సజ్జల పాపాల పుట్ట పగులుతోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన పాల్పడిన భూకబ్జాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా ఆయన అటవీ భూములను సైతం వదల లేదు. అటవీ భూములలో ఏకంగా గెస్ట్ హౌస్ లే నిర్మించుకుని జల్సాలు చేసిన వైనం విస్తుగొల్పుతోంది.
సజ్జల భూ బాగోతంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా సర్వం తానై వ్యవహరించిన సంగతి తెలిసిందే. షాడో సీఎంగా సజ్జలే ప్రభుత్వ వ్యవహారాలన్నీ నడిపారన్న ఆరోపణలకు కూడా ఉన్నాయి.
వాస్తవానికి జగన్ ఐదేళ్ల పాలనా దోపిడీ, దౌర్జన్యాలు, అవినీతి, కబ్జాలకు హద్దన్నదే లేదన్నట్లుగా సాగింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు యధేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు. అందిన కాడికి భూముల కబ్జాయే లక్ష్యమన్నట్లుగా వారి తీరు సాగింది. ప్రభుత్వ భూములు, అటవీ భూములు, ప్రైవేట్ భూములను ఇష్టారీతిగా ఆక్రమించేసి.. కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా చెలరేగిపోయారు. జగన్ పాలన అంతా ప్రభుత్వ, ప్రైవేట్ భూములను దోచుకోవటమే అన్నట్లుగా సాగింది. జగన్ కేబినెట్ లో ఐదేళ్లు మంత్రిగా కొనసాగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడింది. అలాగే విశాఖపట్నంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భూదందా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల భూకబ్జాల పర్వం అడ్డూ అదుపూ లేకుండా సాగింది.
ఇప్పుడు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబం భూదందా వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు. ఆయన భూ కబ్జాల పర్వం ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటకు వస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సజ్జల ఏకంగా అటవీ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సజ్జల భూ కబ్జాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా సజ్జల రామకృ ష్ణా రెడ్డి భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. సజ్జల బ్రదర్స్ ఏకంగా 42 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ భూములలో పండ్లతోటలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అంతే కాక అటవీ భూముల్లో గెస్ట్ హౌస్లు, పనివారికోసం షెడ్లు కట్టించారు. అయితే, సజ్జల పేరు బయటకు రాకుండా ఆయన అండతో సోదరులు, కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించినట్లు సమాచారం. వారంతా సజ్జల బినామీలేనని ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో సజ్జల సోదరులు కడప శివారు ప్రాంతంలో చేసిన అక్రమాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/deputy-cm-pawan-kalyan-orders-inquiry-on-sajjala-land-39-190729.html
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.