ఎవరీ ద్రౌపది ముర్ము.. ఏమిటామె కథ!

Publish Date:Jun 22, 2022

Advertisement

రాష్ట్రపతి అభ్యర్థిగా పలువురు పేర్లు తెరపైకి వచ్చినప్పటికి ప్రధాని మోదీ అండ్ కో మాత్రం.. చివరి నిమిషంలో ద్రౌపది ముర్ము వైపు మొగ్గు చూపారు. దీంతో అధికార ఎన్డీఏ కూటమి.. తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని బరిలో నిలిపింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఇటీవల పలువురి పేర్లు వినిపించినాయి... వాటిలో ద్రౌపది ముర్ము పేరు కూడా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. చివరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని సైతం రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ప్రకటించే అవకాశం ఉందనే ఓ వార్త  మంగళవారం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. అయితే చివరినిమిషంలో మోదీ అండ్ కో.. ద్రౌపది ముర్ముని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడానికి గల రిజన్.. రిజనింగ్ ఏమిటీ..  ఇంతకీ ఆమె ఎవరు ?.. ఆమె స్వస్థలం ఎక్కడ?... ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ? తదితర విషయాలు తెలుసుకొనేందుకు నెటిజన్లు.. గుగూల్‌లో తెగ సెర్చి వెతికేస్తున్నారు.  

ఆ నేపథ్యంలో ద్రౌపది ముర్ము గురించిన వివరాలు  క్లుప్తంగా.. భారతదేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒడిశా ఒకటి. అలాంటి రాష్ట్రంలో మరింత వెనకబడిన జిల్లాల్లో మయూర్ భంజ్ ఒకటి. ఆ జిల్లాలోని బైడపోసి గ్రామంలో 1958, జూన్ 20 ద్రౌపది ముర్ము ఓ పేద కుటుంబంలో జన్మించారు. గిరిజనుల్లోని సంథాల్ తెగకు చెందిన ఆమె పేదరికపు అడ్డంకులను వరుసగా అధిగమిస్తూ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రమాదేవి డిగ్రీ కాలేజీలో ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేసి.. సాగునీరు,  విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించారు. అలాగే రాయ్‌రంగాపూర్‌లోని శ్రీ అరబిందో సమీకృత విద్యాకేంద్రంలో ఉపాధ్యాయులురాలిగా   ఆమె స్వచ్ఛందంగా పని చేశారు.

 అనంతరం 1997లో రాయ్‌రంగ్‌పూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఆమె బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అలా రాజకీయాల్లోకి ప్రవేశించిన ద్రౌపది ముర్ము.. ఆ తర్వాత అంటే 2000లో రాయ్‌రంగ్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టారు. అంతేకాదు.. నాడు అంటే 2000 - 2004 మధ్య నాటి బిజూ జనతాదళ్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రవాణా, మత్స్య, వాణిజ్య శాఖ మంత్రిగా కూడా పని చేశారు. 2004లో ఆమె రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ క్రమంలో ఒడిశాలో ఉత్తమ పని తీరు కనబరిచిన ఎమ్మెల్యేలకు ఇచ్చే నీలకంఠ అవార్డును ఆమె 2007లో అందుకున్నారు.  

ఈ ద్రౌపది పని తీరును గమనించిన కమలదళం ఆమెకు బీజేపీ ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్ష, ఉపాధ్యక్షరాలిగా కీలక బాధ్యతలు అప్పగించింది. అలాగే 2010, 2013లో మయూర్‌భంజ్ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. అనంతరం బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఆమెను కమలం పార్టీ నియమించింది. 2015, మే 18న ద్రౌపది జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. దీంతో జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా ద్రౌపతి ముర్ము చరిత్ర సృష్టించారు.

 మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో ఎన్డీఏ కూటమికి అత్యధిక బలం ఉంది. అలాగే మోదీ ప్రభుత్వానికి పలు రాష్ట్రాల్లోని బీజేపీ యేతర ప్రభుత్వాలు సైతం మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక నల్లేరు మీద నడకే అని రాజకీయ మేధావులు సైతం స్పష్టం చేస్తున్నారు. అయితే ఆమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడితే.. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. అలాగే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా కూడా ఆమె ఖ్యాతి గాంచనున్నారు. అయితే ఇప్పటివరకు భారత రాష్ట్రపతిగా ఎన్నికైన వారంతా 1947కు ముందు జన్మించిన వారే కావడం గమనార్హం.   

ఇంకోవైపు ద్రౌపది ముర్ము.. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను   చవిచూశారని. ఆమె బంధువులు పేర్కొంటున్నారు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి ఉన్నారు. అయితే ద్రౌపది భర్తతోపాటు ఇద్దరు కుమారులు గతంలోనే మరణించారని వారు చెబుతారు. భర్త, ఇద్దరు కుమారులు మరణించడంతో.. ద్రౌపది తన కుమార్తె ఇతిశ్రీనే సర్వస్వం అయిందని..  ఇతిశ్రీకి వివాహం అయి.. ఆమెకు ఓ పాప కూడా ఉందని వారు పేర్కొంటారు.   ఇటీవలే ద్రౌపది ముర్ము.. తన 64వ పుట్టిన రోజును జరుపుకున్నారు. పుట్టిన రోజు జరుపుకున్న మరునాడే.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించడం పట్ల ద్రౌపది ముర్ము... సంతోషం వ్యక్తం చేశారు.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.