క్లైమాక్స్ సీన్ కోసం దివాకర్ రెడీ, మరి బొత్స?

Publish Date:Oct 28, 2013

Advertisement

 

ఇంతవరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు పదవి నుండి తప్పించబోతోందనే దాని పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆయన కంటే ముందుగా సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి క్లైమాక్స్ యాక్షన్ సీన్ చేసేందుకు ఆరాటపడుతున్నట్లు కనిపిస్తున్నారు.

 

మొన్న జగన్ సభకు కాంగ్రెస్ అధిష్టానం మద్దతు ఉందని ప్రకటించి అందరినీ నివ్వెరపరిచిన ఆయన, ఈ రోజు మరో అడుగు ముందుకు వేసి, తమ అధిష్టానం కేంద్రంలో అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతోనే ముందుకు సాగుతూ అటు తెరాసతో, ఇటు వైకాపాతో పొత్తులకు సిద్ధపడుతోందని, జగన్ 25 ఎంపీ సీట్లకు హామీ ఇచ్చినందునే తమనందరినీ పక్కన బెడుతోందని ఆరోపించారు.

 

తమ అధిష్టానం కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఆరాటపడుతుంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేప్పటి ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నాడని ఆయన తీవ్ర విమర్శలు చేసారు. తనకు కొత్త పార్టీ గురించి ఎటువంటి ఆలోచన లేదని, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఇప్పుడే ఎవరూ ఏమి చెప్పలేరని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు పలకడం అనవసరమని భావించవచ్చు గనుక, రాష్ట్ర విభజనను ఆపేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మొత్తం బీజేపీలో చేరితే బాగుటుందని అన్నానని మీడియాకు వివరణ ఇచ్చారు.

 

ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో మహా అయితే రెండు నుండి ఆరు యంపీ సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని, కాంగ్రెస్ నేతలందరూ తాము కాంగ్రెస్ పార్టీకి చెందినవారమని చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడుతున్నారని ఆయన అన్నారు. బహుశః ఈ విధంగా మాట్లాడినందుకు షోకాజ్ నోటీసులు అందుకొన్నాఆశ్చర్యం లేదని, ప్రజలే కాదు ఆయన కూడా భావించడం విశేషం. అయినప్పటికీ తను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని అన్నారు.

 

ఆయనను ఇష్టం లేకపోతే పార్టీలో నుండి బయటకి పొమ్మని ఇప్పటికే హెచ్చరించిన బొత్స, ఇంత రాద్ధాంతం చేస్తుంటే ఇంకా వేచి చూస్తారని అనుకోలేము. పార్టీ నుండి ఎవరినయినా బయటకి తరిమేసేందుకు ఈ మాత్రం మాటలు చాలు. అయితే ఆయనని బయటకి పంపితే ఆయన మరిన్ని రహస్యాలు బయటపెడితే పార్టీకి ఇంత కంటే ఎక్కువ నష్టం కలుగుతుందని బొత్స భావిస్తే మాత్రం ఆయనను ఉపేక్షించే అవకాశం ఉంది.

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.