Publish Date:Aug 23, 2022
ఆసియా కప్ 2022 పోటీలకు ముందు టీం ఇండియా జట్టు హెడ్ కోచ్రా హుల్ ద్రావిడ్ కరోనా బారిన పడ్డారు. ఆసియా కప్ పోటీలకు వెళ్లే ముందు క్రికెట్ జట్టు క్రీడాకారులు, ఇతర సభ్యులకు ముందస్తు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో రాహుల్ ద్రావిడ్ కు పాజిటివ్ అని మంగళవారం తేలింది. యునై టెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కరోనా నెగిటివ్ తో వచ్చిన రాహుల్ ద్రావిడ్ కు తాజా పరీక్షల్లో కొవిడ్ పాజి టివ్ అని తేలిందని బీసీసీఐ తెలిపింది. రాహుల్ ద్రావిడ్ బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, నెగిటివ్ రిపోర్టు వచ్చాక రాహుల్ ద్రావిడ్ టీంతో కలుస్తారని బీసీసీఐ పేర్కొంది. రాహుల్ ద్రావిడ్ సెలక్షన్ కమిటీలో ఉండటం వల్ల జింబాబ్వే సిరీస్ కు వెళ్లలేదు.
కాగా కోవిడ్ అనేది కేవలం ఫ్లూ వంటిదేనని దీన్ని కారణంగా చేసుకుని ద్రావిడ్ను టోర్నీకి దూరం చేయ డం పట్ల టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి మండిపడ్డాడు. ఆగష్టు 28 ఆదివారం దుబాయ్ లో ఆరంభం కానున్న టోర్నీ తొలి మ్యాచ్లో భారత్ జట్టు చిరకాల ప్రత్యర్ధి పాక్తో తలపడుతుంది. కానీ డ్రసింగ్ రూమ్లో ద్రావిడ్ లేనిలోటు తెలుస్తుందని శాస్త్రి అన్నారు.
కోవిడ్ను అంత సీరియస్ గా తీసుకోవడమేమిటన్నారు. కోవిడ్ సంబంధించిన మందులు వాడితే సరి పోతుందని, అందుకు డాక్టర్లు సలహాలు సూచనలు ఎలాగూ ఉంటాయి. కానీ టోర్నీ మొత్తానికి ఆ కారణం చెప్పి ద్రావిడ్ను దూరం చేయడం సబబు కాదని అభిప్రాయపడ్డాడు. అయితే ద్రావిడ్ యుఎఇ కి జట్టు తో పాటు వెళ్లడానికి ముందు జరిపిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చిన కారణంగానే ద్రావిడ్కు అవకాశం ఇవ్వలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసియా కప్ టీ-20 టోర్నీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, భారత్, పాకిస్తాన్ పాల్గొంటున్నాయి. వాస్తవానికి భారత్, పాకిస్తాన్ ల మధ్య ద్వైపాక్షిక టోర్నీలు రద్దయ్యాయి. కానీ ఇతర టోర్నీల్లో పోటీపడుతూనే ఉన్నాయి. ఆసియాకప్ తొలి మ్యాచ్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ తలపడతాయి. అలాగే భారత్, పాక్ పోటీపడతాయి. గత ఏడాది దుబాయ్లో జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్లో భారత్ పది వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dravid-miss-asiacup-due-to-covid-25-142510.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.