ఏపీ బీజేపీ పోటీ చేసే సీట్లపై అయోమయం!?

Publish Date:Mar 23, 2024

Advertisement

బీజేపీ ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయమైతే తీసేసుకుంది కానీ, పొత్తులో భాగంగా తాము పట్టుబట్టి మరీ తీసుకున్న స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.  ఈ సీటు.. కాదు కాదు ఆ సీటు అంటూ ఏపీ బీజేపీ నేతలు ఎక్కడా తమకు లేని విజయావకాశాలను పొత్తులో భాగంగా తమకు వచ్చిన నియోజకవర్గాలలో వెతుకులాటలో తీవ్ర గందరగోళానికి గురౌతున్నారు. పొత్తులో భాగంగా ఇప్పటి వరకూ బీజేపీ పోటీ చేస్తుందని అంతా భావిస్తూ వచ్చిన రాజంపేట లోక్ సభ నియోజకవర్గం తిరిగి తెలుగుదేశం కోటాకు బదలీ అయ్యింది. అందుకు బదులుగా బీజేపీ కడపలో పోటీకి దిగాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కడప లోక్ సభ నియోజకవర్గంలో దివంగత వైఎస్  కుటుంబ సభ్యులు పరస్పరం పోటీ పడుతున్న నేపథ్యంలో  అక్కడ పోటీ చేస్తే విజయావకాశాలు ఉంటాయని బీజేపీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  కడప లోక్ సభ స్థానం నుంచి  వైసీపీ  అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ అవినాష్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా వైఎస్ షర్మిలారెడ్డి పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో   వైఎస్ అభిమానుల ఓట్లు భారీ స్థాయిలో చీలిపోయే పరిస్థితి ఉందని భావిస్తున్న బీజేపీ అక్కడ తమ అభ్యర్థిని నిలబెడితే విజయం సునాయాసమని ఆశిస్తోంది.   ఆ స్థానం నుంచి సీఎం రమేష్, లేదా ఆదినారాయణరెడ్డిలను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.  

కాగా ఇప్పటివరకూ బీజేపీకి వెళ్లిందని భావిస్తున్న రాజంపేట ఎంపీ సీటు, తాజాగా తిరిగి టీడీపీ కోటాకు బదిలీ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. రాజంపేట లోక్ సభ నియోజకవర్గ  పరిథిలో ముస్లింల సంఖ్య గణనీయంగా ఉన్నందున  ఆ స్థానంలో బీజేపీ పోటీకి నిలిస్తే  ఓట్లు పడే అవకాశాలు తక్కువ అన్న భావనతో రాజంపేటను వదులుకుని విజయనగరం ఇవ్వాలని కమలం పార్టీ కోరుతున్నట్లుగా చెబుతున్నారు.  హిందూపురం నుంచి తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించడంతో బీజేపీ   అనంతపురం లోక్ సభ స్థానం కోరుతోంది.  

అదే విధంగా అసెంబ్లీ నియోజవకరగాల విషయంలో  బీజేపీ కసరత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఒక వేళ కడప ఎంపీ సీటు తీసుకుంటే, టీడీపీ ఇచ్చిన ఒకటి, జనసేన ఇచ్చిన 3 అసెంబ్లీ స్థానాలను టీడీపీకి వదిలేసే అవకాశాలున్నాయని బీజేపీకి చెందిన  ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. అప్పుడు అసెంబ్లీ బరిలో  బీజేపీ బలమైన కొద్ది మంది అభ్యర్ధులను మాత్రమే బరిలోకి దింపుతుందని అంటున్నారు. వాస్తవ బలాన్ని మించి పొత్తు చర్చల్లో పట్టుబట్టి మరీ ఎక్కవ స్థానాలను దక్కించుకున్న బీజేపీ, ఇప్పుడు ఆ స్థానాలలో  నిలబెట్టడానికి అభ్యర్థులు దొరకక ఇబ్బందులు పడుతున్నది.  పొత్తులో భాగంగా దక్కించుకున్న స్థానాలలో ఇప్పటి వరకూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన నేతలను నిలబెట్టడం సరికాదనీ, అలా జరిగితే ఓట్లు బదలీ అయ్యే అవకాశాలు ఉండవనీ చర్చల సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టిగా చెప్పిన నేపథ్యంలో బీజేపీ ఇంత కాలం వైసీపీతో అంటకాగిన కొందరు నేతలను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు పొత్తులో భాగంగా వచ్చిన స్థానాలలో నిలబెట్టే అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోందని చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ పార్టీ అభ్యర్థులుగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి,  అలాగే రఘురామకృష్ణం రాజు. కొత్తపల్లి గీత, సీఎం రమేష్  పేర్లు మాత్రమే ఖరారయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా శనివారం సాయంత్రానికల్లా బీజేపీ తరఫున ఏపీలో పోటీ చేయనున్న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  బీజేపీలో అభ్యర్థుల ప్రకటనలో జరుగుతున్న జాప్యం కారణంగా పొత్తు ప్రమాదంలో పడిందన్న వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో పార్టీ అగ్రనాయకత్వం స్పష్టమైన వివరణ ఇచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో ఎలాంటి పొరపొచ్చాలూ లేవనీ, మిత్ర ధర్మానికి అనుగుణంగానే తమ అడుగులు పడుతున్నాయనీ స్పష్టం చేసింది. అదే విధంగా జనసేన, తెలుగుదేశం పార్టీలూ చెబుతున్నాయి.  

By
en-us Political News

  
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.