జగన్‌ నుంచి ధర్మం తనను తాను రక్షించుకుంది!

Publish Date:Sep 28, 2024

Advertisement

జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనను ప్రజలు తిరస్కరించారు. గత ఎన్నికలలో ఘోర ఓటమి తరువాత కూడా ఇసుమంతైనా మార్పు కనిపించని జగన్ ను చూసి ఇప్పుడు జనంఆయన రాజకీయాలలో కొనసాగడానికే అనర్హుడని తీర్మానించేసుకున్నట్లు కనిపిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వినియోగం జరిగిందని వెల్లడి కాగానే.. వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలు, అఘాయిత్యాలు ఒక్కటొక్కటిగా గుర్తు చేసుకుంటూ, తిరుమల పవిత్రతకు భంగం కలిగించడమే లక్ష్యంగా జగన్ హయాంలో తిరమల తిరుపతి దేవస్థానం పని చేసిందని విమర్శలు చేస్తున్నారు. తిరుమల దేవుడిని నల్ల రాతితో పోల్చిన భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా జగన్ నిర్మించగానే అత్యధికులు అన్న మాట వినాశకాలే విపరీత బుద్ధే అన్నది. ఆ తరువాత భూమన చైర్మన్ గా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు దేవుడి సొమ్ముకే ఎసరు పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కుమారుడి ఎన్నికల ప్రచారం కోసం తిరుమల దేవుడి సొమ్మును వినియోగించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను ఇప్పుడు ఎత్తి చూపుతున్నారు. 

తిరుమతి నుంచి వైసీపీ అభ్యర్థిగా భూమన కుమారుడు అభినయ్ రెడ్డి పోటీ చేస్తారని ఖరారు కాగానే.. అప్పటికి టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకరరెడ్డి ఎన్నికల నిధుల కోసం తిరుమల వెంకన్న సొమ్మును అప్పనంగా వినియోగించేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. తిరుమల తిరుమతి దేవస్థానం వార్షిక ఆదాయం నుంచి ఒక శాతం నిధులను తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలంటూ టీటీడీ పాలకమండలి సమావేశంలో తీర్మానం పెట్టారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తిరుపతి అభివృద్ధికి ఇప్పటికే టీటీడీ  అనేక అభివృద్ధి పనులు నిర్వహిస్తోంది. తిరుపతిలోని ప్రముఖ విద్య, వైద్య సంస్థలను టీటీడీ నిర్వహిస్తోంది. తిరుపతిలోని ప్రధాన రహదారుల నిర్వహణ టీటీడీదే. తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం 350 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇంత చేస్తున్న టీటీడీ వార్షిక ఆదాయం నుంచి అదనంగా మళ్లీ ఒక శాతం తిరుపతి అభివృద్ధికి కేటాయించాలన్న తీర్మానం ఎందుకంటే అప్పట్లోనే భూమన ప్రతిపాదనను అందరూ వ్యతిరేకించారు. వాస్తవానికి కుమారుడుని అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించుకోవడం కోసం భూమన దేవుడి నిధులను వినియోగించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదన చేశారు. 

ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండో.. జగన్ హయాంలో తిరమల తిరుపతి దేవస్థానాన్ని ఫక్తు వ్యాపార కేంద్రంగా, దోపిడీకి నిలయంగా మార్చేశారు. చివరాఖరికి తిరుమల గిరులను స్మగ్లింగ్ అడ్డాగా మార్చడానికి వణ్య ప్రాణుల భయాన్ని కూడా భక్తులలో కలిగించారు. అటవీ శాఖ వణ్య ప్రాణులను నడక మార్గంలో రాకుండా అదుపు చేయడం మాని, భక్తులకు కర్రలు ఇస్తాం మిమ్మల్ని మీరే  రక్షించుకోండి లేదా నడక మార్గంలో రావడం మానేయండి అన్నట్లు వ్యవహరించింది.  

ఇప్పుడు తిరుమల లడ్డూ తయారీలో  నెయ్యి కల్తీ వ్యవహారం వెలుగు చూడటంతో ఇది కూడా జగన్ ప్రభుత్వ నిర్వాకమే అన్న నిర్ధారణకు వచ్చేశారు. జగన్ హయాంలోనే రివర్స్ టెండరింగ్ కారణంగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కల్తీ చేసిన నెయ్యి పంపిణీ జరిగిందని అంటున్నారు. ఇక ఈ వ్యవహారంలో కూడా తనదైన అడ్డగోలు వ్యవహారంతో జగన్ తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై నెపం నెట్టేలా ఎదురుదాడికి ఉపక్రమించారు. ఆ క్రమంలోనే తిరుమల టూర్ పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. 

