ఏపీలో పొత్తులపై పవన్ ఢిల్లీ నుండి క్లారిటీ ఇచ్చారా.. కన్ఫ్యూజ్ చేశారా?!

Publish Date:Jul 18, 2023

Advertisement

ఏపీ రాజకీయాలు రసకందాయంగా సాగుతున్నాయి. ఇక్కడ ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో రోజులు గడిచే కొద్దీ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే ముందుగా గుర్తుకు వచ్చేది పొత్తులు, సీట్ల పంపకాలు, అధికార భాగస్వామ్యం. ఇవన్నీ కుదిరితేనే పొత్తులు ఖరారై ఉమ్మడి కార్యాచరణ మొదలవుతుంది. ఉమ్మడి మ్యానిఫెస్టోతో ప్రజల మధ్యకి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, ఏపీలో మాత్రం నాలుగు నెలల నుండి ఈ పొత్తుల అంశం నాన్చివేత, సాగతీత ధోరణే సాగుతుంది. ఇదిగో తేలిపోతుంది అనుకునే లోపే ఎవరికి వారు ఆ ఊసే లేకుండా గడిపేస్తున్నారు. దీంతో ఒక దశలో ఇక పొత్తులు ఉండవని.. ప్రతిపక్షాలు పునరాలోచన చేస్తున్నాయనే ప్రచారం కూడా మొదలైంది.

కాగా, ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ పొత్తులపై క్లారిటీ ఇస్తారనే మరో ప్రచారం మొదలైంది. దీనికి కారణం ఆయన ఢిల్లీలో జరిగే ఎన్డీఏ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కావడమే. జులై 18 మంగళవారం ఢిల్లీలో జరిగిన  విస్తృత స్థాయి సమావేశానికి బీజేపీ కొత్త మిత్రులతో పాటుగా తన నుండి విడిపోయిన పాత మిత్రులను కూడా పిలిచింది. అయితే, రాజకీయ వర్గాలు భావించినట్లే ఏపీ నుండి టీడీపీకి పిలుపు రాలేదు. అదే సమయంలో జనసేనకి  పిలుపు వచ్చింది. ఈ భేటీకి పవన్ కళ్యాణ్  హాజరయ్యారు. మొత్తం 38 పార్టీలు ఈ సమావేశానికి హాజరు అయ్యాయి. ఇది బీజేపీ బల ప్రదర్శన అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చెప్పారు. ఇలాంటి బలప్రదర్శన సమావేశానికి కూడా టీడీపీకి ఆహ్వానం అందించలేదు. మరోవైపు ఢిల్లీలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ పర్యటనలో ఏపీలో ఎన్నికల పొత్తులపై కూడా బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవకాశం కోసమే చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని.. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేశామని.. 2019లో విడివిడిగా పోటీ చేశామని.. ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చిస్తామన్నారు. ఈ భేటీలో ఏపీ, తెలంగాణల అభివృద్ధి గురించి.. ఎన్డీఏ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విషయంపై కూడా చర్చలు జరుపుతామని వెల్లడించారు. పవన్ వ్యాఖలను చూస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో టీడీపీ విడిగానే పోటీ చేస్తుందా? లేక పవన్ ఢిల్లీ నుండి పొత్తుల అంశంపై క్లారిటీతో ఏపీకి వస్తారా అనే చర్చలు మొదలయ్యాయి. అయితే ఢిల్లీలో పవన్ వ్యాఖ్యలు, హావ భావాలు ఆయనలోని కన్ఫ్యూజన్ నే మరో సారి ఎత్తి చూపాయి. ఆయన తన కన్ఫ్యూజ్ ను అందరికీ  వ్యాపింప చేసేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఒక రాజకీయ వర్గం నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ ఎన్డీయే భేటీలో చాలా విషయాల మీద బీజేపీ పెద్దల నుంచి క్లారిఫికేషన్ తీసుకుంటారని.. ఏపీలో పొత్తులు ఉండాలంటే జగన్ తో బంధాన్ని బీజేపీ వదులుకోవాలని కండిషన్ పెడతారని  తెలుస్తోంది. కానీ హస్తిన వేదికగా పవన్ మాట్లాడిన మాటలను బట్టి ఆయన ఏం మాట్లాడారో, బీజేపీ పెద్దలు ఏం చెప్పారో స్పష్టతే  లేకుండా పోయింది. ఏపీలో పొత్తులు అంటే వైసీపీని దించే పొత్తులుగా ఉండాలని.. ఏపీలో పెద్ద పార్టీగా ఉన్న టీడీపీని కూడా కలుపుకుని పోతేనే అది సాధ్యపడుతుందని మొదటి నుండి పవన్  చెబుతూ వచ్చారు. వైసీపీ వ్యతిరేక  ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అని చెబుతూ వచ్చారు. ఆ దిశగా బీజేపీ హై కమాండ్ ను ఒప్పిస్తాననీ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేసింది లేదు కానీ.. బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం రాష్ట్రంలోని వైసీపీ  సర్కార్ కు అన్ని విధాలుగా అండదండగా నిలుస్తూనే వస్తోంది.  తాజాగా పవన్ కు ఢిల్లీలో  బీజేపీ పెద్దలతో కలిసిన తరువాత కూడా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితిలోనే ఉన్నారని ఆయన మాటలద్వారానే అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.