ఆర్సీబీ జెర్సీలో కర్నాటక డిప్యూటీ సీఎం.. ఎందుకంటే?

Publish Date:Jun 3, 2025

Advertisement

ఐపీఎల్ 2025 ముగింపు దశకు వచ్చింది. మంగళవారం (జూన్ 3)  సాయంత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ తో ఐపీఎల్ విజేత ఎవరన్నది తేలిపోతుంది. ఈ సారి ఫైనల్స్ లో ఇటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచినా, అటు పంజాబ్ కింగ్స్ విజయం సాధించినా.. చరిత్రే. ఎందుకంటే.. ఇప్పటి వరకూ 17 సార్లు   జరిగిన ఐపీఎల్ లో ఈ రెండు జట్లూ విజేతగా నిలిచింది లేదు. అందుకే ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలిచినా తొలి సారి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న జట్టుగా నిలుస్తుంది. 

అదంతా పక్కన పెడితే.. ఐపీఎల్ జట్లన్నిటిలోనూ అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న జట్లు బెంగళూరు మాత్రమే. అందులోనూ ఆ జట్టు కీలక ఆటగాడు కింగ్ కోహ్లీ జెర్సీ నంబర్ 18.. అలాగే ఇప్పుడు జరుగుతున్నది కూడా 18వ ఎడిషన్ కావడంతో ఈ సారి బెంగళూరు జట్టు ట్రోఫీ ముద్దాడటం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. దేశంలోనే అత్యంత పెద్ద ఫ్యాన్ బేస్‌ ఉన్న ఆర్సీబీ ఐపీఎల్‌లో 18 సీజన్లలో ఏకంగా పది సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నప్పటికీ, టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది.  దీంతో ఫ్యాన్స్ ఈ సారి ఎలాగైనా ఆర్సీబీయే కప్ సాధిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఇందు కోసం పూజలు చేస్తున్నారు. 'ఈ సాల కప్ నమ్దే!' అంటూ ఉత్సాహంతో రెచ్చిపోతున్నారు.

ఆర్సీబీ ఫ్యాన్ బేస్ లో దిగ్గజ మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. లిటిల్ మాస్టర్, లెజండరీ సునీల్ గావస్కర్ ఈ సారి ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిస్తే.. దేశంలో ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని స్థాయిలో సంబరాలు అదే సెలిబ్రేషన్స్ చూస్తామని వ్యాఖ్యానించారు. మరో దిగ్గజ మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అయితే.. తాను పంజాబ్ కింగ్స్ కే సపోర్ట్ చేస్తానని ట్వీట్ చేశాడు. అలా ట్వీట్ చేసి ఊరుకోలేదు.. తాను మద్దతు పలికిన జట్టు గెలవదు అంటూ ముక్తాయించాడు. అంటే తాను ఎంత గట్టిగా ఆర్సీబీ విజయాన్ని కోరుకుంటున్నానన్నది సెహ్వాగ్ అలా వ్యక్తం చేశాడు.

ఇక పొలిటీషియన్స్ లో కూడా ఆర్సీబీకి బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అయితే ఏకంగా ఆర్సీబీ జెర్సీ ధరించి ఈ సాల కప్ నమ్దే అంటూ వీడియో రిలీజ్ చేశారు.  ఇది ఒక మ్యాచ్ మాత్రమే కాదు. మన క్షణం. మన కప్. ఆల్ ది వెరీ బెస్ట్ ఆర్‌సీబీ..  కర్ణాటక ప్ర‌జ‌లందరూ మీకే మద్దతు ఇస్తూ మీ వెంటనే ఉన్నారంటూ డీకే శివకుమార్ పేర్కొన్నారు.  చూద్దాం మరి అశేష అభిమానుల కలను ఆర్సీబీ ఈ సారి నెరవేరుస్తుందేమో. 

By
en-us Political News

  
జూన్ 25..  ఇది కొంద‌రి పాలిట ఒక పీడ‌క‌ల‌. మ‌రి కొంద‌రి జైలు జీవితానికి  కార‌ణం. 1975 నుంచి 1977 వ‌ర‌ూ మొత్తం 21 నెల‌ల కాలం.. నాటి ప్ర‌ధాని ఇందిర విధించిన ఈ అత్య‌యిక స్థితి దేశ చ‌రిత్ర‌లోనే ఒక‌ చీక‌టి అధ్యాయం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. విచారణ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతు ఫోన్ ట్యాపింగ్ విచారణ ఇంకా ఎంతకాలం చేస్తారని ఎంపీ ప్రశ్నించారు.
వైసీపీ అధినేత జగన్‌పై మరో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. దీనిపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
తన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలియడంతో కేబినెట్ భేటీలో ఉన్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
ఎప్పుడో ముత్యాల ముగ్గు సినిమాలో నిత్యపెళ్లి కొడుకు క్యారెక్టర్ ను చూశాం. డబ్బు కోసం పెళ్లిళ్లు చేసుకుంటూ పోయే అలాంటి నిత్యపెళ్లికొడుకులకు సంబంధించి వార్తలు మీడియాలో విన్నాం. కన్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది నిత్య పెళ్లికూతురి గురించి.
హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలసి టెన్త్ క్లాస్ చదువుతున్న భాలిక కన్నతల్లినే కడతేర్చింది. తెలంగాణ ఉద్యమకారిణి , తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ మునిమనవరాలైన అంజలిని ఆమె 16ఏళ్ల కూతురు తేజశ్రీ దారుణంగా హతమార్చింది.
మన పాలకొల్లు అమ్మాయి ఏకంగా అంతరిక్షయానం చేయనుంది. ఇప్పటి వరకూ భారత్ లో పుట్టి ఇక్కడే నివసిస్తున్న మహిళ అంతరిక్షయానానికి ఎంపికైన చరిత్ర లేదు. అయితే అంతరిక్షయానానికి ఎంపికై మన పాలకొల్లు అమ్మాయి జాహ్నవి చరిత్ర సృష్టించింది.
కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.. ఇప్పుడు కాదేదీ పోలీసు కంప్లైంట్ కు అనర్హం అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. తాజాగా కుకట్ పల్లి పోలీసు స్టేషన్ లో అరుదైన కేసు నమోదైంది. అదేంటో తెలుసా.. కొన్న ప్యాకెట్ పాలు విరిగిపోయాయంటూ దుకాణదారుడిపై కేసు పెట్టాడో పెద్దమనిషి.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహిత అనుచరులపై కేసు నమోదైంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ ను కారులో వెంబడించారన్న ఆరోపణలపై వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ లోకేష్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ లపై పులివెందుల పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.
తిరుమలలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి కంపార్ట్ మెంట్లలో, క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది. దర్శన అనంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలు చేయడానికి కూడా మళ్లీ బోలెడంత సేపు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (జూన్ 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో సంవత్సర కాలంలోనే చేసి చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
నిజానికి చంద్ర‌బాబుది బాహుబ‌లి ఐడియా. ఆయ‌న రాయి రాయి కొట్టుకుంటూ పోరు. ఒక్క దెబ్బ‌తో కొడితే కొండ ఎలా పిండి అవుతుందో చేసి చూస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.