తన తిరుమల పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంటుందనీ, దాని వల్ల కావలసినంత పొలిటికల్ మైలేజ్ పొందవచ్చుననీ జగన్ భావించారు. ఆయన తిరుమల టూర్ ప్రకటన వెలువడిన క్షణం నుంచీ జరిగిన పరిణామాలను గమనిస్తే తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తధ్యమనే అంతా భావించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తారనీ, ఆయన తిరుమలకు వెళ్లకుండా అలిపిరి వద్దనే అడ్డుకుంటారనీ, దీంతో ఉద్రిక్తతలు ఏర్పడి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. అయితే జగన్ పప్పులు ఉడకలేదు. తెలుగుదేశం కూటమి పార్టీలు జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోబోమని విస్పష్టంగా ప్రకటించారు. అవే కాదు హిందూ సంస్థలు కూడా శాంతియుత నిరసనలకే పరిమితమౌతామని ప్రకటించాయి. ఆయన తిరుమల పర్యటనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ, అయితే నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా జగన్ తిరుమల దేవస్థానం కూడా జగన్ డిక్లరేషన్ ఇచ్చే తిరుమల దేవుడిని దర్శించుకోవాలని స్పష్టం చేసింది. ఇక్కడే జగన్ ఇబ్బంది పడ్డారు. తన పర్యటనను అడ్డుకోవడానికి అధికార తెలుగుదేశం కూటమి సర్వశక్తులూ సన్నద్ధం చేసుకుని సిద్ధమౌతుందనీ, ఆ సందర్బంగా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనీ జగన్ భావించారు. డిక్లరేషన్ ఇవ్వడానికి ఆయన ఎటూ సిద్ధంగా లేరు. అది పక్కన పెడితే  తన తిరుమల పర్యటన సందర్భంగా వివాదం, విధ్వంసం సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నం విఫలమవ్వడంతో మరో గత్యంతరం లేక తిరుమల టూర్ రద్దు చేసుకున్నారు. ఆ లోగానే టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి ద్వారా రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం నెలకొనేలా ఇష్టారీతిగా మత విశ్వాసాలపై వ్యాఖ్యలు చేయించారు. అయితే జనం ఈ సారి  జగన్ ఉచ్చులో పడలేదు. భూమన వ్యాఖ్యలను పట్టించుకోలేదు. 

అటు ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్య బద్ధంగా జగన్ టూర్ కు కాన్వాయ్ ని సిద్ధం చేసింది. దీంతో జగన్ తన టూర్ రద్దు చేసుకున్నారు. అయితే  ప్రభుత్వం తనను తిరుమల దేవుడి దర్శనానికి వెళ్లకుండా అడ్డంకులు సృష్ఠిస్తోందంటూ ఆరోపణలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టారు. అసందర్భంగా తననే దర్శనానికి వెళ్లకుండా అడ్డుకున్నారంటే ఇక దళితుల సంగతేంటంటూ కొత్త వివాదానికి తెరలేపడానికి ప్రయత్నించారు. అదీ ఫలించలేదు అది వేరే సంగతి.  కింద పడినా నాదే పై చేయి అనడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు చూసి వైసీపీ శ్రేణులే నవ్వుకుంటున్నాయి. అసలు జగన్ తిరుమల పర్యటన వ్యవహారంలో దళితుల ప్రస్తావన ఎందుకన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తిరుమల పర్యటనకు ఎటువంటి అడ్డంకులూ లేకపోయినా, పోలీసులు పూర్తి ఏర్పాట్లూ చేసినా సొంత కారణాలతోనే జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. తిరుమల దేవుడిపై విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేకనే జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఇందులో మరో సందేహానికి తావే లేదు. భూమన కరుణాకర్ రెడ్డి జగన్ డిక్లరేషన్ ఇవ్వరు, ఇవ్వాల్సిన అవసరం లేదు. దర్శనానికి వెడతాం. ఎవరడ్డుకుంటారో చూస్తాం అంటూ చేసిన  రెచ్చగొట్టే వ్యాఖ్యలే జగన్ డిక్లరేషన్ ఇవ్వడానికి రెడీగా లేరనడానికి నిదర్శనం. 

ఇక ఆయన దళితుల అంశాన్ని అసందర్భంగా లేవనెత్తడ కూడా ఆయన పరువును నిట్టనిలువుగా గొయ్యి తీసి పాతేసినట్లైంది. ఎందుకంటే తిరుమలలో ఇప్పటి వరకూ దళితుల దర్శనం ఒక  ఇష్యూ అయిన సందర్భం లేదు. అన్యమతస్థులు డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లాలన్న నిబంధన ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో ఉంది. మాజీ రాష్ట్రపతి అబ్డుల్ కలాం వంటి వారు కూడా తిరుమల దేవుడిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా డిక్లరేషన్ ఇచ్చారు. తిరుమల దర్శనం విషయంలో ఆయన దళితుల అంశం లేవనెత్తడంతో ఆ వర్గాలలో కూడా జగన్ నవ్వుల పాలయ్యారు.  గత ఎన్నికలలో ఘోర ఓటమి తరువాత కూడా 40 శాతం ఓటు బ్యాంకు అంటూ గప్పాలు కొట్టుకుంటున్న జగన్ కు ఇప్పుడు నాలుగు శాతం ఓటు బ్యాంకైనా మిగులుతుందో లేదో అనుమానమే అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా తన తిరుమల పర్యటన పేరుతో రాజకీయం చేద్దామనుకున్న జగన్ వ్యూహం ఫలించలేదు సరికదా.. ప్రతికూల ఫలితం వైసీపీ మనుగడకే ఎసరు తెచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.