కమలంలో లుకలుకలు!

Publish Date:Jul 5, 2022

Advertisement

నిజం. బీజేపీలో జోష్ పెరిగింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతగా నిర్వహించడమే కాకుండా.. బహిరంగ సభను ఆ స్థాయిలో సక్సెస్ చేయడంతో  పార్టీ జాతీయ  నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం పై విశ్వాసం మరింతగా పెరిగింది. ముఖ్యంగా బహిరంగ సభ ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందనికానీ, అంత పెద్ద ఎత్తున జనసమీకరణ సాధ్యమవుతుందని కానీ, ప్రధాని నరేంద్ర మోడీ సహా పార్టీ పెద్దలు ఎవరూ ఉహించలేదు. అందుకే, ప్రధాని నరేంద్ర మోడీ, ఉబ్బి తబ్బిబై పోయారు. వేదిక మీదనే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్’ను భుజం తట్టి మరీ అభినందించారు. 

అయితే, ఇప్పడు ఆ అభినందనే పార్టీలో లుకలుకలు సృష్టించిందా, అంటే, అవుననే అంటున్నారు పార్టీ పెద్దలు, పరిశీలకులు.నిజానికి బీజేపీలో గత కొంత కాలంగా సంజయ్ కేంద్రంగా అప్పుడప్పుడు లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. అలాగే, పాత కొత్త నాయకుల వివాదం కూడా ఎప్పటినుంచో వుంది. ఆ కారణంగానే నాగం జనార్ధన రెడ్డి, మొత్కుపల్లి నరసింహులు ఎక్కువకాలం పార్టీలో ఉండలేక పోయారు. మరోవంక పార్టీలో కొనసాగుతున్న బయటి నేతల్లోనూ అసంతృప్తి అప్పుడప్పుడు బయట పడుతూనే వుంది.  దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు అయితే, సంజయ్ వ్యవహార శైలిపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తపరిచారు. అలాగే, పార్టీలో పాత కాపులు కొత్తగా చేరిన నాయకుల మధ్య రోజురోజుకు దూరం రుగుతోందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. 

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్’ కూడా ఒకటి రెండు సందర్భాలలో ఈ విషయంలో తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్త పరిచారు.ఎంతోకాలంగా పార్టీలో ఉన్న నాయకులకు, కొత్తగా చేరిన నేతలకు మధ్య సహజంగానే కొంత వ్యత్యాసం ఉంటుంది. అందులోనూ భావజాల పునాదులపై నిర్మాణమైన పార్టీలో ఇలాంటి దూరం ఇంకొంత ఎక్కువగానే ఉంటుంది. అయితే. పార్టీ ఎదగాలన్నా, ఎన్నికల్లో గెలవలన్నా, క్షేత్ర స్థాయిలో పట్టున్న నాయకులకు కలుపుకు పోవడం అవసరమని ఈటల గతంలోనే బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు.

 అయితే, జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా, అంతకు ముందు కూడా పార్టీ జాతీయ నాయకత్వం ఈటల ఇవ్వవలసిన గౌరవం ఇచ్చిందని, పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులకు ఇచ్చిన గౌరవమే ఈటలకు ఇస్తోంది పార్టీ నేతలు అంటున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో, రాజకీయ తీర్మానంలో భాగంగా తెలంగాణ రాజకీయ పరిస్తితులపై  ప్రసంగించే అవకాశం, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్’ కు ఇచ్చారని, అలాగే, బహిరంగ్ సభలో అవకాశం కూడా ఈటలలకు దక్కిందని అంటున్నారు.  

అదలా ఉంటే, అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ..ఇప్పడు బండి సంజయ్ ని ప్రధాని మోడీ అభినందించడం దేనికి సంకేతం అనే చర్చమొదలైంది. మరో వంక ఎన్నికలు ఎప్పుదు వచ్చినా విజయం బీజేపీదే, అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపధ్యంలో, ‘నిజ్జంగానే’ బీజేపే అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. నిజానికి గతంలోనూ తుక్కుగూడలో ఏర్పాటు చేసిన సభలో హోం మంత్రి అమిత్ షా.. కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి మోడీ అవసరం లేదని.. ఇందుకు బండి సంజయ్ సరిపోతారని సంజయ్ సామర్ధ్యంపై విశ్వాసం ప్రకటించారు . ఇప్పడు, మోడీ మరింత ఉత్సాహంగా భుజం తట్టడంతో మరోసారి పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే విషయంలో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. 

అయితే పార్టీ సీనియర్ నాయకులు మాత్రం, బీజేపీలో నాయకుల మధ్య పోటీ ఉంటుంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్ధి ఎవరన్న విషయంలో పార్టీలో చాలా  పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పార్టీ సీనియర్ నాయకుడు అద్వానీ, అప్పటి ప్రతిపక్ష నేత   సుష్మా స్వరాజ్ సహా చాలా మంది నేతలు పోటీ పడ్డారు. చివరకు పార్టీ మోడీ పేరు ఖరారు చేసిన తర్వాత, అక్కడక్కడ లుకలుకలు వినిపిచినా, పార్టీ అనూహ్య విజయం సాధించడంతో, అందరూ సర్దుకు పోయారని గుర్తు చేస్తున్నారు.  అదే విధంగా, తాజాగా మహారాష్టలో మాజే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌’ను కాదని శివసేన చీలిక వర్గం నాయకుడు ఏక్’నాథ్ షిండే’కు అవకాశం ఇచ్చిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.

బీజేపీ సన్యాసుల మఠం కాదు.పార్టీ నాయకులకు పదవుల మీద ఆశలు ఉండవు అని అనలేము. ఎవరైనా అలా అనుకుంటే అది ఆత్మ వంచనే అవుతుందని, అయితే వ్యక్తిగత పదవుల కంటే పార్టీకి, పార్టీ కంటే దేశానికీ పెద్ద పీట వేయడం(దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, వ్యక్తీ లాస్ట్) నేతలు ఫాలో అవుతారని పార్టీ సీనియర్ నాయకులు  అంటున్నారు.

అయితే, ఆలు లేదు చూలు లేదు, అప్పుడే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ అనవసరమని, సమయం వచ్చినప్పుడు పార్టీ జాతీయ నాయకత్వం ఆ విషయం  చూసుకుంటుందని అంటున్నారు. అలాగే, ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి ఎవరు? అనేంత వరకు వెళితే, అది మొదటికే మోసం అవుతుందని అంటున్నారు. అయితే, పార్టీలో  లుకలుకలు అయితే మొదలయ్యాయి, అందులో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం 3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.