రైతుల ఆస్తులను కొల్లగొట్టేందుకు ఉద్దేశించిన లాండ్ టైటిలింగ్ యాక్ట్.ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుచేయాలని జగన్ ప్రభుత్వం మొండి పట్టుదలతో వున్న నేపథ్యంలో, ఈసారి ఎన్నికలలో జగన్కి ఓటే్స్తే మీ ఆస్తి జగన్కి రాసిచ్చినట్టే అని చెప్పే స్టాంప్ పేపర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘‘2024 సంవత్సరం, మే నెల 13న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఫ్యాన్ గుర్తుపై నొక్కడం ద్వారా యావదాస్తిని దానంగా ఇస్తున్నాం. ఇక మీదట మాకు, మా కుటుంబ సభ్యులకు ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నాకు తెలిసి విజ్ఞతతో తీసుకున్న నిర్ణయం’’ అంటూ జగన్ ఫొటో వాటర్ మార్కుగా వున్న వంద రూపాయల స్టాంపు పేపర్ మీద రాసి వుంది. స్టాంపు పేపర్ మీద జగన్ ఫొటో, ఫ్యాన్ గుర్తు, మరోపక్క లాండ్ టైటిలింగ్ యాక్ట్.కి సంబంధించిన లోగో వుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ స్టాంప్ పేపర్ మీద ప్రజల్లో చర్చ జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dont-vote-to-jagan-39-175495.html
ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ వివరాలు
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-2
ఏపీ అసెంబ్లీ.. ఇదిగో అన్ని సర్వేల సారాంశం!
ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ మొత్తం వైసీపీకి వ్యతిరేకంగా వచ్చాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా జగన్ పార్టీకి షాక్ తగిలింది.
సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. జూన్ 4న ఫలితాలు అధికారికంగా వెలువడతాయి. అయితే ప్రజా నాడి ఎలా ఉంది అనేది తెలుసుకునేందుకు ఎగ్జిట్ పోల్స్ చాలా వరకూ దోహదం చేస్తాయి.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ!
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమిదే అధికారం అని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చేసింది. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ సొంతంగా 95 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది.
ఏపీ లోక్సభ సర్వే మరింత విస్తారంగా...
లోక్సభ స్థానాల్లోనూ వైసీపీకి పెద్ద దెబ్బ
ఏపీలో ఎవరు గెలవబోతున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతోందా? మరో సారి వైసీపీ అధికార పీఠాన్ని దక్కించుకోబోతుందా? ఒకవేళ తెలుగుదేశం కూటమి గెలిస్తే ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లు వైసీపీకి ఘోర పరాభవం తప్పదా?
ap parliment Exit polls, exit poll, ap exit polls, andhra pradesh elections 2024, ap elections 2024, exit poll, pre poll survey
కూటమిదే భారీ విజయం: జనగళం
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలు విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ లో తెలుగుదేశం హవానే సూచిస్తున్నాయి. దాదాపు వందకు పైగా స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ముందుగా పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం కూటమికి 125 స్థానాలు, వైసీపీకి 50 స్థానాలు వస్తాయి.