ధర్మానా! ఇది నీకు ధర్మమేనా?
Publish Date:Jan 8, 2013
Advertisement
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? మన గౌరవనీయ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావుగారు, ఆయనగారి పుత్రరత్నం రామ్ మనోహర్ నాయుడు కధ వింటే ఆ సామెత వారిరువురి కోసమే పుట్టిందా అని అనిపించకమానదు. సిబిఐ చార్జ్ షీట్లో మన మంత్రివర్యులపేరు ఎక్కడంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, తన కార్యాలయం వైపు తొంగి చూడకుండానే, నెలనెలా టంచనుగా జీత భత్యాలు మాత్రం ఏంతో హుందాగా స్వీకరిస్తూ, కోర్టులచుట్టూ మంత్రిగారు తిరుగుతుంటే, మరో వైపు సదరు మంత్రివర్యుల గారి పుత్రరత్నం, తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి అడుగుజాడలలో నడుస్తూ, శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో పులిపట్టి గ్రామ పరిధిలోగిరిజనుల సాగు చేసుకొంటున్న సర్వ్ నం.289లో ఉన్నకన్నెధార అనే కొండ ప్రాంతం మీద మనసు పడ్డాడు. అంతే, ప్రభుత్వం ఆఘమేఘాలమీద కదిలి అతనికి చెందిన వర్జిన్ రాక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కన్నెధార ప్రాంతాన్ని క్వారీ మైనింగ్ కోసం ధారాదత్తం చేసేసింది. ప్రజల అభ్యంతరాలు, గిరిజనుల ఆక్రందనలు ఏవీ కూడా వారి చెవులకి గానీ, ప్రభుత్వ చెవులకు గానీ ఎక్కలేదు. స్థానికుల అభ్యంతరాలు పట్టించుకోకుండా క్వారింగుకి ఏర్పాట్లు చేస్తున్నమంత్రిగారి పుత్రరత్నంగారి కంపెనీపై విచారించి అడ్డుకోవలసిన జిల్లా కలెక్టర్ సౌరవ్ గౌర్ ఆయనకే అనుకూలంగా నివేదిక ఇచ్చి అభాసుపాలయేరు. ఆయన నివేదికతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసినందున, క్వారీ లీజుపై అభ్యంతరాలు తెలియజేస్తూ దాఖలయిన పిర్యాదును లోకాయుక్త విచారణకు స్వీకరిస్తూ, కలక్టర్ గారినే స్వయంగా వచ్చి సంజాయిషీ ఇవ్వమని ఆదేశించింది. ఇక, ఈ కధ ఈవిదంగా నడుస్తుంటే, మరో వైపు మంత్రిగారి పుత్రరత్నం గారికి చెందిన కొందరు వ్యక్తులు (స్థానికులు వారిని గూండాలు అంటున్నారు) కన్నెధార కొండ మీద గిరిజనులు తరతరాలుగా పూజలుచేసుకొంటున్న సీతారాములవారి ఆలయంలో విగ్రహాలను ద్వంసం చేసి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. మళ్ళీ ఆ గిరిజనులు కొత్త విగ్రహాలు పెట్టుకొని పూజిస్తుంటే మళ్ళీ ఇటీవలే మరోసారి కొందరు ‘వ్యక్తులు’ ఆంజనేయ స్వామివారి విగ్రహాన్నిబయట పడేసి, హుండీ పగులగొట్టి డబ్బులు కాజేసినట్లు మరోవార్త వచ్చింది. ప్రస్తుతం అమాయకులయిన గిరిజనులు తమ గోడు ఎవరికీ మొరపెట్టుకోవాలో తెలియక బాధపడతున్నారు. యధా తండ్రీ! తదా పుత్రా! అనుకోవాలేమో మరి!
http://www.teluguone.com/news/content/dharmana-prasada-rao-24-20307.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.