పెద్దిరెడ్డి కుటుంబాన్ని వైసీపీ వదిలేసిందా?

Publish Date:Aug 28, 2025

Advertisement

వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ జగన్ సర్కార్ లో అప్రకటిత నంబర్ 2 పొజిషన్ ను ఎంజాయ్ చేసిన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు పార్టీలో ఏకాకి అయిపోయారా అంటే పరిస్థితులను బట్టి చూస్తే ఔననే అనిపించక మానదు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పార్టీలోనూ, జిల్లాలోనూ తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. జగన్ కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందారు. మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డిది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి  సొంత జిల్లా  చిత్తూరు కావడంతో చిత్తూరు జిల్లాపై వైసీపీ ఆధిపత్యం కోసం జగన్ కూడా పెద్దిరెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. 
చిత్తూరు ఎంత చంద్రబాబు సొంత జిల్లా అయినా.. తెలుగుదేశం పార్టీకి ఆ జిల్లాలో సంపూర్ణ ఆధిపత్యం గతంలో ఎన్నడూ లేదు. 2014 ఎన్నికలను తీసుకుంటే రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా చిత్తూరు జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ 14 అసెంబ్లీ  స్థానాలకు  గాను కేవలం ఆరింటిలోనే విజయం సాధించగలిగింది. అదే 2019 ఎన్నికలకు వచ్చే సరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుప్పం వినా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పరాజయం పాలైంది. అలాగే జిల్లాలోని చిత్తూరు, తిరుపతి పార్లమెంటు స్థానాలలోనూ ఓడిపోయింది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికలలో పరిస్థితిపూర్తిగా తిరగబడింది. ఆ ఎన్నికలలో  వైసీపీ కేవలం  రెండంటే రెండు స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. 

వాస్తవానికి చిత్తూరు జిల్లాలో వైసీపీకి బలమైన నాయకుల బలం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, మిథున్ రెడ్డి, రోజా, నారాయణ స్వామి వంటి బలమైన నాయకులు ఉన్నారు. అయితే అంతర్గత కుమ్ములాటలు, విభేదాలతో 2019, 2024  మధ్యా కాలంలో  జిల్లాలో పార్టీ బలహీనపడటానికి వీరే కారకులయ్యారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్య ధోరణి కారణంగా పార్టీకి చెందిన జిల్లా నాయకులంతా ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు.

ఇక 2024లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసి.. కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకోని దయనీయ స్థతికి పతనమయ్యాకా.. చిత్తూరులో వైసీపీ ఉనికి మాత్రంగా మిగిలిపోయిందని చెపవచ్చు. సరే ఇదంతా పక్కన పెట్టి విషయానికి వస్తే.. మద్యం కుంభకోణంలో ఇరుక్కుని మిథున్ రెడ్డి జైలు పాలైన తరువాత జిల్లాకు చెందిన నాయకులెవరూ ఇంత వరకూ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా  ఉన్న ఆయన కోసం తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నినా ఎవరూ వెళ్లి పరామర్శించి పలకరించిన పాపాన పోలేదు. ఒకప్పుడు మిథున్ రెడ్డికి రాఖీ కట్టిన రోజా కూడా ఆ తరువాత కాలంలో పెద్దిరెడ్డితో విభేదాల కారణంగా మిథున్ రెడ్డిని పరామర్శించే ఆలోచన కూడా చేయడం లేదంటారు. ఇక జిల్లాలో మరో బలమైన నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా మద్యం కుంభకోణంలో జైలు పాలైన సంగతి తెలిసిందే.  ఇక జిల్లాలోని ఇతర నాయకుల పరిస్థితి చూస్తుంటే.. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను చూసి లోలోన ఆనందిస్తున్నారా అన్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్టునకు వ్యతిరేకంగా తొలి రోజులలో జరిగిన నామమాత్రపు నిరసనలు వినా.. వైసీపీ నేతలు, కార్యకర్తలు అసలాయనను పట్టించుకున్నట్లు కూడా కనిపించడం లేదు. 

ఇక మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి విషయానికి వస్తే ఆయన తాను ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సమయంలో తనకు పూచిక పుల్ల పాటి విలువ కూడా ఇవ్వలేదన్న ఆక్రోశాన్నీ, ఆగ్రహాన్నీ బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సిట్ ఆయనను విచారించినప్పుడు కూడా ఆయన మద్యం కుంభకోణం విషయంలో తనకు ఇసుమంతైనా సంబంధం లేదనీ, ఈ కుంభకోణం జరిగిన సమయంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పటికీ తనను పక్కన పెట్టి వ్యవహారమంతా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలే నడిపారని చెప్పినట్లు గట్టిగా వినిపిస్తోంది. ఇక జిల్లాకే చెందిన మరో నాయకుడు భూమన కరుణాకరరెడ్డి విషయానికి వస్తే ఆయన తిరుపతి, టీటీడీ విషయాలు తప్ప మరేమీ పట్టించుకునే పరిస్థితులు లేవు.  

ఇక ఇప్పుడు పెద్దిరెడ్డి వర్గీయులు రోజా, భూమనల అరెస్టుల కోసం ఎదురు చూస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో మాజీ మంత్రి రోజా, టీడీఆర్ కుంభకోణంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిలు త్వరలోనే అరెస్టు కాకతప్పదని వైసీపీ వర్గాలే చెబుతుండటం.. చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎంతగా సంక్షోభంలో కూరుకుపోయిందో అర్ధమౌతుందని పరిశీలకులు అంటున్నారు. ఇక జగన్ విషయానికి వస్తే.. మద్యం కుంభకోణం తన మెడకు చుట్టుకుంటుందన్న ఆందోళనతో అసలు ఆ కుంభకోణంలో అరెస్టైన వారిని కనీసం పరామర్శించడానికి కూడా ఇష్టపడని పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. ఎలా చూసినా వైసీపీ పెద్దిరెడ్డి ఫ్యామిలీని వదిలేసినట్లే కనిపిస్తోందని చెబుతున్నారు.  

By
en-us Political News

  
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.