పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అనూహ్య పతనాన్ని చవిచూసింది. బెంగాల్ ప్రజల చేత దీదీగా పిలిపించుకున్న మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయమే కాదు.. స్వయంగా తన ఓటమినీ చవి చూశారు. అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీయే అన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు పార్టీకి వెన్నెముకగా నిలిచిన సీనియర్ నేతలను దూరం చేసుకోవడం.. పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలే తృణమూల్ను దెబ్బతీశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు. సీనియర్లను గౌరవించకుండా.. అభిషేక్ బెనర్జీ తన వర్గానికే పెద్దపీట వేయడం వల్ల పార్టీ లోపల అసమ్మతి జ్వాలలు చెలరేగి, చివరకు అది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషిస్తున్నారు.
నందిగ్రామ్ పోరాటం ద్వారా మమతను అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి, అభిషేక్ తీరుతో విసిగిపోయి బీజేపీలో చేరారు. గతంలో నందిగ్రామ్లో మమతపై గెలిచిన ఆయన, తాజా ఎన్నికల్లో మమతకు కంచుకోట అయిన భవానీపూర్ స్థానంలోనే ఆమెను ఓడించి చరిత్ర సృష్టించారు. కష్టపడి పనిచేసే నాయకులను పక్కన పెట్టడం వల్ల కలిగే నష్టానికి మమతా బెనర్జీ భారీ మూల్యం చెల్లించుకున్నట్లయింది.
అభిషేక్ బెనర్జీ అనుసరించిన డైమండ్ హార్బర్ మోడల్' పాలనలో అక్రమాలు జరిగాయనీ.. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని విపక్షాలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఈవీఎంలపై నెపం నెట్టడం.. ఎన్నికల కమిషన్తో ఘర్షణ వంటి చర్యలు ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయి. టీఎంసీలోని పాత తరం నేతలు కూడా అభిషేక్ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్నారనేది బహిరంగ రహస్యం.
మమత మేనల్లుడికి అపరిమితమైన అధికారాలు ఇవ్వడం టీఎంసీ పతనానికి దారితీయగా, సువేందు అధికారి పట్టుదల బీజేపీకి బెంగాల్ గడ్డపై మొదటిసారి అధికారాన్ని కట్టబెట్టింది. ఈ పరిణామాలతో బెంగాల్ రాజకీయాల్లో మమత-అభిషేక్ శకం ముగిసిందని, సువేందు నాయకత్వంలో కొత్త అధ్యాయం మొదలైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/do-you-know-who-is-behind-didi-downfall-in-west-bengal-39-219273.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.