డ్ర‌గ్స్ రాకెట్.. వైసీపీ నేత‌లకు బిగుస్తున్న ఉచ్చు!

Publish Date:Mar 23, 2024

Advertisement

గ‌త ఐదేళ్ల కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ దేశ‌ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.  ఆ గుర్తింపు అభివృద్ధిలో అనుకొని ప‌ప్పులో కాలేయ‌కండి!  అభివృద్ధిలో, ఆర్థిక ప్రగతిలో  ప్ర‌పంచవ్యాప్తంగా పేరుగాంచిన ప‌రిశ్ర‌మ‌లను రాష్ట్రానికి తీసుకురావ‌డంలో వ‌చ్చిన గుర్తింపుకాదు.  అరాచ‌క రాజ‌కీయాల‌కు, గంజాయి అక్ర‌మ ర‌వాణా, విక్ర‌యాలకు కేరాఫ్ అడ్ర‌స్సుగా మారడంతో వచ్చిన గుర్తింపు అది.  గంజాయి అడ్డాగా, డ్రగ్స్ హబ్ గా జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచంలోనే గుర్తింపు వచ్చింది.  జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అధికారం చేప‌ట్టిన నాటినుంచి గంజాయి విక్ర‌యాలు రాష్ట్రంలో విచ‌ల‌విడిగా పెరిగిపోయాయి. దానికి బానిస‌లుగా మారుతున్న‌వారు రోజురోజుకు పెరుగుతున్నారు. దీనికితోడు అరాచ‌క రాజ‌కీయాలు పెచ్చురెల్లుతున్నాయి. ఇవి చాల‌వ‌న్న‌ట్లు.. తాజాగా డ్ర‌గ్స్ మాఫియాకూడా ఏపీకి అడ్డాగా మారిన‌ట్లు క‌నిపిస్తోంది. విశాఖ ప‌ట్టణం స‌ముద్ర‌ తీరంలో అధికారులు భారీ ఎత్తున డ్ర‌గ్స్ ను ప‌ట్టుకున్నారు. ఈ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. రాష్ట్ర ఆర్థిక రాజ‌ధానిగాఉన్న, వైకాపా ప్ర‌భుత్వం త‌మ క‌ల‌ల రాజ‌ధానిగా చెప్ప‌కొంటున్న విశాఖ‌లో దేశ‌మంతా ఉలిక్కిప‌డేంత‌గా ఎన్నిక‌ల త‌రుణంలో రూ. ల‌క్ష‌ల కోట్ల విలువైన వేల కిలోల మాద్ర‌కద్ర‌వ్యాలు ప‌ట్టుబ‌డ‌టం తీవ్ర ఆందోళ‌న రేకెత్తిస్తోంది.


బ్రెజిల్‌ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు వచ్చిన కంటైనర్‌లో సుమారు 25వేల కిలోల డ్రగ్స్‌ ఉన్నట్లు సీబీఐ, నార్కోటిక్స్‌ అధికారులు గుర్తించారు. ఈనెల 19న నార్కోటిక్స్‌ సామగ్రి, నిపుణులతో వచ్చిన సీబీఐ అధికారులు ఆ కంటైనర్​లో భారీ మెత్తంలో డ్రగ్స్‌ ఉన్నట్టు నిర్ధరించుకున్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా అధికారులు వాటిని సీజ్ చేశారు. జర్మనీలోని హ్యాంబర్గ్‌ మీదుగా ఈ నెల 16న కంటైనర్‌ విశాఖకు వచ్చినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ డ్ర‌గ్స్  సంధ్యా ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుపై వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ వైసీపీ నేత‌దిగా అధికారులు గుర్తించిన‌ట్లు స‌మాచారం. దీని మేనేజింగ్ డైరెక్ట‌ర్‌ కోనం వీర‌భ‌ద్ర‌రావుగా తెలుస్తోంది. వీరు న‌లుగురు సోద‌రులు, వీరిలో ఇద్ద‌రు అమెరికాలో సెటిల్ కాగా.. మ‌రో ఇద్ద‌రు ఇక్క‌డ ఉంటున్నారు. వీర‌భ‌ద్ర‌రావు, అత‌ని సోద‌రుడికి వైసీపీతో, ముఖ్యంగా విజ‌య‌సాయిరెడ్డితో సంబంధాలు  ఉన్నాయి. సంక్రాంతి సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌, విజ‌య‌సాయి రెడ్డి, ఇత‌ర వైసీపీ పెద్ద‌ల ఫొటోల‌తో  వీర‌భ‌ద్ర‌రావు, అత‌ని సోద‌రుడు ప్లెక్సీలు సైతం వేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ అవుతున్నాయి. వైసీపీ నేత‌ల‌తో సంబంధం ఉన్న‌టువంటి కోనం వీర‌భ‌ద్రరావు కంపెనీకి  డ్ర‌గ్స్ ఆర్డ‌ర్ వ‌చ్చింద‌నేది అతిపెద్ద చ‌ర్చ‌గా మారింది. దీంతో ఈ డ్ర‌గ్స్ మాఫియా వెనుక వైసీపీ నేత‌ల హ‌స్తం ఉన్న‌ట్లు ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక్క‌డి నుంచి ఇత‌ర రాష్ట్రాల‌కు త‌ర‌లించి దీన్ని క్యాష్ రూపంలో మార్చాలని ప్లాన్ గా తెలుస్తోంది. కానీ, కేవ‌లం మేము రొయ్య‌ల మేత‌ కోస‌మే తెప్పించామ‌ని, అందులో కొకైన క‌లిసి ఉంద‌ని మాకు తెలియ‌ద‌ని వారు చెబుతున్న‌ప్ప‌టికీ.. అసలు ఇది ఎక్క‌డి నుంచి వ‌చ్చింది.. గ‌తంలో వీళ్ల‌కు ఏమైనా స‌రుకు ర‌వాణా అయిందా అనే విష‌యాల‌పై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.       

