కమలంలో లుకలుకలు!

Publish Date:Jul 5, 2022

Advertisement

నిజం. బీజేపీలో జోష్ పెరిగింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతగా నిర్వహించడమే కాకుండా.. బహిరంగ సభను ఆ స్థాయిలో సక్సెస్ చేయడంతో  పార్టీ జాతీయ  నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం పై విశ్వాసం మరింతగా పెరిగింది. ముఖ్యంగా బహిరంగ సభ ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందనికానీ, అంత పెద్ద ఎత్తున జనసమీకరణ సాధ్యమవుతుందని కానీ, ప్రధాని నరేంద్ర మోడీ సహా పార్టీ పెద్దలు ఎవరూ ఉహించలేదు. అందుకే, ప్రధాని నరేంద్ర మోడీ, ఉబ్బి తబ్బిబై పోయారు. వేదిక మీదనే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్’ను భుజం తట్టి మరీ అభినందించారు. 

అయితే, ఇప్పడు ఆ అభినందనే పార్టీలో లుకలుకలు సృష్టించిందా, అంటే, అవుననే అంటున్నారు పార్టీ పెద్దలు, పరిశీలకులు.నిజానికి బీజేపీలో గత కొంత కాలంగా సంజయ్ కేంద్రంగా అప్పుడప్పుడు లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. అలాగే, పాత కొత్త నాయకుల వివాదం కూడా ఎప్పటినుంచో వుంది. ఆ కారణంగానే నాగం జనార్ధన రెడ్డి, మొత్కుపల్లి నరసింహులు ఎక్కువకాలం పార్టీలో ఉండలేక పోయారు. మరోవంక పార్టీలో కొనసాగుతున్న బయటి నేతల్లోనూ అసంతృప్తి అప్పుడప్పుడు బయట పడుతూనే వుంది.  దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు అయితే, సంజయ్ వ్యవహార శైలిపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తపరిచారు. అలాగే, పార్టీలో పాత కాపులు కొత్తగా చేరిన నాయకుల మధ్య రోజురోజుకు దూరం రుగుతోందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. 

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్’ కూడా ఒకటి రెండు సందర్భాలలో ఈ విషయంలో తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్త పరిచారు.ఎంతోకాలంగా పార్టీలో ఉన్న నాయకులకు, కొత్తగా చేరిన నేతలకు మధ్య సహజంగానే కొంత వ్యత్యాసం ఉంటుంది. అందులోనూ భావజాల పునాదులపై నిర్మాణమైన పార్టీలో ఇలాంటి దూరం ఇంకొంత ఎక్కువగానే ఉంటుంది. అయితే. పార్టీ ఎదగాలన్నా, ఎన్నికల్లో గెలవలన్నా, క్షేత్ర స్థాయిలో పట్టున్న నాయకులకు కలుపుకు పోవడం అవసరమని ఈటల గతంలోనే బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు.

 అయితే, జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా, అంతకు ముందు కూడా పార్టీ జాతీయ నాయకత్వం ఈటల ఇవ్వవలసిన గౌరవం ఇచ్చిందని, పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులకు ఇచ్చిన గౌరవమే ఈటలకు ఇస్తోంది పార్టీ నేతలు అంటున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో, రాజకీయ తీర్మానంలో భాగంగా తెలంగాణ రాజకీయ పరిస్తితులపై  ప్రసంగించే అవకాశం, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్’ కు ఇచ్చారని, అలాగే, బహిరంగ్ సభలో అవకాశం కూడా ఈటలలకు దక్కిందని అంటున్నారు.  

అదలా ఉంటే, అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ..ఇప్పడు బండి సంజయ్ ని ప్రధాని మోడీ అభినందించడం దేనికి సంకేతం అనే చర్చమొదలైంది. మరో వంక ఎన్నికలు ఎప్పుదు వచ్చినా విజయం బీజేపీదే, అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపధ్యంలో, ‘నిజ్జంగానే’ బీజేపే అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. నిజానికి గతంలోనూ తుక్కుగూడలో ఏర్పాటు చేసిన సభలో హోం మంత్రి అమిత్ షా.. కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి మోడీ అవసరం లేదని.. ఇందుకు బండి సంజయ్ సరిపోతారని సంజయ్ సామర్ధ్యంపై విశ్వాసం ప్రకటించారు . ఇప్పడు, మోడీ మరింత ఉత్సాహంగా భుజం తట్టడంతో మరోసారి పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే విషయంలో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. 

అయితే పార్టీ సీనియర్ నాయకులు మాత్రం, బీజేపీలో నాయకుల మధ్య పోటీ ఉంటుంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్ధి ఎవరన్న విషయంలో పార్టీలో చాలా  పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పార్టీ సీనియర్ నాయకుడు అద్వానీ, అప్పటి ప్రతిపక్ష నేత   సుష్మా స్వరాజ్ సహా చాలా మంది నేతలు పోటీ పడ్డారు. చివరకు పార్టీ మోడీ పేరు ఖరారు చేసిన తర్వాత, అక్కడక్కడ లుకలుకలు వినిపిచినా, పార్టీ అనూహ్య విజయం సాధించడంతో, అందరూ సర్దుకు పోయారని గుర్తు చేస్తున్నారు.  అదే విధంగా, తాజాగా మహారాష్టలో మాజే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌’ను కాదని శివసేన చీలిక వర్గం నాయకుడు ఏక్’నాథ్ షిండే’కు అవకాశం ఇచ్చిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.

బీజేపీ సన్యాసుల మఠం కాదు.పార్టీ నాయకులకు పదవుల మీద ఆశలు ఉండవు అని అనలేము. ఎవరైనా అలా అనుకుంటే అది ఆత్మ వంచనే అవుతుందని, అయితే వ్యక్తిగత పదవుల కంటే పార్టీకి, పార్టీ కంటే దేశానికీ పెద్ద పీట వేయడం(దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, వ్యక్తీ లాస్ట్) నేతలు ఫాలో అవుతారని పార్టీ సీనియర్ నాయకులు  అంటున్నారు.

అయితే, ఆలు లేదు చూలు లేదు, అప్పుడే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ అనవసరమని, సమయం వచ్చినప్పుడు పార్టీ జాతీయ నాయకత్వం ఆ విషయం  చూసుకుంటుందని అంటున్నారు. అలాగే, ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి ఎవరు? అనేంత వరకు వెళితే, అది మొదటికే మోసం అవుతుందని అంటున్నారు. అయితే, పార్టీలో  లుకలుకలు అయితే మొదలయ్యాయి, అందులో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని అని చెప్ప‌డం మిన‌హా, ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.
క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.