Publish Date:Aug 26, 2022
కరోనా వ్యాక్సిన్ వేయించుకోనందుకు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మరో గ్రాండ్ స్లామ్కూ దూరమ య్యాడు. వ్యాక్సిన్ తీసుకోని వారికి అమెరికాలో ప్రవేశానికి అనుమతి లేదు. సోమవారం మొదల య్యే ఈ ఏడాది ఆఖరి గ్రాండ్స్లామ్ యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నట్టు జొకోవిచ్ గురువారం ప్రకటిం చాడు. టీకా వేసుకోని జోకోను ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలి యన్ ఓపెన్ ఆడేందుకు అనుమతించని విషయం తెలిసిందే. వ్యాక్సిన్ వేసుకోకుండా ఆస్ట్రేలియా లో అడుగుపెట్టిన నొవాక్ను బలవంతంగా ఆ దేశం నుంచి పంపించారు.
ఇప్పటి వరకు మూడు సార్లు చాంపియన్గా నిలిచిన నొవాక్ జొకోవిచ్ తాను న్యూయార్క్లో జరిగే యూ ఎస్ ఓపెన్లో పాల్గొనేందుకు నేను ప్రయాణం చేయలేక పోతున్నాని, ఇది విచారకరమనీ అన్నాడు. అయితే తనకు మద్దతు, ప్రేమ తెలిపిన వారికి ధన్యవాదాలు. సహచర ప్లేయర్లకు గుడ్ లక్` అని ట్వీట్ చేశారు.
35 ఏళ్ల సెర్బియన్ ఖాతాలో 21 గ్రాండ్స్లామ్ టైటిళ్లున్నాయి. స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ (22 టైటి ల్స్) కంటే ఒకటి తక్కువ. దీన్ని తాజా గ్రాండ్స్లామ్లో జొకో సాధిస్తాడని అభిమానులు ఆశించారు. అతను 2011, 2015, 2018లో మూడుసార్లు విజేతగా నిలిచాడు. మరో ఆరుసార్లు రన్నరప్గా తృప్తి పడ్డాడు. ఇంతటి ఘన రికార్డు ఉన్న అతనికి న్యూయార్క్లో మరో టైటిల్ గెలవడం, నాదల్ రికార్డును సమం చేయడం కష్టం కాదు. అయితే అమెరికా, కెనడా దేశాల్లో స్వదేశీయులు తప్ప టీకా తీసుకోని విదేశీయులను అనుమ తించడం లేదు
కొవిడ్ ప్రొటోకాల్స్ ప్రకారం అమెరికాకు వెళ్లడానికి జొకోవిచ్. వ్యాక్సినేషన్ చేయించుకున్న వారు మాత్రమే అమెరికాకు వెళ్లడానికి నిబంధనలు అనుమతినిస్తాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆస్ట్రే లియా ఓపెన్ టెన్నిస్ టోర్నీకి ముందు వెనక్కు పంపిన సంగతి తెలిసిందే. ఇలా ఒక టెన్నిస్ ఓపెన్ చాంపి యన్ షిప్కు జొకోవిచ్ దూరం కావడం ఇది రెండోసారి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/djokovic-messes-us-open-reason-39-142707.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.