విశాఖ పోర్టుకు ఈనెల 16న చేరిన కంటెయిన‌ర్ ను తెరిపించేందుకు సీబీఐ అధికారులు ప్ర‌య‌త్నించే క్ర‌మంలో.. వైసీపీకి చెందిన కొంద‌రు బ‌డా నేత‌లు ఈ కంటెయిన‌ర్ తెర‌వ‌కుండా అడ్డుకునేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇందుకోసం వారు తమకు వత్తాసుగా కొందరు ప్రభుత్వాధికారులను కూడా వినియోగించడంతో వైసీపీ అండదండలతోనే డ్రగ్స్ వ్యవహారం నడుస్తోందని తేటతెల్లమౌతోంది. రూ. ల‌క్ష‌ల కోట్ల విలువైన డ్ర‌గ్స్ గ‌ట్టుర‌ట్టు కాకుండా వైసీపీ పెద్ద‌ల కోరిక మేర‌కు ప‌లువురు రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారులు త‌మ వ్య‌క్తిగ‌త హోదాల‌ను ఉప‌యోగించి కంటెయిన‌ర్ ను తెర‌వ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు సీబీఐ అధికారులు   చెబుతున్నారు. ఎలాంటి ఒత్తిడులకు లొంగకుంటా సీబీఐ అధికారులు కంటెయిన‌ర్ సీల్ తీశారు.  సీల్ తీసిన స‌మ‌యం నుంచి నాట్కో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, ఫ‌లితాలు, మ‌ళ్లీ తిరిగి సీల్ చేయ‌డం వ‌ర‌కు అన్నీ వీడియో తీయించారు.  ఇదిలా ఉంటే.. తాజా ప‌రిణామాల‌పై టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ స్పందించారు..  రెండేళ్ల క్రిత‌మే బ్రెజిల్ లో వైసీపీ నేత‌ల‌కు ఉన్న‌ చీకటి వ్యాపారాల గురించి తాను చెప్పాననీ,   ఇప్పుడు అదే నిజం అయ్యిందంటూ రెండేళ్ల క్రితం తాను మాట్లాడిన వీడియోను లోకేశ్ ఎక్స్ లో షేర్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ ముఠా పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతోంద‌ని, అధికారంలోకి రావడం అసాధ్యమని తేలిపోవడంతో ఆఖరి గడియల్లో వైసీపీ చీకటి మాఫియాలతో జాక్ పాట్ లు కొట్టే పనిలో నిమగ్నమయ్యాయ‌ని లోకేశ్ విమ‌ర్శించారు. విశాఖలోని వైసీపీ నేత‌ల‌కు చెందిన ఓ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకున్నాయంటే జె-గ్యాంగ్ ఎంత బరితెగిస్తుందో అర్థం చేసుకోవచ్చు.. ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ నూటికి నూరుపాళ్లు తాడేపల్లి ప్యాలెస్ అంటూ లోకేశ్ విమ‌ర్శించారు. 

విశాఖ‌లో దొరికిన భారీ డ్ర‌గ్స్ వెనుక వైసీపీ నేత‌లు ఉన్న‌ట్లు ఆధారాల‌తో స‌హా బ‌ట్ట‌బ‌య‌లు అవుతున్న క్ర‌మంలో ఆ పార్టీ పెద్ద‌లు కొత్త ప్లాన్ కు తెర‌లేపారు. ఎప్ప‌టిలాగే.. ప్రభఉత్వ ముఖ్య  సలహాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి మా ప్ర‌మేయం లేదంటూ బుకాయించే ప్ర‌య‌త్నం చేశాడు. అంతేకాదు..  టీడీపీ నేత‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, వారు ఆధారాలు లేకుండా   అబాండాలు వేస్తే మేము వాటికి స‌మాధానం చెప్పాలా? అంటూ స‌జ్జ‌ల‌ ప్ర‌శ్నించాడు. అంతే కాదు.. కంపెనీ ప్ర‌తినిధులు వైసీపీ పార్టీ నేత‌ల‌ని సోష‌ల్ మీడియాలో ప్లెక్సీలు రుజువు చేస్తున్నా.. స‌జ్జ‌ల మాత్రం కంపెనీ వాళ్లు పురందేశ్వ‌రి, చంద్ర‌బాబు బంధువులు అంటూ.. ఇదంతా ఓ సామాజిక వ‌ర్గం వాళ్ల‌ప‌నే అన్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేయ‌డం ఏపీ ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. దీనికి తోడు.. ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చిందంటే టీడీపీ ఏదో ఒక అభాండం వేసి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించాల‌ని చూస్తుందంటూ స‌జ్జ‌ల చాలా అమాయ‌కంగా మాట్లాడే ప్ర‌య‌త్నం చేశాడు.  దీంతో.. గ‌త ఎన్నిక‌ల్లో బాబాయ్‌ను హ‌త్య‌చేసి అధికారంలోకి వ‌చ్చింది ఎవ‌రు?  ప్ర‌జ‌ల సానుభూతి పొందేందుకు కోడిక‌త్తి డ్రామా ఆడింది ఎవ‌రు స‌జ్జ‌లా? అంటూ ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అధికారంకోసం ఎంత‌టి ప‌నికైనా తెగించే వైసీపీ నేత‌లు.. ఇప్పుడు త‌మ త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామాల‌కు తెర‌లేపుతుండ‌టంతో ప్ర‌జ‌లు వైసీపీ నేత‌ల తీరునే ఏవగించుకుంటున్నారు.

By
en-us Political News

  
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.