Publish Date:May 27, 2023
తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ పై సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పు బుధవారానికి వాయిదా పడింది. అంత వరకూ అవినాష్ ను అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు అదేశించింది. అంతకు ముందు వరుసగా రెండో రోజు అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. అవినాష్ ను కస్టోయిల్ విచారణ చేయాల్సిందేనని సీబీఐ అధికారులు విస్పష్టంగా చెప్పారు.
గురువారం (మే26)ఇదే కేసులో అవినాష్ తరఫు న్యాయవాదులు, అలాగే సునీత తరఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు శుక్రవారం (మే27) సీబీఐ తరఫు వాదనలు వింది. ఈ సందర్భంగా కోర్టు సీబీఐ తీరు పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినాష్ ను ఇన్నాళ్లూ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. కనీసం ఆయన ఫోన్ ను కూడా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీసింది. ఆ ప్రశ్నలన్నిటికీ సీబీఐ తరఫు న్యాయవాదులు సమాధానాలు ఇచ్చారు. చివరికి తీర్పు బుధవారం వెలువరించనున్నట్లు కోర్టు చెప్పింది. అయితే బుధవారం అవినాష్ ను విచారణకు పిలుస్తామని సీబీఐ తరఫు న్యాయవాదులు పేర్కొనగా, అందుకు అవినాష్ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తల్లి ఆస్పత్రిలో ఉన్నందున ఆయన రాలేరని పేర్కొన్నారు.
దీంతో కోర్టు తుది తీర్పును బుధవారం వెలువరిస్తామని పేర్కొంటూ అంత వరకూ అవినాష్ ను అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. మొత్తం మీద కోర్టు తీర్పు అవినాష్ రెడ్డికి అనుకూలంగానే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో అవినాష్ రెడ్డి సీబీఐకి రాసిన లేఖలో కూడా మే 27(శనివారం) తరువాత సీబీఐ ఎప్పుడు రమ్మంటే అప్పుడు విచారణకు వస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఆయన (బుధవారం) మే 31 వరకూ విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ రోజు ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు వెలవరించనుంది. ఏది ఏమైనా ఈ ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ సందర్భంగా పలు కీలక, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో సీఎం జగన్ పేరు ప్రస్తావనకు వచ్చింది.
వివేకా హత్య విషయం అవినాష్ ద్వారా జగన్ కు ప్రపంచానికి తెలియడానికి ముందే తెలుసునని తమ విచారణలో వెల్లడైందనీ, దానిని నిర్ధారించుకోవాలంటే అవినాష్ ను అరెస్టు చేసి విచారించాల్సిందేనని సీబీఐ విస్పష్టంగా పేర్కొంది. అలాగే హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందనీ, హత్య జరిగిన వెంటనే అవినాష్ వాట్సాప్ కాల్స్ చేశారనీ నిర్ధారణ అయ్యిందనీ, ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకోవాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. ఆ సమయంలో కోర్టు జోక్యం చేసుకుని ఇంత కాలం అవినాష్ ఫోన్ స్వాధీనం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించింది. చివరకు అవినాష్ బెయిలు పిటిషన్ పై తీర్పు బుధవారం(మే31)కి వాయిదా వేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dont-arrest-avinash-till-wednesday-39-155954.html
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.