డిజిట‌ల్ బుక్ ఫార్ములా... జగన్‌కే రివ‌ర్స్

Publish Date:Oct 4, 2025

Advertisement

 

జ‌గ‌న్‌కి ఎంత టైం బ్యాడో చెప్ప‌డానికిదో మ‌చ్చు తున‌క కాబోలు. అదేంటంటే ఆయ‌న డిజిట‌ల్ బుక్ ఓపెన్ చేసి.. మిమ్మ‌ల్ని ఎవ‌రైనా వేధిస్తే.. మ‌రీ ముఖ్యంగా మీరు కూట‌మి ప్ర‌భుత్వం నుంచి అన‌వ‌స‌ర కేసులు ఇత‌ర‌త్రా వేధింపుల‌కు లోనైతే.. మిమ్మ‌ల్ని ఎవ‌రు వేధిస్తున్నారు.. అన్న పూర్తి వివ‌రాల‌ను మీరు మ‌న డిజిట‌ల్ బుక్ లోకి ఎక్కించాలి.. ఆపై మ‌నం అధికారంలోకి వ‌చ్చాక‌.. వారు స‌ప్త స‌ముద్రాల ఆవ‌ల దాగి ఉన్నా వ‌ద‌ల‌కుండా వెంటాడి మ‌రీ రివేంజ్ తీర్చుకుందాం. ఇదీ జ‌గ‌న్ తీస్కొచ్చిన డిజిట‌ల్ బుక్ ప్ర‌ధానోద్దేశం. ఇది చూస్తుంటే రివ‌ర్స్ అయ్యేలా క‌నిపిస్తోంది..

మాములుగా అయితే ఈ డిజిట‌ల్ బుక్ కి ప్ర‌త్య‌ర్ధి  పార్టీలు, మ‌రీ ముఖ్యంగా టీడీపీ, జేఎస్పీ, బీజేపీ వారిపై కంప్ల‌యింట్లు రావాలి. కానీ ఎంత చిత్ర‌మంటే చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధిక సంఖ్య‌లో వైసీపీ  కార్య‌క‌ర్త‌ల నుంచి మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కంప్ల‌యింట్లు రావ‌డంతో ఒక్క‌సారిగా  పార్టీ షాక‌య్యింది.

అస‌లు పార్టీ ఇంత ఘోరంగా ఎందుకు ఓడిందో అప్ప‌డు అర్ధ‌మైంద‌ట‌.. జ‌గ‌న్ కి. ఇక్క‌డ మ‌నం ఒక్క‌రే ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా మ‌ద్యం కుంభ‌కోణం వంటి వాటి ద్వారా దోచుకుంటున్నాం. మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతో మంచి వారు, స‌చ్చీలురు అనుకుంటూ వ‌చ్చార‌ట జ‌గ‌న్. కానీ వారు కూడా సేమ్ టూ సేమ్.. అదే ఫ్లో మెయిన్ టైన్ చేస్తున్న‌ట్టు ఆయ‌న‌కు అంత వ‌ర‌కూ అర్ధ‌మ‌య్యింది కాదు.

ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ ఓట‌మికి ప్ర‌ధాన  కార‌ణం వాలంటీర్లుగానే భావిస్తూ వ‌చ్చారు. అందుకే ఇటీవ‌ల ఒక స్ట్రాంగ్ డెసిష‌న్ తీస్కున్నారాయ‌న‌. ఒక వేళ మ‌నం అధికారంలోకి వ‌స్తే.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసి.. ఆపై కార్య‌క‌ర్త‌ల‌పైనే ఆధార ప‌డాల‌ని భావించిన జ‌గన్ కి డిజిట‌ల్ బుక్ ద్వారా ఈ విష‌యం తెలియ‌డంతో ఏం చేయాలో పాలు పోలేద‌ట‌.

మ‌హిళా మంత్రుల‌ని మ‌నం త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీల్లేదని అంటారు ఫ్యాను పార్టీ వ‌ర్గాలు వారు.. రోజా ఆడుదాం ఆంధ్ర ద్వారా,  ర‌జ‌నీ స్టోన్ క్ర‌ష‌ర్ య‌జ‌మానులు, ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల ద్వారా భారీగానే దోచుకున్న‌ట్టు స‌మాచారం. ఉండ‌వ‌ల్లి శ్రీదేవిని అడిగితే విడుద‌ల ర‌జ‌నీ గురించి, ఆమె ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంత వెన‌కేసుకొచ్చారో ఏకంగా ఒక చిట్టా త‌యారు చేశారంటే ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు. 

అంత భారీగా ఉంటాయి ర‌జ‌నమ్మ లీల‌లు అంటారు ఉండ‌వ‌ల్లి శ్రీదేవిలాంటి కొంద‌రు. స‌రే శ్రీదేవికంటే తాను డాక్ట‌ర్ అయితే ఆరోగ్య శాఖ త‌న‌కివ్వాల్సింది ర‌జ‌నీకిచ్చార‌నే అసూయ ఉండొచ్చ‌ని లైట్ తీస్కుంది పార్టీ అధిష్టానం. ఇప్పుడుగానీ అస‌లు విష‌యం అఫిషియ‌ల్ గా తెలిసి రాలేద‌ట జ‌గ‌న్ కి. అంత‌గా ఆమెపై ఫిర్యాదులు వెల్లువ‌ల అందుతున్నాయ‌ట‌.

ఇక రోజా అయితే టీటీడీ చ‌రిత్ర‌లోనే క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో.. టోకెన్లు అమ్మి సొమ్ము చేసుకున్న‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయ్. ఈ విష‌యంపై మా ద‌గ్గ‌ర బోలెడు ఆధారాలున్నాయంటారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు.

ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మే.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో.. ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ద్వారా సాగిన అవినీతి కాండకు జ‌గ‌న్ భారీ మూల్యం చెల్లించుకోవ‌ల్సి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అప్ప‌టికీ లీలా మాత్రంగా వీట‌న్నిటి గురించి విన్న జ‌గ‌న్ వారి వారి ప్రాంతాల నుంచి ఆయా లీడ‌ర్ల‌ను త‌ర‌లించి ఇత‌ర ప్రాంతాల్లో పోటీ చేయించినా ఫ‌లితం లేకుండా  పోయింది.

ఇప్పుడు జ‌గ‌న్ కి మ‌రింత స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతున్న విష‌యం ఏంటంటే.. తాను వీరి మాయ‌లో ప‌డిపోయి.. వారు తెర వెన‌క ఏం  చేస్తున్నారో అస్స‌లు ప‌ట్టించుకోలేక పోయాన‌ని తీవ్రంగా బాద ప‌డుతున్నార‌ట‌. ఆ మాట‌కొస్తే వాళ్ల‌ను నిల‌దీసే  ప‌రిస్థితి  కూడా లేదు. అందుకు రీజ‌న్.. తాను కూడా త‌లాపాపం తిలాపిడికెడు అన్న‌ట్టు.. త‌మ హ‌యాంలో చేసిన అవినీతి య‌జ్ఞంలో పీక‌లోతు మునిగి పోయి ఉండ‌ట‌మే.. అన్న‌ది అస‌లు విష‌యంగా తెలుస్తోంది. మ‌రి చూడాలి ర‌జ‌నీతో పాటు మ‌రి ఎంద‌రిపై డిజిటల్ బుక్ లో కంప్ల‌యింట్లు వ‌స్తాయో.

By
en-us Political News

  
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.