కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెగేదాకా లాగేశారా?

Publish Date:Aug 17, 2022

Advertisement

ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలన్నారు పెద్దలు.. అలాగే ఏదైనా సరే తెగేదాకా లాగకూడదనీ అన్నారు. అయితే వెంకటరెడ్డి ఆ రెంటినీ పరిధి దాటి వాడేశారా? ఇక వెంకటరెడ్డి విషయంలో కాంగ్రెస్ సీరియస్ నిర్ణయం తీసేసుకుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన క్షణం నుంచీ.. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. అంతకు ముందు నుంచీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ ను వీడతాను జగ్రత్త అంటూ అధిష్ఠానానికి ఫీలర్లు పంపుతూనే ఉన్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పట్ల తన వ్యతిరేకతను ఏ మాత్రం దాచుకోకుండా రచ్చ చేస్తూనే ఉన్నారు. అధిష్ఠానం కోమటిరెడ్డి బ్రదర్స్ ను బుజ్జగించేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. సరే కోమటిరెడ్డి బుజ్జగింపులను పట్టించుకోలేదు.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటి నుంచీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ను ఒక విధంగా బ్లాక్ మెయిల్ చేశారనే చెప్పాలి. టీపీసీసీ చీఫ్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ కు అంగీకరించి రేవంత్ రెడ్డి క్షమాపణ కూడా చెప్పారు. అయితే కోమటిరెడ్డి తన వైఖరి మార్చుకోలేదు. క్షమాపణలు ఎవరిక్కావాలి అంటే మళ్లీ కొత్త రాగం అందుకున్నారు. దీంతో కాంగ్రెస్ హై కమాండ్ కు లైట్ వెలిగింది.

కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నారన్నది కాంగ్రెస్ కు అర్ధమైంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వరకూ వేచి చూడాలన్న సేఫ్ గేమ్ ఆడుతున్నారని అవగతమైంది. దీంతో కాంగ్రెస్ కూడా వెంకటరెడ్డిని డ్రాపౌట్ గా పరిగణించడం ప్రారంభించింది. ఎందుకంటే వెంకటరెడ్డి మునుగోడులో సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా పని చేసేందుకు ఏ మాత్రం సుముఖంగా లేదని తేటతెల్లమైంది. దీంతో కోమటిరెడ్డి విమర్శలు, డిమాండ్లకు ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. కోమటిరెడ్డి తీరు పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా లేదనీ, ఆయన వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ ను బలహీనపరచడమేననీ పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ హై కమాండ్ ఆయనకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

ఇక విమర్శలను ఆపేయాలనీ, సైలెంట్ గా ఉండాలనీ ఖరాఖండీగా చెప్పేసిందని పార్టీ శ్రేణులు అంటున్నారు. అంటే కోమటిరెడ్డికి పార్టీ హైకమాండ్ ఉంటే ఉండు.. లేకుంటే నీ సోదరుడి మాదిరిగానే నీ దారి నువ్వు చూసుకో అని చెప్పకనే చెప్పేసింది. మామూలుగా అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పాటికే పార్టీకి రాజీనామా చేసి రాజగోపాలరెడ్డి బాట పట్టి ఉండాల్సింది. కానీ కోమటిరెడ్డికి కావలసింది అది కాదు.. పార్టీ పొమ్మనలేక పొగపెట్టినంత మాత్రాన వెళ్లడానికి సిద్ధంగా లేరు. పార్టీలో ఉంటూనే తన వ్యవహార శైలితో.. మునుగోడులో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విజయానికి దోహదపడే విధంగా వ్యవహరించాలి. అది భరించలేక కాంగ్రెస్ పార్టీయే తనపై చర్య తీసుకుని పార్టీ నుంచి బహిష్కరించాలి. అప్పుడే తనకు సానుభూతితో పాటు సోదరులిద్దరికీ కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న ప్రచారానికి అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు.

అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గేమ్ ప్లాన్ ను పసిగట్టిన కాంగ్రెస్.. ఆయన గేమ్ ప్లాన్ కు విరుగుడు మార్గం అనుసరిస్తోంది. కోమటిరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించకుండా ఆయన నోరు అదుపు చేయాలని భావిస్తోంది. ఆయనను పొమ్మనదు.. అలాగని పార్టీలో ఆయన ఉనికిని గుర్తించదు. అన్న చందంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పడంతో కోమటిరెడ్డికి ఆఖరి చాన్స్ ఇచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఆ తరువాత కూడా కోమటిరెడ్డి తీరు మారకపోవడంతో ఆయన ఉనికినే గుర్తించని విధంగా పార్టీ ముందుకు సాగాలని ఒక నిర్ణయానికి వచ్చిందని పరిశీలకలు అంటున్నారు. అందుకే ఆయన విమర్శలను, అలకలను పట్టించుకోకుండా పూర్తిగా మునుగోడు విజయం మీదే దృష్టి కేంద్రీకరించాలని పార్టీ శ్రేణులకు, రాష్ట్ర నాయకత్వం ద్వారా హై కమాండ్ విస్పష్ట ఆదేశాలు ఇచ్చిందని అంటున్నారు.

By
en-us Political News

  
ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరో వైపు చెల్లెళ్ల విమర్శలు, ఇంకో వైపు పార్టీ నుంచి పెరిగిపోతున్న వలసలు, వెరసి ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారా? ఆఫ్రస్ట్రేషన్ లో సొంత చెల్లెలిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి తనకు తానే నష్టం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఏంటమ్మా జగనూ... మొన్న చెల్లి షర్మిలమ్మ ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు చూశాంలే..
కేసీఆర్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ ను పండించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కారణాలేమైతేనేం చాలా రోజుల పాటు ఎక్కడా బహిరంగంగా మాట్లాడని ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రజల ముందుకు వచ్చారు.
గుడివాడ, గన్నవరం.. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు చోట్లా కూడా వైసీపీ అభ్యర్థుల తీరు, భాష పట్ల ఆయా నియోజకవర్గాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ వైసీపీ గాంభీర్యం పదర్శిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది.
ఏపీలో భానుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ తానేదో పెద్ద రాజకీయవేత్త అన్నట్టుగా బిల్డప్పు ఇస్తుంటారుగానీ, ఆయన నడిపేవి దిక్కూమొక్కూ లేని రాజకీయాలు.
నిజామాబాద్ లో మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులూ ఆరితేరిన ఉద్ధండులే! ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్ని బ‌ట్టి చూస్తే ఓటర్లు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు! ఏడు సెగ్మెంట్లలో మూడు చోట్ల‌ బీఆర్‌ఎస్‌ గెలిస్తే.. కాంగ్రెస్‌, బీజేపీ రెండేసి చొప్పున పంచుకున్నాయి! పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పుడు మూడు పార్టీలూ హోరాహోరీ తలపడుతున్నాయి!
ఏడు విడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రెండో విడత పోలింగ్ ఈ రోజు ఉదయం మొదలైంది. కేరళలోని మొత్తం 20 లోక్ సభ స్థానాలకూ, కర్నాటకలో 14, రాజస్థాన్ లో 13, మహారాష్ట్ర, యూపీలలో ఎనిమిదేసి స్థానాలకు, మధ్య ప్రదేశ్ లో 7, బీహార్, అసోంంలలో ఐదేసి, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ లో రెండేసి స్థానాలకూ ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.
అమాయ‌కమైన ముఖం పెట్టి అబ‌ద్ధాలను అల‌వోక‌గా చెప్ప‌డంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మించిన రాజ‌కీయ నేత మ‌రొక‌రు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పైన‌.. సొంత చెల్లెళ్ల‌పైన‌కూడా ఎలాంటి సంకోచం లేకుండా అధారాలు లేని అభాండాలను, అసత్య వ్యాఖ్యలను అలవోకగా చేస్తూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో జ‌గ‌న్ దిట్ట.
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. శుక్రవారం (ఏప్రిల్ 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
తనను తాను తగ్గించుకునే విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్ధిస్తూ మాట్లాడి తన స్థాయి ఏమిటో తానే చెప్పుకున్నారు.
జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మ్యానరిజమ్స్ చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్ కు కాదేదీ అనర్హం అన్నట్లుగా నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ఆటాడుకుంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.