త్రివేదీ బడ్జెట్..చార్జీల బాదుడు?

Publish Date:Mar 14, 2012

Advertisement

న్యూఢిల్లీ: ఈరోజు ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్‌పై సర్వతా ఉత్కంఠ నెలకొంది. రైల్వేశాఖ మంత్రి దినేశ్ త్రివేదీ బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే పార్లమెంటులో రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి. మధ్యంతరం వస్తే తప్ప సమీప భవిష్యత్తులో ఎన్నికలు కూడా లేవు. దీనికితోడు ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైల్వేలకు ఆదాయార్జనే ధ్యేయంగా పార్లమెంటరీ కమిటీలు, ప్రణాళికా సంఘం, రైల్వే యూనియన్లు కూడా అన్ని క్లాసుల చార్జీలను పెంచాలని సిఫారసు చేశాయి. మాజీ అణు శాస్త్రవేత్త అనిల్ కకోద్కర్ కమిటీ కూడా భద్రత రుసుము పేరిట రూ.5000 కోట్లు వసూలు చేయాలని సిఫారసు చేయడంతోపాటు ప్రయాణికుల టికెట్ల చార్జీలను పెంచాలని కూడా సిఫార్సు చేసింది.

ఈ నేపథ్యంలో ఈసారి ప్రత్యక్షంగా, పరోక్షంగా వడ్డించేందుకూ రైల్వే మంత్రి త్రివేదీ సిద్ధమయ్యారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈసారి ప్రయాణికుల టికెట్ల చార్జీలను పెంచనున్నారు. ఏసీ బోగీల్లో ప్రయాణిస్తున్న వారిపై భారం మోపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. బడ్జెట్లో ఏసీ టికెట్ల చార్జీలను 20 శాతం వరకు పెంచనున్నట్లు సమాచారం. ఏసీ స్లీపర్ క్లాస్ 10 శాతం, చైర్‌కార్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ విభాగాల్లో 15-20 శాతం, ఫస్ట్‌క్లాస్ ఏసీ విభాగంలో 25 శాతం చార్జీలు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. బడ్జెట్‌కు ముందే 19 - 30 శాతం వరకు సరుకు, రవాణా ఛార్జీలు పెరిగాయి. రవాణా ఛార్జీల పెంపుతో రూ. 12 నుంచి 30కి పెరిగిన బస్తా సిమెంటు రేటు పెరిగింది. స్టీల్‌, ఎరువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. రవాణా ఛార్జీల పెంపుతో రూ 20 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను కూడా త్రివేదీ ప్రకటించే అవకాశం ఉంది. 

కొత్త రైల్వే లైన్లను నిర్మించకుండా ఉన్న లైన్లలోనే రైళ్లను పెంచితే.. రద్దీ విపరీతంగా పెరిగిపోతుందని, తద్వారా మళ్లీ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కాబట్టి కొత్త రైల్వే మార్గాలు నిర్మించటం అనివార్యమైందని వివరిస్తున్నారు. కానీ, ఇందుకు రైల్వే శాఖ వద్ద నిధులు లేవని, స్థిరాస్తులను అమ్ముకునేందుకు రైల్వేలకు అవకాశం లేదని, ఈ నేపథ్యంలో చార్జీలను పెంచడం ఒక్కటే మార్గమని స్పష్టం చేస్తున్నారు. అయితే, సాధారణ, మధ్యతరగతి ప్రయాణికులపై భారం పడకుండా ఏసీల్లో ప్రయాణించే ఎగువ తరగతిపైనే భారం వేసే అవకాశముందని విశ్వసనీయంగా తెలిపారు.

మౌలిక సదుపాయాల విస్తరణే ఈసారి రైల్వే శాఖ ధ్యేయం. ఈ మేరకు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్‌సీ) ఏర్పాటుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. లక్ష కోట్ల రూపాయల అంచనాతో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని కకోద్కర్ కమిటీ సిఫారసు చేసింది. వివిధ రాష్ట్రాల గుండా 3300 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ కారిడార్ ప్రాజెక్టును 2017నాటికి పూర్తి చేయాలని నిశ్చయించారు. దీనికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటీవల ప్రధాని మన్మోహన్ కూడా సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రోడ్డు రవాణాను పెద్దఎత్తున రైల్వేలకు మళ్లించాలనేది ఆ శాఖ యోచన. ఇక వెయిటింగ్ బాధ లేకుండా కన్‌ఫర్మ్‌డ్ బెర్త్‌ను రిజర్వేషన్ చేసుకోవడానికి వీలుగా సరికొత్త పథకాన్నీ ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఈ మేరకు రైల్వే బడ్జెట్‌కు మంత్రి త్రివేదీ మంగళవారం తుది మెరుగులు దిద్దారు.

బడ్జెట్‌లో ఢిల్లీ-జైపూర్-జోధ్‌పూర్ కారిడార్‌లో బులెట్ ట్రైన్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదన ఉండవచ్చని తెలుస్తోంది. ప్రతిపాదిత పుణె-అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్‌కు దీన్ని అనుసంధానం చేస్తారు. ఇంతకు ముందు రైల్వే బడ్జెట్‌లలాగా ఈ సారి రైల్వే బడ్జెట్‌లో కొత్త రైళ్లను పెద్దగా ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. అలాగే రైళ్లలో, స్టేషన్లలో కేటరింగ్ సదుపాయాల మెరుగుదల లాంటి ప్రయాణికుల సదుపాయాలకు సంబంధించి త్రివేది కొన్ని ప్రతిపాదనలు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇప్పుడున్న టాయిలెట్ సదుపాయాలను మెరుగుపరచడానికి ‘గ్రీన్ టాయిలెట్ల’ ఉత్పత్తికి సంబంధించి కూడా మంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది. రైలు ప్రమాదాలను నిరోధించడానికి సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ ఆధునీకరణ పథకాలను కూడా త్రివేది బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడున్న రైలు బోగీల స్థానంలో ఆధునిక ఎల్‌హెచ్‌బి కోచ్‌లను ప్రవేశపెట్టడానికి కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వవచ్చని తెలుస్తోంది.


కాగా, బడ్జెట్‌లోకొత్తగా రెండు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ప్రకటించనున్నారు. వీటిలో ఒకటి కర్నాటకలోని కోలార్‌లో, మరోటి గుజరాత్‌లోని కచ్‌లో ఏర్పాటు చేస్తారు.  కాగా, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ రాజీనామా తర్వాత అదే పార్టీకి చెందిన త్రివేదీ రైల్వే శాఖ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ కూడా ఇదే. ఈ నేపథ్యంలో ఈ రైలు కూడా పశ్చిమ బెంగాల్ దిశగానే దూసుకుపోతుందా? లేక ఇతర రాష్ట్రాల్లోనూ ఆగుతుందా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది!!

By
en-us Political News

  

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

ఖరారైన రాష్ట్రపతి పాలన ...

రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...

విఫలమైన 'టి' కాంగ్రెస్

చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.

తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.

వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.

చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.

రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను

నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.

తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.