టీఆర్ఎస్ లో అసమ్మతి మంటలు.. గులాబి పార్టీలో లుకలుకలు

Publish Date:May 3, 2022

Advertisement

తెరాసలో ఆసమ్మతి ఆరని మంటలా తయారైంది. గులాబీ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. జిల్లాల వారిగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఎక్కడికక్కడ అసమ్మతి  బహిర్గతమవుతోంది. విభేదాలు ముదిరి నేతలు బహిరంగ సవాళ్లు, విమర్శల పర్వానికి దిగుతున్నారు. అసమ్మతి మంటల కారణంగానే  ప్రజాప్రతినిధులు వివాదాలపాలవుతుంటే.. మరో వైపు మంత్రులపై కేసులు నమోదై, నోటీసులు జారీ అవుతున్నాయి.   పార్టీ నేతల్లో అసమ్మతి నివురు తొలగిపోయి నిప్పులా పార్టీని కాల్చేస్తోంది. నేతలు రోడ్డెక్కి ఆరోపణల పర్వానికి దిగుతూ  పార్టీకి ప్రతిష్టను మంటగలుపుతున్నారు. వరంగల్, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మేడ్చెల్ మల్కాజిగిరి..ఇలా ఏ  జిల్లాలో చూసినా పార్టీ నేతల మధ్య విభేధాలు, వర్గపోరు తారాస్థాయికి చేరుకున్న పరిస్థితే కనిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో తనకే టిక్కెట్టు వస్తుందనీ, తానే పోటీ చేస్తాననీ నియోజకవర్గాల్లోని నేతలు బహిరంగంగా ప్రకటించుకుంటున్నారు. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన వారు, ఆశావాహులు  అందరూ అదే బాట పడుతున్నారు. దీంతో టిఆర్ఎస్ పార్టీలో వర్గపోరు నువ్వా నేనా..? అనే స్థాయికి చేరుకుంటున్నది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలను కాదని తమకే టిక్కెట్టు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లోని క్యాడర్ ఒకింత గందర గోళానికి గురవుతోంది.

 నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వేముల ప్రశాంత్ కు వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంలు ఎమ్మెల్యే టిక్కెట్టు నాదంటే నాదనేది ప్రకటించుకుంటున్నారు. దీంతో వారిద్దరి మధ్య ఆధిపత్యం పోరు ముదురుతోంది. ఇన్నాళ్లు ఇద్దరి మధ్య విభేదాలు బయటికి పెద్దగా కనబడక పోయినా ఇప్పుడు  ముదిరి పాకానపడ్డాయి. అయితే వీరిద్దరి మధ్య వార్ కొత్తేమీ కాదు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి కారెక్కిన నాటి నుంచి ఈ ఇద్దరికి ఎప్పుడూ పోసిగేది కాదు. అలా అని వీరిద్దరూ ఏనాడు ఎదురుపడి గొడవ పెట్టుకున్న సందర్భాలు లేవు. ఆధిపత్య పోరులో బహిర్గతంగా తొడ కొట్టుకున్న దాఖలాలూ లేవు. అంతర్గతంగా మాత్రం పోరు మామూలుగా ఉండదు. అది ఏ రేంజ్ లో అంటే నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్నా ఇక్కడ జరిగే లోకల్ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి టీఆర్ఎస్ అభ్యర్దే పోటీ ఇచ్చేంతగా ఉంది.

తాండూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల మధ్య విభేధాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. వీరిద్దరూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్టు నాదంటే నాదేనని ప్రకటించుకోవడంతో పాటు పరస్పర విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ పోలీసు అధికారిని దుర్భాషాలడారు. అది కాస్త వైరల్ అయ్యింది. చివరకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పొరపాటున అన్నాననే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ లో చేరడంతో తీగల కృష్ణారెడ్డి తెరమరుగయ్యారు. ఆయన కూడా అసమ్మతితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.  మేడ్చెల్ జిల్లా పరిధిలోకి వచ్చే ఉప్పల్ నియోజకవర్గంలో బండారి లక్ష్మారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ల మధ్య టిక్కెట్టు పోరు నడుస్తోంది. మేడ్చెల్ లో మంత్రి మల్లారెడ్డికి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి వర్గీయుల మధ్య  పోరునడుస్తోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గపు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి, జిల్లా చైర్మన్ కు మధ్య వివాదాలు బలంగా ఉన్నాయి. భువనగిరి అసెంబ్లీకి ప్రాతినథ్యం వహిస్తున్న ఫైళ్ళ శేఖర్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డిల నడుమ వివాదాలు పెరుతుగుతున్నాయి. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు మధ్య ఆధిపత్య పోరు ఓ రేంజ్ లో ఉంది.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్,  ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ల మధ్య పచ్చిగడ్డి వేస్తే మండేలా తయరయ్యారనే ప్రచారం జోరందుకుంది. ఈ విధంగా అధిక శాతం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఆశావాహులకు మధ్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకుంటున్న పార్టీ అదినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు నేతల మధ్య విభేదాలు కొత్త తలనొప్పిని తీసుకువచ్చాయి,జాతీయ రాజకీయాలు కాదు..ముందు పార్టీని చక్కదిద్దుకోవలసిన పరిస్థితి అనివార్యమైంది.

By
en-us Political News

  
సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి? ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడులో బీజేపీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై ప్రతికూలతకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా సరిగ్గా పంచాయతీ ఎన్నికల వేళ కవిత చేపట్టిన జనజాగృతి యాత్ర ప్రభావం బీఆర్ఎస్ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు.
ఈ సూసైడ్ విన్న‌ర్స్ అంటే ఏంటి? ఈ పంచాయితీ ఎన్నిక‌ల్లో వెలుగులోకొచ్చిన కొత్త ప‌దం ఇది. సంగారెడ్డి, రాయికోడ్ మండ‌లం, పిప‌డ్ ప‌ల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు ఉదంతంతో ఈ పదం పుట్టుకొచ్చిందని చెప్పొచ్చు.
కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
3,911 గ్రామాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
తొలి నుంచీ కూడా ఈటల బీజేపీలో ఇమడడానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆయన పార్టీలో ఉక్కపోతను భరిస్తూనే కొనసాగుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరో సారి ఆయన హర్టయ్యారు.
ఈ పోలింగ్ కోసం కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇకపోతే.. రెండో దశలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు తమ స్వగ్రామాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు.
నెల్లూరు మేయ‌ర్‌ ఎన్నికల్లో నెంబ‌ర్ గేమ్ మొద‌లైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.