Publish Date:Jul 20, 2022
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు అసమ్మతి సెగ తగిలింది. ఆయన కేబినెట్ సహచరులే తిరుగుబావుటా ఎగురు వేశారు. యోగి మంత్రివర్గంలో ఇద్దరు తమ అసమ్మతిని బహిర్గతం చేశారు. యోగి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక మంత్రి రాజీనామా చేయగా, మరో మంత్రి పార్టీ హై కమాండ్ కు యోగి తీరుపై ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీకి చోట్ల అసమ్మతి ఆనవాళ్లు కనిపిస్తున్నప్పటికీ ఎక్కడా, ఎవరూ ఇలా బహిర్గతం కాలేదు.
బీజేపీ సీఎంలందరిలోనూ అత్యంత శక్తిమంతుడిగా భావించే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పైనే తిరుగుబావుటా ఎగురవేయడం యోగి తీరును విమర్శిస్తూ ఏకంగా ఒక మంత్రి రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. ఉత్తర ప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి దినేశ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను దళితుడిని కావడం వల్లే సీఎం తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ, వివక్ష చూపుతూ ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ దినేశ్ విమర్శించారు. దినేశ్ తన రాజీనామా లేఖను ఏకంగా కేంద్ర మంత్రి అమిత్ షాకు పంపారు. చూపుతున్నారని, ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. దినేశ్ తన రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పంపారు.
దళితుడిని కనుకనే తన పట్ల వివక్ష చూపుతున్నారనీ, మంత్రిగా తనకు ఎటువంటి అధికారాలూ లేవనీ, గత వంద రోజులుగా తనకు ఎటువంటి పనీ అప్పగించలేదనీ, కనీసం అధికారిక కార్యక్రమాలకు సైతం ఆహ్వానం లేదనీ ఆయనా లేఖలో పేర్కొన్నారు. అలాగే యోగి కేబినెట్ లో మరో మంత్రి కూడా తన అసమ్మతిని బహిర్గతం చేశారు. ముఖ్యమంత్రి యోగి తీరుపై నేరుగా పార్టీ అధిష్ఠానానికే ఫిర్యాదు చేశారు.
అవినీతి ఆరోపణలపై యూపీ సర్కార్ ఇటీవల సస్పెండ్ చేసిన అధికారులలో రాష్ట్ర్ర ప్రజాపనుల శాఖ మంత్రి జితిన ప్రసాద పీఏ కూడా ఉన్నారు. దాంతో సీఎం యోగి జితిన ప్రసాదను మందలించారనీ, దీంతో ఆయన తీవ్ర ఆగ్ర్హహం వ్యక్తం చేశారనీ చెబుతున్నారు. ఈ అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు జితిన ప్రసాద ఫిర్యాదు చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. యోగి తీరు నియంతలా ఉందని, మంత్రులకు, ఎమ్మెల్యేలకూ కనీస గౌరవం దక్కడం లేదనీ జితిన ఆరోపిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/disidence-in-yogi-cabinet-one-minister-resign-39-140204.html
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.