సిందూర్ పై చర్చకు ఆ ఇద్దరూ దూరం!

Publish Date:Jul 29, 2025

Advertisement

పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్‌ సిందూర్‌ అంశాలపై పార్లమెంటులో సోమవారం (జులై 28) ప్రారంభమైన చర్చ సభ లోపల వెలుపల కూడా రాజకీయ దుమారం రేపుతోంది. అసలేం జరిగింది.. ఆపరేషన్ సిందూర్  విరమణ వెంక ఉన్న రహస్యం ఏమిటి?  ప్రతిపక్ష నేత రాహుల్  గాంధీ పదే పదే ఆరోపిస్తునట్లుగా..  ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు లొంగిపోయారా?  సరండర్ అయ్యారా? ప్రభుత్వం చెపుతున్న విధంగా పాక్  మన దేశానికి లొంగి పోయిందా? అందుకే మన సైన్యం ఆపరేషన్ సిందూర్ కు తాత్కాలిక విరామామ ప్రకటించిందా? ఏది నిజం..  అనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

మరోవంక..  ప్రతిపక్ష ఇండియా కూటమి, మరీ ముఖ్యంగా  ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు  ఒకదాని వెంట ఒకటిగా అస్త్రాలను సంధిస్తోంది. ఇప్పటికే  లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడు, గొగోయ్ వరస ప్రశ్నలతో తొలి అస్త్రాన్ని సంధించారు.   మంగళవారం(జులై 29) ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంకా వాద్రా చర్చలో పాల్గొంటారు. ప్రభుత్వ పక్షాన ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్  విపక్షాలు సభ లోపల వెలుపల చేసిన, చేస్తున్న విమర్శలకు చాలా వరకు సమాధానాలు ఇచ్చారు. కాగా   మంగళవారం( జులై 29) హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అటు రాహుల్,ఇటు ప్రధాని మోదీ చర్చలో పాల్గొననున్న నేపధ్యంలో ఎవరు ఏమి మాట్లాడతారు అనే విషయంలో ఆసక్తి వ్యక్తమవుతోంది.

అదలా ఉంటే..  ఆపరేషన్ సిందూర్’ విషయంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో తలెత్తిన అంశాలు పార్లమెంట్ చర్చ సందర్భంగా మరో మారు  తెరపై కొచ్చాయి. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో జరిగే చర్చల్లో కాంగ్రెస్ నేతలు శశిథరూర్, మనీశ్ తివారీలను పార్టీ దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తివారీ, కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేకంగా మాట్లాడుతోందనే అర్థం వచ్చేలా..  తాను  భారత్‌ వైపే మాట్లాడతానని నర్మగర్భంగా  వ్యాఖ్యలు చేశారు. నిజానికి..  ఇప్పటికే  రక్షణమంత్రి రాజనాథ్ సింగ్,  కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా  పలువురు బీజేపీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు.   

ఇక ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌ గురించి ప్రపంచదేశాలకు వివరించడానికి వెళ్లిన అఖిలపక్ష బృందంతో వెళ్ళిన థరూర్, తివారీలను  కాంగ్రెస్ పార్టీ  ఆపరేషన్‌ సిందూర్  పై జరిగే చర్చలో ఎందుకు దూరం పెట్టిందనే  విషయంగా  ఓ వార్తా సంస్థ రాసిన కథనాన్ని తివారీ ఎక్స్ లో పంచుకున్నారు. దానికి పూరబ్ ఔర్ పశ్చిమ్‌ అనే బాలీవుడ్‌ సినిమాలోని దేశభక్తి గీతంలో కొన్ని వ్యాఖ్యలను జోడించారు. ఒక భారతీయుడిగా తాను దేశ వైభవాన్నే కోరుకుంటాననేది దాని అర్థం. దీనికి ముందు చర్చల్లో తాను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని తివారీ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థన కూడా పంపారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇక  ఆపరేషన్‌ సిందూర్ పై జరిగే చర్చల్లో థరూర్‌ ఉండాలని కాంగ్రెస్‌ కోరిందని.. అయితే, పార్టీ చెప్పిన విధంగా మాట్లాడాలని కోరినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కానీ..  దీనికి ఆయన నిరాకరించినట్లు సమాచారం. దీనిపై విలేకరులు ప్రశ్నించగా..  మౌనవ్రతం, మౌనవ్రతం అంటూ థరూర్‌ బదులిచ్చారు. దీంతో.. ఆపరేషన్ సిందూర్  పై చర్చ కాంగ్రెస్  కు కూడా పరీక్షగానే మారిందని  అంటున్నారు.

By
en-us Political News

  
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.