టార్గెట్ ప‌వ‌న్‌.. దువ్వాడ శ్రీ‌నివాస్‌, దివ్వెలమాధురి కొత్త డ్రామా!

Publish Date:Oct 11, 2024

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి ప్రేమ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది.   ఏజ్‌తో ప‌నిలేదు మేం ప్రేమపక్షులం అంటూ బ‌హిరంగంగా వారిద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. ఇటీవల తిరుప‌తిలో పెద్ద ర‌చ్చే చేశారు.  ఫొటో షూట్ తో తిరుమ‌ల కొండ‌పై వారు చేసిన ర‌చ్చ అంతాఇంతాకాదు. దీంతో మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భ‌క్తుల నుంచి విమ‌ర్శ‌లు ఎదురైనా డోంట్ కేర్.. మా ప్రేమ ఇలానే ఉంటుందంటూ నిర్మొహ‌మాటంగా చెప్పేస్తున్నారు. వీరిద్ద‌రూ వైసీపీలోనే ఉన్నారు. వీరి ఓవ‌ర్ యాక్ష‌న్‌కు వైసీపీ అధిష్టానం   అడ్డుక‌ట్ట వేసే ప్ర‌య‌త్నం ఇసుమంతైనా చేయ‌డం లేదు. ప్ర‌జా జీవితంలో ఉన్న నేత‌లు ఎవ‌రైనా కాస్త సంస్కారవంతంగా ఉండాలి.  ఫ్యామిలీ ప‌రంగా ఎన్ని అంత‌ర్గ‌త విబేధాలుఉన్నా స‌భ్య‌స‌మాజంలో వారి ప్ర‌వ‌ర్త‌న న‌లుగురు మెచ్చుకునేదిలా ఉండాలి. కానీ దువ్వాడ శ్రీ‌నివాస్‌, దివ్వెల మాధురిల‌కు అవేమీ ప‌ట్ట‌డం లేదు. వైసీపీ అధిష్టానం కూడా మంద‌లించ‌డం లేదు.  దీనికితోడు వీరు మీడియాలో ఇటీవ‌ల  వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇస్తూ నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అంటూ హ‌ల్‌చ‌ల్ చేసేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ ప్ర‌ముఖ చానెల్ ఇంట‌ర్వ్యూలో వారిద్ద‌రూ మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను టార్గెట్ చేశారు. ప‌వ‌న్ డిప్యూటీ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసేయాలంటూ డిమాండ్ చేశారు.

దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి వ్య‌వ‌హారం తెలుగు  డైలీ సీరియ‌ల్ త‌ర‌హాలో  ఫుల్ స్టాప్ అనేదే లేకుండా కొన‌సాగుతోంది. వారిద్ద‌రికి సంబంధించి రోజూ ఏదోఒక ఎపిసోడ్ తెర‌పైకి వ‌స్తూనే ఉంది. గత ఎన్నికల ముందు దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబంలో అంత‌ర్గ‌త విబేధాలు తారాస్థాయికి చేరాయి.  ఎన్నిక‌ల త‌రువాత వారి కుటుంబ విబేధాలు  రోడ్డెక్కాయి. ఇళ్ల‌పై దాడులు, కోర్టు కేసులు, విడాకుల వ‌ర‌కు దువ్వాడ శ్రీ‌నివాస్‌, వాణిల వ్య‌వ‌హారం వెళ్లింది. దీనికి కార‌ణం మాధురి అని వాణి, ఆమె కుమార్తెలు ఆరోపిస్తున్నారు. టెక్కలిలోని ఓ ఇంటిలో శ్రీ‌నివాస్‌, మాధురి ఉంటుండ‌టంతో వాణి, ఆమె కూతుళ్లు నిల‌దీశారు. ఇంటిని వెంటనే ఖాళీ చేయాలంటూ వారు అక్కడే బైఠాయించి నిర‌స‌న దీక్ష‌  చేశారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ఈ త‌రువాత దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి బ‌హిరంగానే వారి మధ్య సంబంధాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకుంటామ‌ని చెప్పి అంద‌రికీ షాకిచ్చారు. వాణి నుంచి విడాకులు కోరుతూ శ్రీ‌నివాస్ కోర్టుకు వెళ్లారు. విడాకుల ప్ర‌క్రియ పూర్త‌వ్వ‌గానే మేమిద్ద‌రం పెళ్లి చేసుకుంటామ‌ంటూ  ఏదో గొప్ప‌ప‌ని  అన్న‌ట్లుగా వారు  చెబుతున్నారు.

