ఆగస్టు 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..!

Publish Date:Aug 5, 2026

Advertisement

 

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఆగస్టు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు, మొత్తం 3 రోజుల పాటు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13వ తేదీతో ముగియనున్నాయి. సాధారణ సమావేశాలు ముగిసిన కేవలం 3 రోజుల్లోనే, మళ్లీ ప్రజాప్రతినిధులు హస్తినలోని చట్టసభల ప్రాంగణంలో అత్య అత్యవసరంగా సమావేశం కావడం విశేషంగా మారింది.

ఈ 3 రోజుల ప్రత్యేక సమావేశాల్లో ప్రధానంగా 2 అత్యంత ప్రాధాన్యత కలిగిన బిల్లులపై లోతైన చర్చలు జరిపి, ఉభయ సభల ఆమోదం పొందాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో మొదటిది దేశ రాజకీయ ముఖచిత్రాన్ని, లోక్‌సభ స్థానాల నిర్మాణాన్ని ప్రతిబింబించే డీలిమిటేషన్ బిల్లు కాగా, రెండోది సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు. 

నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన డీలిమిటేషన్ ప్రక్రియ భవిష్యత్ ఎన్నికల సరళిపై ప్రభావం చూపనుంది. మరోవైపు చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెడుతున్న మహిళా బిల్లు కూడా అత్యంత కీలకమైంది. ఈ రెండు ప్రధాన బిల్లులను ఒకే వేదికపై ఉభయ సభల ముందుకు తీసుకువచ్చి, దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపాలని అధికార పక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

అయితే ఈ 2 కీలక బిల్లులను పార్లమెంట్‌లో పాస్ చేయించుకోవడం కేంద్ర ప్రభుత్వానికి అంత తేలికైన విషయమేమీ కాదు. ఇవి సాధారణ చట్టాలు కావని, రాజ్యాంగ సవరణతో కూడుకున్న బిల్లులని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లులు నెరవేరాలంటే లోక్‌సభ  రాజ్యసభ రెండింటిలోనూ ఖచ్చితంగా మూడింట రెండు వంతుల (2/3rd) మెజారిటీ లభించాల్సి ఉంటుంది. 

ప్రస్తుత పార్లమెంటరీ సంఖ్యాబలం దృష్ట్యా, ఈ 2/3 వంతు బలాన్ని అందుకోవడానికి ప్రతిపక్షాల మద్దతు ఎంతో కీలకంగా మారింది. అందువల్లనే, బిల్లుల ఆమోదానికి అవసరమైన మద్దతును సమీకరించుకోవడానికి మోదీ ప్రభుత్వం ఇప్పటికే వివిధ రాజకీయ పక్షాలతో ముమ్మరంగా సంప్రదింపులు ప్రారంభించింది. ఈ రాజకీయ వ్యూహంలో భాగంగానే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ఉదయం స్వయంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పార్లమెంట్ ప్రాంగణంలో కలుసుకున్నారు. 

ఆగస్టు 16 నుంచి 18 వరకు జరగనున్న 3 రోజుల ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే డీలిమిటేషన్ బిల్లు  మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించిన వివరాలను ఆయన రాహుల్ గాంధీకి నిశితంగా వివరించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతు తెలపాలని రిజిజు కోరారు. కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీ నేతలను, ఇతర ప్రతిపక్ష నాయకులను కూడా కేంద్ర మంత్రులు కలిసి చర్చలు జరపనున్నారు. ప్రతిపక్షాల నుంచి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించి, ఈ చారిత్రక బిల్లులను కేంద్రం నెరవేరుస్తుందో లేదో వేచి చూడాలి.

 Delimitation Bill, Parliament Special Session, Women Reservation Bill, Kiren Rijiju, Rahul Gandhi, Modi Govt

By
en-us Political News

  
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ వార్తల్లో నిలిచారు. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబా సిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
భారత విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక మార్పుకు బీజం పడింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధింపులకు గురిచేసిన కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని అత్తాపూర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు రిపబ్లికన్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి చేపట్టిన నిరసన
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారి ఉక్కుపాదం మోపుతున్నారు
మహిళలకు బంగారం.. పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరం..!
ప్రాణ‌హిత న‌దిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్ర నుంచి అనుమ‌తులు ఇప్పించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు.
సెప్టెంబర్ 18లోగా పాస్‌పోర్ట్ ఇవ్వాలి.. కోర్టు ఆదేశాలు..!
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమైన ఈ కంటెంట్‌ను నీచమైన, నిందాపూర్వకమైనదిగా  పేర్కొంది. ఇలాంటి హానికరమైన, అసత్యపూరితమైన పోస్టులకు బహిరంగ వేదికలలో ఏమాత్రం స్థానం ఉండకూడదని స్పష్టం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.