Publish Date:Oct 17, 2022
రెండు పిల్లి పిల్లలు ఆడుతూ రోడ్డు మీదకి వెళిపోతోంటే కుక్క వచ్చి అమాంతం నోటితో పట్టి ఇవతలకు తెచ్చి పడేసింది. అపుడు నిజానికి వాటిని రోడ్డు మీదనే వదిలేయాలి. కానీ అలా చేయలేదు. దానిలో తల్లి ప్రేమ అలా చేయనీయలేదు. వాటి పరిస్థితి దానికి అర్దమయింది గనుక తీసుకువచ్చి ఓ గోడ దగ్గర పరిచిన దుప్పటి మీద పడేసి దగ్గరికి లాక్కుంది. అలా వెళ్లకం డమ్మా..చనిపోతారు..అన్నట్టు హెచ్చరించింది. వాటి తల్లి ఎటు వెళ్లిందో, చనిపోయిందో తెలీదుగాని కుక్కకి మాత్రం అవి అనాథ లన్నది అర్ధమయింది.
అనాధపిల్లల్ని చూస్తే అయ్యో అనిపిస్తుంది. వీరి భవిష్యత్తు ఏమవుతుందని అనుకుంటాం. చాలామంది తల్లి మనసు వ్యక్తం చేస్తారు. కొందరే ముందుకు వచ్చి సాయం చేస్తారు. పిల్లల విషయంలో సాధారణంగా కుల,మత ప్రసక్తి లేకుండా ప్రేమను ప్రదర్శిం చడం పరిపాటి. ఇది జంతువుల్లోనే ఎక్కువ. కొన్ని పక్షులు వేరే పక్షుల గూటిలో గుడ్లుపెట్టడం గురించి విన్నాం. జంతువులు తమకు అస్సలు పడని జంతువుల పిల్లల్ని సమస్యలో ఉండగా చూస్తే వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇద ప్రకృతి విచిత్రం. పిల్లంటే కుక్కకి అస్సలు పడకపోవచ్చు. కానీ పిల్లి పిల్లలు అనాధగా పడి ఉంటే కుక్క వాటిని జాగ్రత్తగా చూసుకుంటూం టుంది. ఆఖరికి పెద్ద పిల్లి వచ్చినా వాటిని వదలదేమోనన్నంతగా ప్రేమిస్తాయి, తన పిల్లలంత ప్రేమగా చూసుకుంటాయి.
దీన్ని భారత్ మాజీ క్రికెట్ స్టార్ వివి ఎస్ లక్ష్మణ్ తన ట్విటర్లో పోస్టు చేశాడు. తన మనోహరమైన స్ట్రోక్ ఆటకు ప్రసిద్ధి చెందిన భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సోమవారం మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో హత్తుకునే వీడియోను పంచుకున్నారు. తల్లి పిల్లి మరణించిన తర్వాత కుక్క పిల్లి పిల్లలను చూసుకుంటున్నట్లు వీడియో చూపిస్తుంది.
పిల్లి తల్లి మరణించిన తర్వాత పిల్లి పిల్లలను చూసుకునే కుక్క తల్లి. మాతృత్వం అనేది మరొక వ్యక్తికి సర్వస్వం కావడంలో ఉన్న సున్నితమైన అసౌకర్యం అనే క్యాప్షన్తో లక్ష్మణ్ వీడియోలను షేర్ చేశాడు.
సమస్త జీవరాశుల తల్లులందరికీ కృతజ్ఞతలు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dont-run-away-like-that-kits-39-145605.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.