలలోనూ కూడా ముందస్తుపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఆ ఊహాగానాలకు బలం చేకూర్చేలా కనిపించిన వారికీ, కనిపించని వారికీ, అడిగిన వారికీ, అడగని వారికీ కూడా ఏపీ మంత్రులు ముందస్తు ఉండవని చెబుతున్నారు. ఇక తెలంగాణలో అయితే స్వయంగా కేసీఆరే ముందస్తు ప్రశక్తే లేదని చెప్పినా.. తెరాస గత చరిత్ర తెలిసిన వారు ముందస్తే అంటూ నమ్ముతున్నారు. 

ఏది ఏమైనా తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఏడాది చివరిలో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏపీలో మాత్రం 2024లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది.  తెలంగాణతో పోలిస్తే ఏపీలో వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల కొనసాగింపు ప్రశ్నార్థకంలో పడింది. ఆ పథకాలు కొనసాగించలేక నిలిపేయాల్సిన పరిస్థితి ఎదురైతే... ప్రభుత్వ ప్రతిష్ట మంటగలవడం ఖాయం, ఆ ప్రభావం ఎన్నికలపై పడటం తథ్యమని పార్టీ పెద్దలే భావిస్తున్నారు. స్వయంగా పార్టీ అధినేత జగన్ కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ఎన్నికల హీట్ ను పెంచేలా ఎమ్మెల్యేలకు మార్కులు గ్రేడులూ కేటాయిస్తు పరుగులెత్తిస్తున్నారు. ఇవన్నీ జగన్ ముందస్తు తొందరను సూచిస్తున్నా..అధికారికంగా మాత్రం ఐదేళ్లూ కొనసాగి, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెడతామంటూ వైసీపీ మంత్రులు అడిగిన వారికీ అడగని వారికీ చెప్పేస్తున్నారు. 

అయితే ఏపీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుంటే జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశాలే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అందుకు ముహూర్తం ఎప్పుడన్న విషయంలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి తెలంగాణ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంతో పాటే ఏపీలో కూడా ఎన్నికలు జరిగేలా జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని అంటున్నారు. అలా చూసుకున్నా.. ప్రస్తుతం జగన్ సర్కార్ అమలు చేస్తున్న ఉచిత పథకాలు మరో ఏడాది పైన కొనసాగించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థతి ఏపీకి ఉందా అన్న సందేహం వ్యక్తమౌతున్నది. ఏది ఏమైనా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ‘ముందస్తు’ ముచ్చట్లపై ఇరు రాష్ట్రాల ప్రజలలో ఆసక్తి కనిపిస్తున్నది. తెరాస ఆనవాయితీ ప్రకారం, ఏపీ అవసరం రిత్యా ముందస్తుకే మొగ్గు చూపుతాయని పరిశీలకులు అంటున్నారు.   

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.