ఓ ప్ర‌ముఖ మీడియా ఛానెల్లో ఇటీవ‌ల శ్రీ‌నివాస్, మాధురి మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా జీవితాన్ని, ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను వేరువేరుగా చూడాలంటూ   ఆ చానల్ వేదికగా ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. తమ వ్య‌వ‌హారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ ని విమ‌ర్శిస్తున్నార‌ని, మ‌మ్మ‌ల్ని పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నార‌ని ఒకింత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదే స‌మ‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అది త‌ప్పుకాదా అంటూ ప్ర‌శ్నించారు. ఆయ‌న‌ది త‌ప్పుకాన‌ప్పుడు మేము చేసేది కూడా త‌ప్పుకాదంటూ సమర్ధించుకున్నారు. మాది త‌ప్ప‌ని అనేవాళ్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను డిప్యూటీ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేయాలని చెబుతూ.ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల వ్య‌వ‌హారం.. లేటు వ‌య‌సులో తమ ఘాటు ప్రేమాయ‌ణం ఒక్క‌టే అని చెప్పుకు ప్ర‌య‌త్నం చేశారు. వీరి వ్యాఖ్య‌లపై ప‌వ‌న్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విష‌యం వాస్త‌వ‌మే. కానీ, ప‌వ‌న్ తో విడిపోయిన వారు ఎప్పుడైనా ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేశారా...?  లేదు. ఎవ‌రి జీతాల్లో వారు నిమ‌గ్న‌మ‌య్యారు. కానీ దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి వ్య‌వ‌హారం అలాకాదు. శ్రీ‌నివాస్ భార్య‌, ఆయ‌న ఇద్ద‌రు పిల్ల‌లు అభ్యంత‌రం చెబుతున్నారు.

మాధురి ఎంట్రీతోనే శ్రీ‌నివాస్ త‌ప్పుదారి ప‌ట్టాడ‌ని, అత‌న్ని మాయ‌చేసి మాధురి వ‌ల‌లో వేసుకుంద‌ని ఆరోపిస్తున్నారు. అలాంట‌ప్పుడు శ్రీ‌నివాస్, మాధురి ల‌వ్ ట్రాక్‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌వ‌హారాన్ని పోల్చ‌డ‌మేమిట‌ని జ‌న‌సైనికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికితోడు త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌మ‌ని చెప్పినా జ‌గ‌న్ స‌స్పెండ్ చేయ‌లేద‌ని, అది కుటుంబ వ్య‌వ‌హార‌మ‌ని చెప్పార‌ని దువ్వాడ‌ శ్రీ‌నివాస్  చెప్పుకొచ్చారు. త‌మ నాయ‌కుడు గొప్ప వ్య‌క్తి అంటూ భజ‌న‌కూడా చేశారు. వాస్తవానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దువ్వాడ శ్రీ‌నివాస్ ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసి ఉంటే.. శ్రీ‌నివాస్ లాంటి వారు వైసీపీలో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్లంద‌రినీ స‌స్పెండ్ చేయాల్సి వ‌స్తుంది.  అదే చేస్తే పార్టీ మ‌నుగ‌డే ప్రశ్నార్థకమౌతుంది. అందుకే జ‌గ‌న్ భ‌య‌పడి ఉంటార‌ని  నెటిజ‌నులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురిలు త‌మ ప్రేమ వ్య‌వ‌హారాన్నిప‌వ‌న్ క‌ల్యాణ్ పెళ్లిళ్ల‌తో పోల్చ‌డం చూస్తుంటే వారి పిచ్చి ఏ స్థాయికి చేరిందో అర్ధ‌మ‌వుతోందని నెటిజనులు అంటున్నారు. 

By
en-us Political News

  
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.