శ్రీవారికి విరాళాలిచ్చేభ‌క్తుల‌కు టీటీడీ అందించే సౌకర్యాలేంటో తెలుసా?

Publish Date:Dec 15, 2025

Advertisement

తిరుమల వెంక‌టేశ్వ‌ర స్వామివారికి రూ. 1లక్ష నుంచి.. రూ.1కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ కొన్ని ప్రత్యేక సౌకర్యాలు అందజేస్తున్నది.   తిరుమల శ్రీవారి సేవలో భాగంగా విరాళాలు అందించే భక్తులకు, టీటీడీ ప్రత్యేక దర్శన,వసతి, ప్రసాదం వంటి పలు అవకాశాలను కల్పిస్తోంది. విరాళం మొత్తాన్ని బ‌ట్టి భక్తులకు అందే సౌకర్యాలు, అవకాశాలు ఉంటాయి. 

 1లక్ష రూపాయల నుంచి   5 లక్షల రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులు, ఆ విరాళానికి సంబంధించిన నగదు ధృవీకరణ రశీదు,  ఆదాయపు పన్ను మినహాయింపు ధ్రువీకరణ పత్రం,1 రోజు ఐదుగురికి సుపథం దర్శనం, అలాగే వంద రూపాయల టారిఫ్ ఒక రోజు వసతి కల్పించడంతో పాటు, ఆరు చిన్న లడ్డూలు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ టీటీడీ ఇస్తుంది.  

అలాగే ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ రశీదు, ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ, ఒక ఏడాదిలో 3 రోజులు  ఐదుగురికి   సుపథం దర్శనం,  వంద రూపాయల టారిఫ్ తో 3 రోజుల వసతి కల్పించడంతో పాటు, 10 చిన్న లడ్డూలు, 5 మహాప్రసాదాలు,  ఒక దుపట్టా, 1 బ్లౌజ్ పీస్ ఇస్తారు.

ఇక 10లక్షల రూపాయల నుంచి  పాతిక లక్షల రూపాయల వరకూ విరాళం  ఇచ్చే వారికి నగదు ధృవీకరణ రశీదు,  ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ, ఏడాదిలో మూడు రోజులు ఐదుగురికి విఐపి బ్రేక్ దర్శనం,   అలాగే వెయ్యిరూపాయల టారిఫ్ తో  3 రోజుల వసతి కల్పించడంతో పాటు,  20 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ తో పాటు  50 గ్రాముల శ్రీవారి వెండి నాణెం టీటీడీ అంద జేస్తుంది. 

అలాగే పాతిక లక్షల నుంచి  50 లక్షల రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ, పన్ను మినహాయింపు ధృవీకరణతో పాటు ,  ఏడాదిలో ఒక రోజు  ఐదుగురికి  మందికి సుపథం దర్శనం, 3 రోజులు ఐదుగురికి విఐపి బ్రేక్ దర్శనం,  1500  రూపాయల టారిఫ్ తో   3 రోజుల వసతి కల్పించడంతో పాటు, 4 పెద్ద లడ్డూలు, 5 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, 5 గ్రాముల బంగారు డాలర్ + 50 గ్రాముల వెండి నాణెం, ఒక దుపట్టా, ఒక  బ్లౌజ్ పీస్ టీటీడీ అందిస్తుంది. 

ఇక పోతే.. 50 లక్షల నుంచి  75 లక్షల రూపాయల విరాళం ఇచ్చే భక్తులకు  నగదు ధృవీకరణ + పన్ను మినహాయింపు ధృవీకరణ, ఒక రోజు సుప్రభాత సేవ, 5 గురికి రెండు రోజులు  సుపథం దర్శనం, ఐదుగురికి, మూడు రోజులు విఐపి బ్రేక్ దర్శనం, అలాగే ఐదుగురికి రూ.2000 టారిఫ్‌తో మూడు రోజుల వసతి, 10 చిన్న లడ్డూలు, పది పెద్ద లడ్డూలు, పది మహా ప్రసాదాలతో పాటు 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెం, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ అందిస్తుంది. ఇక 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులకు  నగదు ధృవీకరణ, పన్ను మినహాయింపు, రెండు రోజులు సుప్రభాత సేవ-, ఐదుగురికిమందికి, 3 రోజులు సుపథం దర్శనం- ఐదుగురికి 3 రోజులు విఐపి బ్రేక్ దర్శనం, అలాగే ఐదుగురికి  రూ.2500 టారిఫ్‌తో 3 రోజుల వసతి,  8 పెద్ద లడ్డూలు, 15 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, 5 గ్రాముల బంగారు డాలర్ + 50 గ్రాముల వెండి నాణెంతో  పాటు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ అందజేస్తుంది. కోటి రూపాయలు అంత కన్నా  ఎక్కువ విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ రశీదు, పన్నుమినహాయింపు దృవీకరణ,  ఏడాదిలో 3 రోజులు ఐదుగురికి సుప్రభాత సేవ, వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాలు, బంగారు డాలర్, వెండి నాణెం, దుపట్టా, జాకెట్ పీస్ సహా పలు అదనపు సౌకర్యాలను టీటీడీ కల్పిస్తుంది.  

By
en-us Political News

  
పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని ఇకపై అధికారికంగా త్యాగాల దినంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఏపీ మాజీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌కి బెయిల్‌ ఏసీబీ కోర్టు మంజూరు చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడి నిందితులపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
సీఎం చంద్రబాబు హైదరాబాద్ నగర శివార్లలోని ఆధ్యాత్మిక కేంద్రమైన కన్హా శాంతివనం ఆశ్రమాన్ని సందర్శించారు.
హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాన్స్‌జెండర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
వాహనాలు నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు
పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల అక్రమ దందా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ఉగ్రవాదుల దాడిలో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన సిరియా వలసదారు అహ్మద్‌ అల్‌ అహ్మద్‌ ఇప్పుడు రియల్ హీరోగా నిలిచారు.
నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి రాజీనామాకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆమోదం తెలిపారు.
ఇండియాలో మూడు రోజుల వీక్లీ ఆఫ్ ల పరిస్థితి ఏంటి? ఈ విషయంలో కొత్త లేబర్ కోడ్స్ ఏం చెబుతున్నాయి? లేబర్ కోడ్స్ సూచిస్తున్న మేరకు ఆ దిశగా నిబంధనల అమలు సాధ్యమేనా? అన్న చర్చ నడుస్తోంది.
రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
జీహెచ్‌ఎంసీ డివిజన్ల పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది.
నూతన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ రాజ్‌కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.