దురంధర్ నటి ఆయోషా ఖాన్ అరెస్టు... ఎందుకో తెలుసా?

Publish Date:Jul 23, 2026

Advertisement

రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా తెరెకెక్కిన ధురంధర్  సినిమాలో నటించిన  నటి, బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ ను ముంబై పోలీసులు  అరెస్టు చేశారు. అయోషాఖాన్ అరెస్టు సినీ, రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.  నీట్ లీకేజీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ బయటకు వచ్చిన ఆయోషాఖాన్ ను ముంబై పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. 

 నీట్ లీకేజీకి వ్యతిరేకంగానూ, అలాగే  విద్యా వ్యవస్థలో సంస్కరణలను, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత  చేపట్టిన ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తూ ఆయేషా ఖాన్ బుధవారం (జులై 22) ముంబైలో జరిగిన ర్యాలీ, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

  ముంబై వీధుల్లో విద్యార్థులతో కలిసి  నిరసన తెలుపుతున్న సమయంలో పోలీసులు రంగంలోకి దిగి,  అనుమతి లేకుండా ఆందోళనలు నిర్వహిస్తున్నారంటూ   ఆయేషా ఖాన్‌తో పాటు ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఆయోషా ఖాన్ తాను శాంతియుతంగా ర్యాలీలో పాల్గొన్నాననీ, ఎలాంటి  ఎలాంటి నినాదాలు చేయలేదనీ అన్నారు.  రోడ్డుపై నిలబడటం కూడా నేరమా అని ప్రశ్నించారు. కాగా ఆయోషా ఖాన్ పోలీస్ వ్యాన్, పోలీస్ స్టేషన్ నుంచి తీసిన వీడియోలను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. నిష్కారణంగా తనను ముంబై పోలీసులు అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Durandhar actress Ayesha Khan arrested, Mumbay, Police, CJP, Prtests, Solidarity

By
en-us Political News

  
ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు ప్రాణం పోసిన డాక్టర్ మమత.. ప్రశంసల వెల్లువ..!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి తెలంగాణ ప్రాంత భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో బంగారు బోనాన్ని సమర్పించారు.
ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల నాటి సుదీర్ఘ స్వప్నం ఎట్టకేలకు సాకారమయ్యే దిశగా అత్యంత వేగంగా అడుగులు పడుతున్నాయి.
సినీ పరిశ్రమలో తన సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపారు.
కేంద్ర విద్యాశాఖలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ.. !
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి.
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా అడిగి తెలుసుకున్నారు.
దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సరిహద్దుల భద్రతను కాపాడేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ
బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.