డీలిమిటేషన్ సెగ: చంద్రబాబుకు తలనొప్పేనా?

Publish Date:Jun 16, 2026

Advertisement

తెలుగువన్ స్పెషల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ముసలం పుడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్ )బిల్లు  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారన్న వార్తలతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజక వర్గాల సంఖ్యను ఏకంగా 50 శాతం మేర పెంచి, మొత్తం 815 స్థానాలకు చేర్చాలనేది ప్రాథమిక ప్రతిపాదన. అయితే..  దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహా మండలి ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో 543 స్థానాలను మరో 9 శాతం పెంచాలని చేసిన సిఫారసులే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

గతంలో 2009లో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియలో కేవలం నియోజక వర్గాల సరిహద్దులను మాత్రమే మార్చారు..   సీట్ల సంఖ్య పెరగలేదు. కానీ ఈసారి సీట్ల సంఖ్య భారీగా పెరగబోతోంది. విచిత్రం ఏంటంటే, ఈ విభజన అంతా జనాభా ప్రాతిపదికన సమపాళ్లలో జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రత్యేకమైన పాకెట్లను మాత్రమే టార్గెట్ చేస్తూ పునర్విభజన చేసేలా ఆర్థిక సలహా మండలి నివేదిక ఇచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న  అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా సీట్లు పెరగవు. ఇదే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే..  ఈ సిఫారసుల వల్ల కోస్తా తీర ప్రాంతాలైన విజయవాడ, ఏలూరు వంటి బలమైన కేంద్రాల్లో స్థానాలు పెరగడం లేదు. కానీ వైసీపీకి  మొదటి నుంచి కంచుకోటగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో ఏకంగా 10 లోక్ సభ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాయలసీమలోని కడప, కర్నూలు, నంద్యాల, రాజంపేట, అనంతపురం వంటి ఐదు కీలక పార్లమెంట్ నియోజక వర్గాలను ఒక్కొక్కదానిని మూడు మూడు నియోజక వర్గాలుగా విస్తరించాలని చూస్తున్నారు. కేవలం హిందూపూర్‌ను మాత్రమే ఇందులో వదిలేశారు. వైసిపి బలహీనపడిందని భావిస్తున్న తరుణంలో.. ఆ పార్టీకి పట్టున్న ప్రాంతంలో ఇలా సీట్లు పెరగడం భవిష్యత్తులో జగన్ మోహన్ రెడ్డికి కలిసివచ్చే అంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఇది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే   కార్యక్రమమేనని సీనియర్ జర్నలిస్టులు వీవీ రావు, గోపి విశ్లేషించారు. 

ఇటు తెలంగాణలోనూ ఇదే వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణలో అత్యంత ధనిక ప్రాంతాలైన చేవెళ్ల, మల్కాజ్‌గిరి, మెదక్, సికింద్రాబాద్ వంటి స్థానాలను రెండు లేదా మూడుగా విభజించే ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ( ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ విభజన ద్వారా భవిష్యత్తులో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు అవసరం లేకుండా, ఒంటరిగానే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాలనేది బిజెపి అసలు వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో మహిళా బిల్లు సమయంలో నియోజక వర్గాల పెంపు కోసం విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తమ స్వరాష్ట్రంలో ఇలాంటి అసమానతలతో కూడిన విభజన ప్రతిపాదన వస్తే ప్రజలకు ఏం సమాధానం చెబుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సరిహద్దుల మార్పు రాజకీయం తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును ఎలా మార్చబోతుందో చూడాలి.

By
en-us Political News

  
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.