Publish Date:Nov 19, 2019
ఆయనొక కలెక్టర్.. ప్రజారోగ్యం, ప్రజా సంక్షేమమే ఆయన లక్ష్యం. మొన్న దీపావళికీ నో క్రాకర్స్ అన్నారు. ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొన్న దీపావళి టపాసులు నిషేధం.. నేడు ప్లాస్టిక్ పై యుద్ధం.. ములుగు జిల్లా వెలుగే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు కలెక్టర్ నారాయణరెడ్డి. దీపావళికి టపాసులు కాల్చకుండా.. గ్రీన్ దివాళీ జరుపుకొందామని అవగాహన ఇచ్చిన ఆయన ఈ సారి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కిలో ప్లాస్టిక్ కు కిలో బియ్యం స్కీమ్ ను తీసుకొచ్చారు. ప్లాస్టిక్ ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఇక్కడ కూడా అదే జిల్లా లోని అన్ని గ్రామ పంచాయతీల్లో 171 గ్రామ పంచాయతీల్లో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వంద శాతం నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఉన్న ప్లాస్టిక్ వెనక్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక కేజీ ప్లాస్టిక్ వేస్ట్ కు ఒక కేజీ మంచి బియ్యాన్ని ఇచ్చే విధంగా ప్రొగ్రాం చేపట్టామని అధికారులు వెల్లడించారు.
ములుగు జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు కలెక్టర్. వాడి వదిలేసిన ప్లాస్టిక్ కవర్లు ,బాటిల్స్ వ్యర్థాలన్నింటినీ సేకరిస్తున్నారు. కిలో ప్లాస్టిక్ సేకరిస్తే కిలో సన్న బియ్యం అందిస్తున్నారు. ఇప్పుడు స్కీమ్ ఉద్యమంలా సాగుతోంది. ప్రజలంతా ప్లాస్టిక్ సేకరణలో భాగస్వాములయ్యారు. ప్రజలకు బియ్యం అందించేందుకు ప్రత్యేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు.ఇక్కడ సేకరించిన ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయడానికి అప్పగించి అదే విధంగా రీసైకిల్ చేయలేని క్యారీ బ్యాగ్స్ లాంటి వాటిని సిమెంట్ ఫ్యాక్టరీ పంపించే విధంగా కూడా చర్యలు తీసుకుటున్నట్లు సమాచారం. వీటితో పాటుగా మహిళా సంఘాలకు పేపర్ తో బ్యాగ్ తయారు చేసే విధంగా ఒక యూనిట్ ను ప్రారంభించే విధంగా సంఘం నుంచి తీసుకుంటున్నాం.తర్వాత క్లాత్ ద్వారా కూడా మనకు క్లాత్ బ్యాగ్స్ ను కూడా వినియోగంలోకి తీసుకురావాలనుకుంటునట్లు తెలియజేశారు.
త్వరలో మేడారం మహా జాతర ప్రారంభమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాంటీ ప్లాస్టిక్ జాతర నిర్వహించాలని ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నారు కలెక్టర్. రాబోయే మేడారం కూడా అంటే సుమారు నెలకు కోటి ముప్పై లక్షల జనాభా ఒక వారం రోజుల్లో వస్తారు. అలాంటప్పుడు ఒక్క సింగిల్ పీస్ ప్లాస్టిక్ కూడా ఉండకుండా చూసుకునే విధంగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతుందన్నారు. తప్పకుండా అందరి సహకారంతో ప్లాస్టిక్ ఫ్రీ ములుగుతో పాటు ప్లాస్టిక్ ఫ్రీ మేడారం కూడా సాధిద్దామని అధికారులు ఆశిస్తున్నారు.ఏ ప్రయత్నమైనా ఒక్కరితో మొదలవుతుంది.అది ఆచరణలో సరిగ్గా అమలైతే మహాయజ్ఞంలా సాగుతుందనడానికి, కిలో ప్లాస్టిక్ కు కిలో బియ్యం పథకం నిదర్శనం. ప్రజలంతా ప్లాస్టిక్ ఏరివేత పనిలో పడ్డారు. త్వరలో ములుగు ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుతుంద ని ఆశిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/district-collector-offers-1-kg-rice-for-1-kg-plastic-in-telangana-25-91355.html
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
Publish Date:Dec 31, 2025
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
Publish Date:Dec 31, 2025
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.