ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కుక్క కూడా ఓటు వేయబోతోంది. పోలింగ్ బూత్లోకి వెళ్లి తనకూ ఓటు హక్కు ఉందని ఓటర్ లిస్ట్లో తన ఫొటో చూపించి మరీ ఓటు హక్కును వినియోగించుకోబోంది. అదేంలటీ... కుక్కకు ఓటా... అని నోరెళ్ల బెడుతున్నారా? మీరు చదువుతున్నది నిజమే. ఇప్పటివరకు హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లు, సెలబ్రిటీలకు మాత్రమే పలు గ్రామాల్లో ఓటు హక్కు కల్పించిన అధికారులు... ఈసారి గ్రామ సింహం కుక్క గారికే ఏకంగా ఓటు హక్కు కల్పించేశారు. ఇంతకీ, కుక్కకు ఓటు హక్కు కల్పించిన ఆ ప్రబుద్దులు ఎవరనే కదా మీ సందేహం. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ అధికారులు చేసిన నిర్వాకం ఇదీ.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోన్న అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేపట్టారు. అయితే, ఫైనల్ ఓటరు లిస్టును విడుదల చేసిన ఏలూరు కార్పొరేషన్ అధికారులు... ఓటరు జాబితాలో కుక్క ఫొటో ఓటు హక్కు కల్పించారు. ఏలూరు 12వ డివిజన్ లో బన్నీ గార పేరుతో 5928 సీరియల్ నెంబర్ తో పోలింగ్ స్టేషన్ నెంబర్ 194లో కుక్కకు ఓటు ఉన్నట్లు చూపించారు. అయితే, అధికారులు పంపిన ఓటరు జాబితాలో కుక్క బొమ్మతో ఓటు హక్కు కల్పించినట్లు ఉండటంతో లీడర్లు నోరెళ్లబెడుతున్నారు. ఆహా మన అధికారులు ఎంత గొప్పోళ్లో... కుక్కకు కూడా ఓటు హక్కు కల్పించారంటూ నోరెళ్ల బెడుతున్నారు.
కుక్కకు ఓటు హక్కే కాదు... ఏలూరు కార్పొరేషన్ లో పలుచోట్ల వేర్వేరు సీరియల్ నెంబర్లు, పోలింగ్ బూతుల్లో ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు కల్పించారు. కొందరికైతే, ఏకంగా ఏడేసి ఓట్లు ఉండటాన్ని చూసి పొలిటికల్ లీడర్స్ తోపాటు జనం అవాక్కవుతున్నారు. అధికారుల పనితీరు గొప్పగా ఉందంటూ నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా కుక్కకు ఓటు హక్కు కల్పించడాన్ని చూసి ఇదేం విడ్డూరమంటూ నవ్వుకుంటున్నారు. మన అధికారుల పనితీరు భలేగుందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా, కుక్కకు ఓటు హక్కు కల్పించిన ఘనత ఏలూరు అధికారులకు దక్కిందంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dog-photo-appears-in-voter-list-in-eluru-25-94025.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.