మండలిలో దువ్వాడ నోటి దురుసు.. డిప్యూటీ స్పీకర్ స్పందనేంటంటే?

Publish Date:Aug 19, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సాక్షిగా ప్రజాప్రతినిధుల మధ్య రాజకీయ విమర్శలు మరోసారి హద్దులు దాటాయి. మండలి సమావేశాల్లో ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఉన్నతమైన చట్టసభలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రిపై ఇలాంటి పదజాలం ఉపయోగించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

వైసీపీ నేతల నోట దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు అంతూ పొంతూ అనేది ఉండదని మరోసారి రుజువైంది. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాభవానికి, ఆ పార్టీ అధినేత నేడు అసెంబ్లీకి ముఖం చాటేయడానికీ, ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలు కూడా దక్కకపోవడానికి ప్రధాన కారణాలలో వైసీపీ నేతల బూతు పురాణం కూడా ఒకటన్నది తెలిసిందే. వైసీపీ నేతల దూషణలు, తిట్లు, బూతుపురాణాలపై ప్రజలు తన ఆగ్రహాన్ని, వ్యతిరేకతను 2024 ఎన్నికలలో తమ ఓటు ద్వారా విస్పష్టంగా తెలియజేశారు. అయినా వైసీపీయులలో ఇసుమంతైనా మార్పు రాలేదనడానికి  తాజాగా శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ నోరు పారేసుకోవడాన్ని పరిశీలకులు   ఉదాహరణగా చూపుతున్నారు. 

మండలిలో దువ్వాడ ప్రసంగిస్తూ.. మంత్రి అచ్చెన్నాయుడిని అంబోతు అని సంబోధించారు. ఏకంగా  డిప్యూటీ చైర్మన్ తోనే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడేనా.. అధ్యక్షా ఆ అంబోతును రమ్మనండి అని వ్యాఖ్యానించారు.   ఒక సీనియర్ మంత్రిని,  ఇలా సంబోధించడం సభామర్యాదకు భంగకరం అనడంలో సందేహం లేదు. అన్నిటికీ మించి మంత్రిని వాడు, ఆంబోతు అని దువ్వాడ శ్రీనివాస్ దూషణ భాషలో మాట్లాడితే డిప్యూటీ చైర్మర్  వారించడం, అభ్యంతరం తెలపడం మాని చిరునవ్వుతో ప్రోత్సహిస్తున్నట్లుగా వ్యవహరించడం మరింత దారుణమని పరిశీలకులు అంటున్నారు.  సభాధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తులు తటస్థంగా వ్యవహరించాలి, అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి, అటువంటి వ్యాఖ్యలు చేసిన సభ్యులను మందలించాలి. హెచ్చరించాలి. కానీ డిప్యూటీ స్పీకర్ అందుకు భిన్నంగా చిరునవ్వులు చిందించడం దారుణం. ఆయన తీరుపై సభ్యులలోనే కాదు.. సామాన్య జనంలో కూడా విస్మయం, ఏహ్యత వ్యక్తమౌతోంది.  

Duvvada Srinivas, Atchannaidu, AP Legislative Council, YCP MLC, APpolitics, TeluguOne

By
en-us Political News

  
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా  అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.