డీఎల్ ఓపెన్ అయిపోయారు.. కూటమికే జై కొట్టారు!

Publish Date:Apr 10, 2024

Advertisement

డీఎల్ రవీంద్రారెడ్డి  కడప జిల్లాకు చెందిన ఈ మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత. వైఎస్ రాజశేఖరరెడ్డికి సమకాలీనుడైన డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు నుంచి పలు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో  ఓ వెలుగు వెలిగారు.  కడప జిల్లాకు చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నారు. వైఎస్సార్ తో విభేదాలున్నా కడప జిల్లాలో  ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంపై గట్టి పట్టు సాధించారు.   

ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న గుర్తింపు ఉన్న డీఎల్ రాయల సీమ సమస్యలపై గట్టిగా నిలబడి పోరాడిన వ్యక్తిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.  వైఎస్ మరణం తరువాత జగన్ ను ఎదుర్కొనే విషయంలో రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీఎల్ పైనే అధారపడింది. రాష్ట్ర విభజన  సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్న డీఎల్.. రాష్ట్ర విభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  2019 ఎన్నికలలో పోటీ చేయలేదు.  కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో  వైసీపీలో  చేరారు. హైద్రాబాద్ లోటస్ పాండ్ లో ఆయన అప్పట్లో వైఎస్ జగన్ ను  కలిశారు. అంతకు ముందు జగన్ దూతగా సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా రవీంద్రారెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయనను వైసీపీలోకి ఆహ్వానించారు. ఆయన వైసీపీ గూటికి చేరారు.

అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఆయన ఆ పార్టీకి దూరం జరిగారు. అధికారికంగా వైసీపీకి రాజీనామా చేయకపోయినా పార్టలో క్రియాశీలంగా లేరు. జగన్ సర్కార్ టార్గెట్ గా విమర్శలు చేస్తూ వచ్చారు.   సామాజికవర్గ కోణంలో తనపై ఒత్తిడి తెచ్చి వైసీపీలో చేరేలా ప్రోత్సహించారనీ, కానీ తాను వైసీపీలో చేరి ఎంత తప్పు చేశానో తరువాత కానీ అర్ధం కాలేదంటూ డీఎల్ రవీంద్రారెడ్డి ఆ తరువాత పలు సందర్భాలలో ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో దురదృష్టకరమైన పరిస్థితులు నెలకొన్నాయనీ,  వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందనీ విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ లక్ష్యంగా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్ర పాలకులు సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా  పనిచేస్తున్నారని, రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదనీ చెబుతూ పరోక్షంగా సజ్జలపైనా విమర్శలు గుప్పించారు.  

అయితే ఆ తరువాత కారణాలేమైనా  సైలెంట్ అయిపోయారు. అయినా మైదుకూరు నియోజకవర్గంలో ఆయన పట్టు ఇసుమంతైనా సడలలేదనే చెప్పాలి. అదును చూసి దెబ్బకొట్టిన చందంగా ఇంత కాలం వైసీపీకే కాదు, అసలు రాజకీయాలకే దూరంగా ఉన్న రవీంద్రారెడ్డి సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు బయటకు వచ్చి తాను తెలుగుదేశం కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎలా చూసుకున్నా ఇది ఇప్పటికే అంతంత మాత్రం గెలుపు అవకాశాలతో ఎదురీదుతున్న వైసీపీకి గట్టి షాక్ అనడంలో సందేహం లేదు. ఆయన మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతు ప్రకటించి ఊరుకోకుండా రాష్ట్రంలో రాబోయే సర్కార్ తెలుగుదేశం కూటమిదేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అలాగే కడప లోక్ సభ నియోజకవర్గంలో అవినాష్ రెడ్డిని గెలిపించాలా? వైఎస్ బిడ్డ షర్మిలను గెలిపించాలా అన్నది నిర్ణయించుకోవలసింది ప్రజలేనన్న డీఎల్ రవీంద్రారెడ్డి.. ఆ నిర్ణయం తీసుకునేముందు మాత్రం వివేకం సినిమా చూడాలని అన్నారు. ఆన్ లైన్ లో విడుదలై సంచలనం సృష్టిస్తున్న వివేకం సినిమాలో వైఎస్ హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డిని నేరస్థుడిగా చూపారు. ఆ సినిమా చూసి ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోండంటూ పిలుపు నివ్వడం ద్వారా డీఎల్.. అవినాష్ ను గెలిపించవద్దని ప్రజలకు పరోక్షంగా సూచించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.