వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నవీడియోపై రాష్ట్రపతికి ఫిర్యాదు

Publish Date:Aug 23, 2022

Advertisement

 వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై రాష్ట్రపతికి ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై పారదర్శక విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా నేతల బృందం రాష్ట్రపతిని కలిసి డిమాండ్ చేసింది. ‘డిగ్నిటీ ఫర్ వుమెన్’ పేరుతో మహిళా నేతల బృందం  ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,  జాతీయ మహిళా కమిషన్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ సహాయంతో రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకున్న మహిళా నేతలు రాష్ట్రపతితో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్, జాతీయ మహిళా కమిషన్‌కు విడివిడిగా ఫిర్యాదులు అందజేశారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని వారు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో మహిళలు భయాందోళనల మధ్య  జీవనం సాగిస్తున్నారని, గత మూడూళ్లలో మహిళలపై నేరాలు 21.45 శాతం పెరిగాయని వారా ఫిర్యాదులో పేర్కొన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం పేరు చెప్పి ప్రజల్ని తప్పుదోవపట్టిస్తోందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారే మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీ మంత్రి  అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ ఇలాంటి అసభ్యకర ప్రవర్తనతో అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. గోరంట్ల మాధవ్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదై అత్యాచారం, హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జస్టిస్ వర్మ కమిషన్ నివేదికను అమలు చేయాలని రాష్ట్రపతిని కోరారు. గోరంట్ల మాధవ్ వీడియో క్లిప్‌ను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి పరీక్షించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడిన అభియోగాలు ఎదుర్కొంటున్నవారిని గ్రామ పంచాయితీ నుంచి పార్లమెంటు వరకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా నిషేధించాలని, ఆ మేరకు వర్మ కమిషన్ సిఫార్సులను కఠినంగా అమలు చేయాలని అభ్యర్థించారు. ఇప్పటికే ఎన్నికైన ప్రతినిధులు ఈ తరహా ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటే తక్షణమే వారిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు అందరికీ లింగబేధం, లింగవివక్ష, లైంగిక వేధింపులు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ శిక్షణనివ్వాలని సూచించారు. – ఎవరైనా మహిళలపై అసభ్యంగా ప్రవర్తించినా… లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడినా.. వెంటనే సూమోటోగా కేసులు నమోదు చర్యలు చేపట్టాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు. ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి సమన్లు జారీ చేసి విచారణ జరపాలని కోరారు.

  వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ చెన్నుపాటి కీర్తి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేత సుంకర పద్మశ్రీ , ఐద్వా ప్రతినిధి ఎస్. పుణ్యవతి, పి. రాణి , తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరుగనగరి, ఆ పార్టీ నేతలు ముల్పురి నాగ కళ్యాణి, అన్నాబత్తుని జయలక్ష్మితో పాటు ఏపీ స్టేట్ కుర్బ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ సంజీవరెడ్డి సవిత తదితరులు రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.