మోదీ స్టెప్ డౌన్?

Publish Date:Apr 3, 2025

Advertisement

ప్రధాని నరేంద్రమోడీ తన పదవిని త్యాగం చేస్తారా? పార్టీ నిబంధనను అనుసరించి తనకు 75 సంవత్సరాలు నిండగానే ప్రధాని పదవి నుంచి స్టెప్ డౌన్ అవుతారా? ప్రధాని మోడీ తనకు తాను ఆ నిబంధనను వర్తింప చేసుకుంటారా? అన్న ప్రశ్నలకు రాజకీయ పరిశీలకుల నుంచి అనుమానమే అన్న సమాధానమే వస్తున్నది.  ప్రధానిగా మోడీ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ 75 ఏళ్ల పరిమితి నిబంధన మేరకే బీజేపీ సీనియర్ నాయకులు ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి నాయకుల చేత పొలిటికల్ రిటైర్మెంట్ చేయించారు.  మరి ఇప్పుడు అదే నిబంధన మేరకు మోడీ తనంత తానుగా రాజకీయాలకు దూరమౌతారా? అన్న చర్చ ఇప్పుడు పార్టీలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ లో క ొనసాగుతోంది.  శివసేన (ఉద్ధవ్ ధాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ అయితే త్వరలోనే మోడీ వారసుడు రాబోతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత దశాబ్ద కాలంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లని ప్రధాని నరేంద్రమోడీ  ఇటీవల అంటే గత ఆదివారం నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లడానికి కారణం అదేనని ఆయన అంటున్నారు. 
మోడీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లడానికి ప్రారంభోత్సవమనో, మరోటనో కారణాలు చెప్పి ఉండొచ్చు కానీ, ప్రధాన కారణం మాత్రం తన పదవీ విరమణపై ఆర్ఎస్ఎస్  చీఫ్ మోహన్ భగవత్ తో చర్చించడానికేనని సంజయ్ రౌత్ గట్టిగా చెబుతున్నారు.  మొత్తం మీద సంజయ్ రౌత్ మోడీ స్టెప్ డౌన్ పై ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసినా, ఆయన వ్యాఖ్యలు ఒక్క సారిగా దేశంలో రాజకీయ హీట్ పెంచేశాయని చెప్పక తప్పదు. అదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలను గట్టిగా ఖండించారు.  మోడీయే 2029లో కూడా ప్రధానిగా ఉంటారని ఢంకా బజాయించి మరీ చెప్పారు. ప్రధానిగా మోడీ యాక్టివ్ గా ఉన్నారనీ, అటువంటి సమయంలో ఆయనకు ప్రత్యామ్నాయం గురించి మాట్లాడటంతో అర్ధం లేదనీ ఫడ్నవీస్ అంటున్నారు.  ప్రధాని మోడీ నాగపూర్ ఆర్ఎస్ఎష్ కార్యాలయం సందర్శన సందర్భంగా ఆయన రాజకీయ వారసుడికి సంబంధించి ఎటువంటి చర్చా జరగలేదనీ, అసలా ప్రస్తావనే రాలేదనీ ఆర్ఎస్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి.  

అయితే ఏడున్నర పదుల వయస్సు నిండిన నేతల రాజకీయ విరమణ అంశంపై బీజేపీలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశాలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలెవరికీ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా నోరెత్తే అవకాశం ఇసుమంతైనా లేదు. గతంలో  అడపాదడపా పార్టీ నాయకుడు ఎలా ఉండాలి అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినా, ఇప్పుడు ఆయన నాయకత్వం మార్పుపై కానీ, 75 ఏళ్ల నిండిన వారు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించాలన్న విషయంపై కానీ మాట్లాడే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.  

ఇప్పుడు పార్టీలో మోడీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్నప్పటికీ.. ఆయన తరువాత ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం కోసం అటు ఆర్ఎస్ఎస్, ఇటు బీజేపీ కూడా ఎదురు చూస్తున్నాయనడంలో సందేహం లేదు.  నితిన్ గడ్కరీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లలో ఎవరో ఒకరు మోడీ తరువాతి స్థానం అంట నంబర్ 2లో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనీ, ఆ నంబర్ 2 యే మోడీ వారసుడన్న ప్రచారం జరుగుతోంది. 

ఇప్పుడే కాదు. మోడీ రెండో సారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ యోగి ఆదిత్యనాథ్ రూపంలో ఆయన పోటీ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ, షా ద్వయం యోగి పట్ల అంత సదభిప్రాయంతో లేరనీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు అదే కారణంతో ఆర్ఎస్ఎస్ మాత్రం యోగికి మద్దతుగా నిలబడుతోందని అంటున్నారు. 

హిందుత్వ భావాలను ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తం చేయడం, ప్రచారం చేయడం ద్వారా యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ గుడ్ లుక్స్ లో ఉన్నారు. అంతే కాకుండా తనదైన ప్రత్యేక   శైలితో శాంతి భద్రతలను పరిరక్షించడం ద్వారా యోగి పార్టీ నేతలు, క్యాడర్ నుంచి గట్టి మద్దతు సాధించారనీ అంటున్నారు.  అన్నిటికీ మించి యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచే వచ్చారు. పలు సందర్భాలలో య ోగి తాను పదవులు ఆశించననీ, యూపీ సీఎంగా తనది పార్ట్ టౌం జాబ్ మాత్రమేనని పలు సందర్భాలలో యోగి చెప్పారు.  

By
en-us Political News

  
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.