హర్మూజ్ మాదే.. ట్రంప్.!

Publish Date:Aug 18, 2026

Advertisement

 ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని అమెరికా  భూభాగంగా ప్రకటిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  సంచలన ప్రకటన చేశారు. హర్మూజ్ జలసంధి అమెరికా నూతన భూభాగంగా ప్రకటించిన ట్రంప్ అందుకు సంబంధించి మ్యాప్ ను కూడా విడుదల చేశారు.  తన  సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ వేదికగా ఇందుకు సంబంధించిన  మ్యాప్‌ను ఆయన షేర్ చేశారు. ఇరాన్‌తో కుదిరిన 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం గడువు ముగిసిన మరుసటి రోజే  ట్రంప్ ఈ ప్రకటన చేయడం విశేషం. 

హర్మూజ్ జలసంధిలో అమెరికా పూర్తి నియంత్రణ సాధించిందని ట్రంప్ ఆ పోస్టులో విస్పష్టంగా పేర్కొన్నారు,  అక్కడ సముద్ర మార్గంలో ఇరాన్  గతంలో అమర్చిన   మైన్‌ లు అన్నింటినీ అమెరికా బలగాలు పూర్తిగా తొలగించాయని ట్రంప్ పేర్కొన్నారు.  సరుకు రవాణా నౌకల రాకపోకలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయన్నారు. 

అయితే..  జలసంధిలో సాధారణ రవాణా పునరుద్ధరించినప్పటికీ.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికాదళ దిగ్బంధం యథావిధిగా కొనసాగుతుందనీ, ప్రస్తుతం ఇరాన్ పాలక వర్గంతో   దౌత్యపరమైన చర్చలు జరగడం లేదని, సమీప భవిష్యత్తులో కూడా ఇరాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ట్రంప్ ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు. ట్రంప్ ప్రకటనపై ప్రపంచ దేశాల నుంచి, క్షేత్రస్థాయి పరిశీలకుల నుంచీ  వాస్తవానికి అక్కడ పరిస్థితులు ట్రంప్ చెబుతున్నంత సరళంగా లేవని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా మంగళవారం (ఆగస్టు 18) కూడా ఆ జలసంధి మార్గంలో వెళ్తున్న ఒక భారీ  క్యారియర్ నౌకపై  జరిగిన దాడిలో నౌకలోని పలువురు సిబ్బంది గాయపడ్డారు. 

ఈ  దాడుల నేపథ్యంలో యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఏజెన్సీ ఆ మార్గంలో ప్రయాణించే సరుకు రవాణా నౌకలు, ట్యాంకర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, భద్రతా ప్రమాణాలను కఠినంగా పాటించాలని సూచించింది. ట్రంప్ ప్రకటనల కంటే క్షేత్రస్థాయిలో ఉన్న ప్రమాదకర పరిస్థితులే ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్నాయని రవాణా సంస్థలు భావిస్తున్నాయి.

మరోవైపు ట్రంప్ సోషల్ మీడియా ప్రకటనపై ఇరాన్  ఘాటుగా స్పందించింది. కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఉన్న జలసంధిని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని రిటార్డ్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధి అమెరికా కొత్త భూభాగంగా భావించడం పగటి కలగా పేర్కొంది.   అమెరికా దిగివచ్చే వరకూ హర్మూజ్ జలసంధిని సాధారణ వాణిజ్యానికి సంపూర్ణంగా తెరవడం సాధ్యపడదని  కుండబద్దలు కొట్టింది. 

Donald Trump, Strait of Hormuz, US Iran Tensions, Truth Social Post, Middle East Conflict 

By
en-us Political News

  
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో  దోషిగా  తీహార్ జైళ్లో  శిక్ష అనుభవిస్తున్న సజ్జన్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను జైలు అధికారులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.  
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల సవరణ బిల్లుఅలాగే  ఏపీ ఉన్నత విద్య నియంత్రణ,  పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లుకు కూడా శాసనమండలి  ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే..  విద్యారంగంలో ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు సైతం సభ ఆమోదం పొందింది.
 దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన చంద్రబాబు నొక్కి చెప్పారు.  అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను సమర్థవంతంగా అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు  ప్రతిపాదించారు.
హర్మూజ్ జలసంధిలోని దక్షిణ మార్గంలో, ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా నియంత్రణలోని ఈ ప్రత్యేక కారిడార్‌..  సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి  ఇంధన ఉత్పత్తి దేశాల నుంచి చమురు నింపుకున్న ట్యాంకర్లతో పాటు, ఖాళీగా తిరిగొచ్చే నౌకలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తూ రవాణాను సమన్వయం చేస్తున్నది.
ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి,  రేచర్ల బొగ్గు బ్లాకులను ఎంపిక చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ వేలం ప్రక్రియ ద్వారా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఈ రెండు  బొగ్గు బ్లాకులను దక్కించుకుంది.
దాదాపు వెయ్యి కోట్ల రూపాయల  విదేశీ చెల్లింపుల  వ్యవహారంలో పన్ను ఎగవేత, యు అక్రమ నిధుల మళ్లింపు ఆరోపణలపై ఐటీ అధికారులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏకకాలంలో  13 ప్రాంతాలలో సోదాలు చేపట్టారు.  ఈ సోదాల్లో డిజిటల్ ఆధారాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో తన వాటాను 9.99 శాతానికి పెంచుకోవడానికి ఎల్‌ఐసికి ఆర్బీఐ అనుమతి లభించింది. ఈ వార్తతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు ధర 1% పెరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ డోపింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. కొకైన్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ITIA అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్ కప్ పూల్ డి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ 5 3 తేడాతో సంచలన విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో చెలరేగి జట్టుకు ఘన విజయాన్ని అందించిన పూర్తి వివరాలు చూడండి.
బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో పీవీ సింధు, ఆయుష్ శెట్టి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. సాత్విక్ చిరాగ్ జోడీకి వాకోవర్ లభించగా, లక్ష్యసేన్ తీవ్ర పోరాటంలో ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ ఫలితాలు, కీలక గణాంకాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
అంతర్జాతీయ చెస్ రంగాన్ని ఏలుతున్న భారత్! ప్రతిష్టాత్మక సింక్‌ఫీల్డ్ కప్‌లో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించి అగ్రస్థానానికి చేరుకున్న ఆర్. ప్రజ్ఞానంద. మరోవైపు ఆసియాన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అండర్ 11 బాలికల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. పూర్తి వివరాలు చదవండి.
నాసా ప్రతిష్టాత్మక స్విఫ్ట్ గామా-రే టెలిస్కోప్ రెస్క్యూ మిషన్ విఫలమైంది. $30 మిలియన్ల వ్యయంతో చేపట్టిన రోబోటిక్ క్రాఫ్ట్ నియంత్ పిలవకపోవడంతో మిషన్‌ను నాసా రద్దు చేసింది. త్వరలోనే భూ వాతావరణంలో మండిపోనున్న స్విఫ్ట్ టెలిస్కోప్ పూర్తి వివరాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.