ఈడీ కార్యాలయంలో పూరి జగన్నాథ్.. డ్రగ్స్ కేసులో ఏం జరగనుందో? 

Publish Date:Aug 31, 2021

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో సంచనం స్పష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. నాలుగేండ్ల క్రితం వెలుగుచూసిన డ్రగ్స్ కేసు.. సిట్ విచారణ తర్వాత తుస్సుమంది. తాజాగా ఈడీ ఎంట్రీతో కేసులో మళ్లీ విచారణ ప్రారంభమైంది. విచారణకు రావాలని ఈడీ 12 మంది సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 22 వరకు ఈడీ విచారణ కొనసాగనున్నది. తొలి రోజు మంగళవారం నాటి విచారణకు దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు. 

ఉదయం 10.30 గంటలకు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా... 10.05 గంటలకే  వచ్చేశారు పూరి జగన్నాథ్. ఆయనతో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా... పూరీ జగన్నాథ్ స్పందించలేదు. కారు దిగిన వెంటనే నేరుగా కార్యాలయంలోకి వెళ్లారు. ఈడీ సిబ్బంది ఆయనను మెట్లపై నుంచి పైకి తీసుకెళ్లారు. పూరి తో పాటు ఆయన కుమారుడు ఆకాష్,  సీఏ ( చార్టెడ్ అకౌంటెట్ )లు ఈడీ కార్యాలయానికి వచ్చారు. మనీలాండరింగ్ తో పాటు ఇతర విషయాలపై కూడా పూరీని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. పూరి జగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారం సేకరించనున్నారు ఈడీ అధికారులు. డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కీలక అంశాల పై ప్రశ్నించనున్నారు. 

అక్టోబర్​ 2న చార్మీ కౌర్, 6న రకుల్​ప్రీత్​సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్, ఎఫ్​ క్లబ్​ జనరల్ మేనేజర్, 15న ముమైత్​ఖాన్, 17న తనీష్​, 20న నందు, 22న తరుణ్ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. డ్రగ్స్ కొనుగోలుకు డబ్బులను అక్రమమార్గంలో విదేశాలకు తరలించినట్లు అనుమానిస్తున్న మరో 50 మందికి కూడా ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. 

మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అధికారులకు ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది.  ఈ కేసులో సిట్ బృందానికి నేతృత్వం వహించిన ఎక్సైజ్ అధికారి శీలం శ్రీనివాస్ రావు సోమవారం ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. కేసు దర్యాప్తులో వెల్లడైన అంశాలను ఆయన ఈడీ అధికారులకు తెలిపినట్లు తెలుస్తోంది. తమ విచారణకు హాజరుకావాలని మరికొందరు ఆబ్కారీ అధికారులకు ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. డ్రగ్స్ వ్యవహారంలో భారీ ఎత్తున నల్లధనం చేతులు మారినట్లు వెల్లడైనా ఎందుకు నిర్లక్ష్యం వహించారన్న విషయంపై ఈడీ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ కేసులో  ఎక్సైజ్ అధికారులు 12 కేసులు నమోదు చేసి 11 ఛార్జీషీట్లు దాఖలు చేశారు. అయితే అందులో ఎక్కడా గతంలో విచారణను ఎదుర్కొన్న సినీతారల పేర్లు లేవు. సినీ తారలతో పాటు మొత్తం 62 మంది అనుమానితుల నుంచి వెంట్రుకలు, గోర్లు, రక్తం నమూనాలను సేకరించి ఫోరెన్సిక్​ల్యాబ్ కు పంపినప్పటికీ పరిశీలనలో ఏమి తేలిందనే విషయాన్ని ఇప్పటికీ గోప్యంగా ఉంచారు. డ్రగ్​ స్మగ్లర్లు కెల్విన్, రాఫెల్​ ఎలెక్స్​ముఠాలను అరెస్ట్​చేశారు. కానీ లోతైన దర్యాప్తు చేయకుండా చేతులు దులుపుకున్నారు. ఆ సమయంలో ఎక్త్సెజ్​ కమిషనర్ గా​ అకున్ సబర్వాల్ ఆకస్మికంగా బదిలీ కావడం సంచలనం కలిగించింది. ఆ తర్వాత ‘ఫోరమ్ ​ఫర్​ గుడ్​ గవర్నెన్స్ ’వంటి సంస్థల ఆందోళన,​ కోర్టు జోక్యంతో డ్రగ్స్​ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఈడీ రంగంలోకి దిగడం ఆబ్కారీ శాఖకు సంకటంగా మారింది.   

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.