ఎన్డీయే, ఇండియా కూటములు ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వర్క్ షాపులు, అవగాహన సదస్సులు నిర్వహించాయి. వీటిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే.. మొదటి ప్రాధాన్యతా ఓటు తప్పనిసరి, రెండో ప్రాధాన్యతా ఓటు ఐచ్ఛికం. ఆ తర్వాత ఈ ఓటింగ్ విధానంలో పాల్గొనడానికి ఒక ప్రత్యేకమైన పెన్ను ఇస్తారు. దీని ద్వారా మాత్రమే బ్యాలెట్ పేపర్ పై గుర్తులు పెట్టాలి. ఇక బ్యాలెట్ పేపర్ లో మొదటి పేరు కూటమి అభ్యర్ధి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిది ఉండగా.. రెండో పేరు ఎన్డీయే కూటమి అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ పేరు ఉంటుంది.
అందుకే బీజేపీ తన ఎంపీలతో పాటు ఎన్డీయే కూటమి ఎంపీలను కలిపి జేపీ నడ్డా అధ్వర్యంలో వేర్వేరు వర్క్ షాపులు నిర్వహించింది. ఆ తర్వాత ఇండియా కూటమి సైతం మాక్ పోల్ నిర్వహించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే ఇండియా కూటమి పార్టీల ఎంపీలకు ఈ విషయంపై ఒక అవగాహన కల్పించాలన్నదే ఈ మాక్ పోల్ ముఖ్య ఉద్దేశం.
ఇక మంగళవారం (సెప్టెంబర్ 9) పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితం కూడా వెలువడుతుంది. ఉభయ సభల్లో ఇప్పటి వరకూ ఉన్న బలాబలాలు చూస్తే ఎన్డీఏకి 422 సీట్ల బలం ఉంది. ఇక ఇండియా కూటమికి 323 సీట్ల సపోర్ట్ ఉంది. ఆప్ కూడా తన 11 సీట్లను ఇండియా కూటమి అభ్యర్ధికే ఇస్తోంది. దీంతో ఈ బలం 334గా మారింది. చివర్లో కొన్ని తటస్త పార్టీల ఎంపీలు ఇటు వైపు మొగ్గితే ఈ సంఖ్య కొంత పెరిగినా పెరగొచ్చు. అలాగని ఎన్డీఏ అభ్యర్ధిని క్రాస్ చేయగలిగేంత కాదు. ఇప్పటికే ఎన్డీయే అభ్యర్ధి గెలుపు దాదాపు లాంఛనం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే విజయానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 392 కన్నా ఎన్డీయే కూటమి సభ్యుల సంఖ్య ఎక్కువే ఉంది. దీంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం నల్లేరు మీద బండినడకే అంటున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలుగువాడైన సుదర్శన్ రెడ్డికి తెలుగు పార్టీలన్నీ కలసి ఓట్లు వేయాలని కోరింది. ఈ ఎన్నికలో ఫలానా అభ్యర్ధికే ఓటు వేయాలని ఎవరూ విప్ జారీ చేయరు కాబట్టి.. ఈ దిశగా స్థానిక బీఆర్ఎస్, టీడీపీ, జనసేన, వైసీపీలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది మరి చూడాలి.. ఏదైనా మేజిక్ జరుగుతుందో లేదో?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/do-you-know-the-key-issue-in-vice-president-election-39-205780.html
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.