ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని విజయవాడకు ఆనుకుని ఉండే గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నిస్సందేహంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై అత్యంత కీలకమైనది. 1955లో నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచీ ఇక్కడ నుంచి పలువురు ప్రభావమంతమైన నేతలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం వంటి దిగ్గజాలను చట్ట సభకు పంపిన నియోజకవర్గం ఇది. గన్నవరం నియోజకవర్గం నుంచి పుచ్చల పల్లి సుందరయ్య మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికైనా 2009 నుంచి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేం పార్టీకి కంచుకోటగా మారింది.
సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇక్కడ నుంచి వరుసగా రెండు సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే రెండో సారి విజయం సాధించిన తరువాత వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరిపోయారు. దీంతో కొద్ది కాలం పాటు తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో నాయకత్వ శూన్యత ఏర్పడింది. అయితే గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు తెలుగుదేశం గూటికి చేరి రానున్న ఎన్నికలలో వంశీకి గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో యార్లగడ్డకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని వీడిన తరువాత వల్లభనేని వంశీకి నియోజకవర్గంలో ప్రతికూలత పెరిగింది.
ముఖ్యంగా వైసీపీ గూటికి చేరిన వంశీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆయనకు స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీనికి తోడు వైసీపీలో కూడా వంశీకి వ్యతిరేకంగా పలువురు గ్రూపు కట్టడంతో ఆ పార్టీలో కూడా ఆయన మాటకు చెల్లుబాటు లేకుండా పోయింది. ఒక దశలో రాజకీయ సన్యాసం అంటూ సెంటిమెంట్ రగల్చడానికి ప్రయత్నించిన వంశీ చివరకు గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయినా ఆయనకు వైసీపీ శ్రేణుల నుంచి సంపూర్ణ మద్దతు అయితే లభించడం లేదు. ఇందుకు విరుద్ధంగా గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు వెంట తెలుగుదేశం క్యాడర్ మొత్తం ఏకతాటిపై నిలబడింది. తెలుగుదేశం నుంచి విజయం సాధించి వైసీపీలోకి జంప్ చేసిన వంశీని నియోజకవర్గంలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు.
ముఖ్యంగా నియోజకవర్గంలో బలమైన కమ్మ సామాజిక వర్గం ఆయనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. తాను చంద్రబాబు, ఆయన కుటుంబీకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వంశీ బహిరంగంగా క్షమాపణలు చెప్పినా ఫలితం లేకపోయింది. మరోవైపు యార్లగడ్డకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల నుంచీ మద్దతు కనిపిస్తోంది. మొత్తం మీద వల్లభనేని వంశీకి ఈ ఎన్నికలు చావో రేవోగా మారాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/do-or-die-situation-for-vamshi-in-gannavaram-25-173428.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.