వైసీపీలో పెరుగుతున్న రఘురామ రాజులు..! పార్టీలో నివురు తొలగిన అసమ్మతి, అసంతృప్తి

Publish Date:Jul 5, 2022

Advertisement

వైసీపీలో అసమ్మతి రాజుకుంటోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలలో ఇంత కాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి, అసమ్మతి ఇప్పుడు రాజుకుని మంటగా మారుతోంది. పార్టీకి హైకమాండ్ అంటే  అధినేత జగన్ మాత్రమే. అసమ్మతి ఇప్పుడు అధినేతను ధిక్కరించడానికి సైతం వెనుకాడని పరిస్థితి కనిపిస్తోంది. ఇంత కాలం వైసీపీలో అసమ్మతి అంటూ ఎవరైనా బహిరంగంగా బయటకు వచ్చారంటే అది రెబల్ ఎంపీ రఘురామ రాజు మాత్రమే.

ఆయన ధిక్కారాన్ని సహించలేని అధినేత జగన్ ఆయన పట్ల వ్యవహరించిన తీరు తెలిసిందే. ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసి భౌతికంగా హింసించారంటే దాని వెనుక ఉన్నది ఎవరో ఎవరైనా తేలిగ్గా ఊహించగలరు. ధిక్కారాన్ని, అసమ్మతి స్వరాన్ని అధినేత సహించడని స్పష్టంగా తెలిసినా కూడా పార్టీలో అసమ్మతి గళం పైకి లేస్తున్నదంటే పార్టీలో అసంతృప్తి ఎంతగా పేరుకుపోయిందో ఇట్టే అవగతమౌతుంది.

తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తన నిరసనను పార్టీ అధినేతకు దిమ్మతిరిగేలా వినిపించారు. గత కొంత కాలంగా ఆయన సుతిమెత్తగా తన అసమ్మతిని, అసంతృప్తినీ వ్యక్త పరుస్తూనే ఉన్నారు. అయితే మంగళవారం ఆయన తన నిరసనను వ్యక్తం చేసిన తీరు పార్టీ వర్గాలనే దిగ్భ్రమకు గురి చేసింది. వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన నేరుగా డ్రైనేజీలోకి వెళ్లి కూర్చున్నారు.   నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో డ్రైనేజీ పనులకు నిధులు కేటాయించడం లేదనీ, కార్పొరేషన్ అధికారులు ఎమ్మెల్యేనైన తన మాటలు వినడం లేదని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా..  ఎమ్మెల్యేగా తాను కోరుతున్నా డ్రైనేజీ పనులకు నిధులు కేటాయించడం లేదంటే ఏమనుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.  

ఎమ్మెల్యే  నిరసనకు  సంఘీ భావంగా ఆయన అనుచరులు కూడా డ్రైనేజీలోకి దిగారు. ఈ మొత్తం  సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకు పెద్ద చర్చకు శ్రీకారం చుట్టింది.  రోడ్లు, డ్రైనేజీలు వంటి పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలోనూ కూడా ఇటువంటి పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదనీ, ఇది అందరికీ తెలిసిన విషయమేనని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ఎమ్మెల్యే కోటం రెడ్డి ఇలా బహిరంగ నిరసనకు దిగడం పార్టీని ప్రజలలో పలుచన చేయడానికేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.  

తనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తికి తోడు, తనతో అంతగా సఖ్యత లేని కాకాణికి మంత్రిపదవి ఇవ్వడంతో పెచ్చరిల్లిన అసహనంతో గత కొద్ది కాలంగా కోటం రెడ్డ పార్టీని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  అయితే ఒక్క కోటం రెడ్డే కాదు.. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులూ కూడా బహిరంగంగానే పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రకటనలూ ప్రసంగాలూ చేస్తున్నారు. ఇటీవల బొత్స కూడా విజయనగరం జిల్లాలో ప్లీనరీ సదస్సులో మాట్లాడుతూ పార్టీ క్యాడర్ నాయకత్వం మీద విశ్వాసం కోల్పోతోందనీ, వారు పార్టీని వీడే ఆలోచన చేస్తున్నారనీ చెప్పడమే కాకుండా ఇప్పటికైనా మేలుకోకపోతే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని కుండ బద్దలు కొట్టారు. అంతకు ముందు సమీక్షా సమావేశంలోనే బాలినేని వంటి నేతలు పార్టీలో అసమ్మతి, పనులు జరగకపోవడంతో ప్రజలలో పెల్లుబుకుతున్న ఆగ్రహం గురించి అధినేత ఎదుటే గళమెత్తారు.  

ఇక జోగి రమేష్ అయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల సమక్షంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు కొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి వెల్లంపల్లి ఈ రోజు వైసీపీలోనే ఉన్నా ముందు ముందు ఉంటారన్న నమ్మకం లేదని అన్నారు.    మాజీ మంత్రి బాలినేని విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆయన పలు సందర్భాలలో బహిరంగంగా చెప్పారు.

గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అయితే గన్నవరం, బందర్ నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఎవరన్నది ప్రకటించేసి ఆయా నియోజకవర్గాలలో ఇప్పటికే ఉన్న గ్రూపు తగాదాలకు అజ్యం పోశారు. ఇలా ఇక్కడ ప్రస్తావించిన జిల్లాలలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైసీపీలో గ్రూపు తగాదాలు శృతి మించి రాగానపడ్డాయని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.  పరిస్థితి ఇలాగే కొనసాగితే నియోజకర్గానికి ఒక రఘురామరాజు తయారైనా ఆశ్చర్యపోవలసిన పని లేదని పరిశీలకులే కాదు, వైసీపీ శ్రేణులు సైతం అంటున్నాయి.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.