వైసీపేలో .. స్వరాలు మారుతున్నాయి.. అసమ్మతి రగులుతోంది!

Publish Date:Jun 28, 2022

Advertisement

ఇంతవకు ఒక లెక్క .. ఇక పై ఇంకో లెక్క.. ఇదేదో విన్న డైలాగులా ఉంది కదూ.. నిజమే  ఈ మధ్య  కాలంలో రాజకీయ వర్గాల్లో, రాజకీయ చర్చల్లో, ముఖ్యంగా ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ డైలాగు బాగా వినిపిస్తోంది. వైసీపీ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగి పోతున్న నేపధ్యంలో పార్టీ నాయకుల స్వరాలు మారుతున్నాయి. ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పిందే వేదంగా తల ఉపుతూ వచ్చిన ఎమ్మెల్యేలు, నాయకులు, ఇంతవకు ఒక లెక్క .. ఇక పై ఇంకో లెక్క.. అంటూ జగన్ రెడ్డికి. క్షేత్ర స్థాయి పరిస్థితిని చెప్పేందుకు సిద్డమవుతున్నారు. అంతే కాదు, వింటే విన్నట్లు లేదంటే తమ దారి తాము చూసు కునేందుకు కూడా సిద్దమైనట్లు తెలుస్తోంది. 

కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మంత్రులు, పార్టీ సమన్వయ కర్తలు ఇతర ముఖ్య నాయకులతో వర్క్ షాప్  నిర్వహించారు. అ సందర్భంగా ఒకరిద్దరు మాజీ మంత్రులు, ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు పార్టీ, ప్రభుత్వం పనితీరు విషయంగా, పథకాల అమలుకు సంబంధించి ఒకటో రెండో ఫిర్యాదులు చేశారు. నిజానికి, అవి  ఫిర్యాదులు అనేందుకు కూడా వీలు లేదు, ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు... అయితే అదేమిటో కానీ, ముఖ్యమంత్రి , వారి మీద కస్సున లేచారు.  
మాజీమంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రావు అమ్మఒడి ప‌థ‌కం అమ‌లు విష‌యంలో అసంతృప్తిని వ్య‌క్తం చేశారు ప్ర‌కాశం జిల్లా ల‌బ్దిదారుల్లో అంత‌కుముందు వున్న‌వారిని కూడా తొలిగించడం ఏమిటని ప్రశ్నించారు.

అసలే ఇవ్వక పొతే అదో పద్దతి, కానీ, ఒక సారి  ఇచ్చి  రెండవ సారికి లేదంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు. అలాగే, కందుకూరు ఎమ్మెల్యే మ‌హీధ‌ర్ రెడ్డి గ్రామాల్లో విద్యుత్ స‌మస్యతో పాటు ఇసుక స‌మ‌స్య గురించి ప్రస్తావించారు. ఇలా సమస్యలు ఏకరువు పెట్టడం ముఖ్యమంత్రికి నచ్చలేదు.అలాగే వదిలేస్తే, ఒక్కొక్క  ఎమ్మెల్యే కొండవీటి చాంతాడంత చిట్టా విప్పుతారని భయపడ్డారో ఏమో కానే ఆగ్రహంగా ఆ డిస్కషన్ అక్కడితో కట్ చేశారు. 

డిస్కషన్ అయితే కట్ చేశారు కానీ, పార్టీ నాయకుల్లో అంటుకున్న అసమ్మతిని అయితే చల్లార్చలేక పోయారు. ఒకరి తర్వాత ఒకరు అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు. అందుకే ప్రతి జిల్లాలోనూ సొంత పార్టీ నాయకుల మధ్యనే, వివాదాలు రాసుకుంటున్నాయి.  ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరిపై ఒకరు విమర్శలు దాటి, వీధి పోరాటాలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే గత కొంత కాలంగా, ఒక మహిళ ఆయనపై చేసిన ఆరోపణల నేపధ్యంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న మాజే మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, సొంత పార్టీ నేతలే తనపై కక్షకట్టి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక అ మహిళ ఆధారాలతో మాజీ  మంత్రి పై  సంచలన విమర్శలు చేసినప్పుడు, విపక్షాలు ఆయన్ని కార్నర్ చేయడం సహజం. అయితే, అలాంటి సమయంలో తనకు అండగా ఉండవలసిన సొంత పార్టీ నాయకులు ప్రతిపక్షాల కంటే ఎక్కువగా తనను టార్గెట్ చేస్తున్నాయని, బాలినేని వాపోతున్నారు.

సొంత పార్టీ వారే కుట్ర పన్నుతున్నారనే, వరకు వెళ్లారు.  మరో వంక, బాలినేని గొంతుకు మరో గొంతు తోడైంది, బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే తనకూ ఇంటి పోరు తప్పట్లేదని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వాపోయారు. జిల్లాకు చెందిన వైకాపా ముఖ్యనేతలు వారి నియోజకవర్గాల్లో కాకుండా తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆక్షేపించారు.  అదలా ఉంటే, బయటకు వస్తున్న అసమ్మతి స్వరాలల కంటే, బయట పడకుండా కుతకుత ఉడుకుతున్న అసమ్మతి నేతలు ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటారని, పార్టీ నాయకులే అంటున్నారు. వైసీపీలో  అసమ్మతి కట్టలు తెంచుకునే రోజు ఇంకేతో దూరంలో లేదని, ముఖ్యంగా, మాజీ మంత్రులు, మంత్రి పదవులు ఆశించి భంగ పడిన సేనియర్లు అసమ్మతితో రగిలి పోతున్నారని అంటున్నారు.

అదే విధంగా,  నియోజక వర్గాలో ఎమ్మెల్యేలుగా తమకు గుర్తింపు, గౌరవం ఉండడం లేదని, అన్నీ ముఖ్యమంత్రి పేరునే జరగడం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా నేరుగా, ముఖ్యమంత్రి మీట నొక్కి విడుదల చేయడంతో ప్రజలు అసలు ఎమ్మెల్యేలను గుర్తించడం లేదని, ఇక స్థానిక నాయకులను అయితే, దేఖే వాడే లేదని అంటున్నారు. మరో వంక  గుంతల రోడ్లు, విద్యుత్ కోతలు, ఇతర సమస్యల విషయంలో ప్రజలు తమను తప్పు పడుతున్నారని, ఎమ్మెల్యేలు  వాపోతున్నారు. ముఖ్యమంత్రి ముందు సమస్యలు ప్రస్తావించినా, ఆయన, ప్రజలు, నాకు మంచి మార్కులే  వేస్తున్నారు. మీకే మార్కులు పడడం లేదు అంటూ తప్పు తమపైకి  నేట్టేస్తున్నారని అంటున్నారు. అలాగే, అన్ని నియోజక వర్గాల్లో ఆయనే పోటీ చేస్తారా? అటూ ప్రశ్నిస్తున్నారు. అద్దాల మేడలో  కుర్చుని అంతా బాగుంది అనుకుంటే, చివరకు, అంతా బ్రాంతియేనా... అని కోరస్ గా  పాడుకోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.