అందుకే కిరణ్ విభజనను వ్యతిరేఖించారా?

Publish Date:Mar 29, 2014

Advertisement

 

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పార్టీలో ఉన్న తన ప్రత్యర్ధులను బలంగా అణచివేశారు. అంతేగాక చాలా నిరంకుశ పోకడలు ప్రదర్శిస్తూ తన క్యాబినెట్ సహచరులతో కూడా సంప్రదించకుండా అనేక కీలక నిర్ణయాలు తీసుకొనేవారు. తన నిర్ణయాలను ప్రశ్నించిన శంకర్ రావు, డా.డీయల్.రవీంద్ర రెడ్డి వంటి వారిని నిర్దాక్షిణ్యంగా పదవుల నుండి తప్పించి వారిని పార్టీలో ఏకాకులుగా చేసి పగ తీర్చుకొన్నారు. ఆయన అధికారంలో ఉన్నంత వరకు పార్టీలో ఆయన ప్రత్యర్దులెవరూ ఆయనకు వ్యతిరేఖంగా మాట్లాడే సాహసించలేకపోయారు. బహుశః అందువల్లే ఆయన పార్టీ వీడే సమయానికి ఆయన వెనుక పదిమంది కాంగ్రెస్ నేతలు కూడా కనబడలేదు. ఆయన పార్టీ నుండి బయటపడి స్వంత కుంపటి పెట్టుకొన్న తరువాత, అంతవరకు ఆయనపై రగిలిపోతున్న కాంగ్రెస్ లో మిగిలిన నేతలందరూ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

 

ఆయనను తీవ్రంగా వ్యతిరేఖించే మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అయితే మరొక అడుగు ముందుకు వేసి, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను ప్రజల కోసం కాక పార్టీలో తమవంటి బీసీ వ్యక్తులు ఉన్నత పదవులు పొందకుండా ఉండేందుకే ఆయన విభజనను వ్యతిరేఖించారని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగితే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవులవంటి కీలక పదవులను ఆశిస్తున్న బీసీ నేతలు రఘువీర, బొత్స తదితరులకు దక్కే అవకాశం ఉంది గనుకనే ఆయన విభజనను అంత తీవ్రంగా వ్యతిరేఖించారని ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డిపై కోపంతో రగిలిపోతున్న డొక్కా ఇటువంటి ఆరోపణలు చేయడం పెద్ద విచిత్రం కాకపోయినా, ఆయన చేసిన ఆరోపణలతో కిరణ్ పోరాటంలో మరో కొత్త కోణాన్ని బయటపెట్టారు.

 

ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో అధికారమంతా రెడ్డి కులస్థుల చేతిలోనే ఎక్కువగా ఉంది. కనుక అదే కులానికి చెందిన కిరణ్ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చేందుకు అయిష్థత చూపడం అసహజమేమీ కాదు. కానీ అది కూడా ఒక కారణమయితే కావచ్చునేమో కానీ అందుకోసమే ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేఖించారనే డొక్కా వాదనలలో పసలేదు. ఒకవేళ ఆయన ఎవరికయినా పదవులు దక్కకుండా అడ్డుపడదలిస్తే అందుకు ఇంత పోరాటం అవసరం లేదు. నేరుగా డిల్లీ వెళ్లి అధిష్టానం దగ్గిర తనపలుకుబడిని ఉపయోగించి దామోదర రాజనరసింహకు హోంమంత్రి పదవి దక్కకుండా ఏవిధంగా అడ్డుపడ్డారో అదేవిధంగా విభజన తరువాత కూడా చేయగలిగేవారు.

 

కానీ, ఆయన చివరి వరకు కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నలలో పనిచేస్తూ, రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరిస్తూనే, పార్టీ వ్యూహంలో భాగంగానే దానిని వ్యతిరేఖిస్తున్నట్లు నటిస్తూ పార్టీ వ్యతిరేఖ ఓట్లను కూడా కాంగ్రెస్ ఖాతాలో జామా చేసేందుకే ఆయన అధిష్టానం ఆదేశాల మేరకే పార్టీ పెట్టారు. ఆయన రాష్ట్ర విభజనలో అధిష్టానానికి పూర్తిగా సహకరించారని చిరంజీవే స్వయంగా చెపుతున్నారు. కానీ కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టడమనేది వేరే సంగతి.

 

అందువలన డొక్కా వంటివారు కిరణ్ గురించి నోరు జారేముందు కొంత ఆలోచించుకోవడం మంచిది. ఎందుకంటే ఆయన పార్టీ ఆదేశాలమేరకే వేరు కుంపటి పెట్టుకొన్నారు గనుక ఎన్నికల తరువాత మళ్ళీ దానిని కాంగ్రెస్ లో విలీనం చేసేక అధిష్టానం మళ్ళీ ఆయనకీ కీలక పదవి ఏదో కట్టబెడితే అప్పుడు ఆయన డొక్కా వంటి వారిని కూడా ఆయన శంకరగిరి మాన్యాలు పట్టించడం ఖాయం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.