డీలిమిటేషన్ తో దక్షిణాదికి నష్టమే ఎక్కువ

Publish Date:Sep 22, 2023

Advertisement

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఉభ సభలు ఆమోదించాయి. అన్ని పార్టీలు ఏకమై మరీ బిల్లుకు  ఆమోద ముద్ర వేశాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు, మేథావులు మహిళా రిజర్వేషన్   చట్టం అమలుకు, జనగణన, డీలిమిటేషన్ (అసెంబ్లీ,లోక్ సభ,నియోజక వర్గాల పునర్విభజన)తో  ముడిపెట్టి,  ఏకంగా ఐదేళ్ళు వాయిదా వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సరే  ఆ విషయంలో చివరకు ఏమి జరుగుతుందనేది పక్కన పెడితే, ఇప్పడు కొత్తగా డీలిమిటేషన్ పై  రాజకీయ వివాదం తెరపై కొస్తోంది. ముఖ్యంగా లోక్ సభ నియోజక వర్గాల డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుంది.   మరీ ముఖ్యంగా, రాష్ట్ర విభజ చట్టంలో హామీ ఇచ్చిన విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో తక్షణమే నియోజక వర్గాల పునర్విభజన జరగాలని అప్పటి నుంచి కోరుతున్న బీఆర్ఎస్ ఇప్పుడు జనభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే,ఉభయ తెలుగు రాష్ట్రాలకు నష్టమే జరుగుతుందని విమర్శిస్తూ ఉమ్మడి పోటానికి పిలుపు నిస్తోంది.  

ఇప్పటికే ఉత్తరాది డామినేషన్ అనుభవిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు మరింతగా  నష్ట పోతాయని,  దక్షిణాది రాష్ట్రాల ప్రజలు మరింత వివక్షకు గురయ్యే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంతేకాదు దక్షిణాది రాష్టాల ప్రజలు దేశంలో సెకండ్ క్లాస్ సిటిజన్స్ (రెండవ తరగతి పౌరులు) గా అవమానాలకు గురయ్యే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. అందుకే  రాజకీయాలకతీతంగా దక్షిణాది నేతలంతా ఈ విషయంలో ఏకమై పోరాటం చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కల్వకుంట్ల తారక రామారావు పిలుపు నిచ్చారు. 

కేంద్రం తీసుకుంటున్న ఈ విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలైన కేరళ ,తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ,తెలంగాణ తీవ్రంగా నష్టపోతాయని లోక్ సభలో  వీటి ప్రాతినిధ్యo తగ్గిపోతుందని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఇందుకు ఉదాహరణగా  ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతమున్న 44 లోక్ సభ నియోజక వర్గాల సంఖ్య, 36 తగ్గుతుందని అంటే, తెలుగు రాష్ట్రాలు ఎనిమిది శానాలు కోల్పోతాయని, దీంతో పార్లమెంట్ లో తెలుగు గళం బలహీనపడుతుందనిఅంటున్నారు.  అలాగే, కేరళ,(8) తమిళనాడు,(8) కర్ణాటక (2) పశ్చిమ బెంగాల్ (4) ఇలా  దక్షిణాది రాష్ట్రాలలో నియోజక వర్గాల  సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. మరో వంక ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరిగిన కారణంగా చాలా వరకు రాష్ట్రాలలో నియోజక వర్గాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు.  ఒక్క  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రస్తుతమున్న 80 నియోజక వర్గాల సంఖ్య 11 పెరిగి 91 చేరుకుంటుంది. 

నిజానికి  డీలిమిటేషన్  తర్వాత నియోజక వర్గాల సంఖ్య అన్ని రాష్ట్రాలలో  పెరగాలి కానీ, డీలిమిటేషన్ కు జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వలన జనాభా నియత్రణ పాటించిన ప్రగతి శీల రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాల నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. జనాభా నియంత్రణ పాటించడంతో పాటుగా జనాభాల్లో 18 శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు   స్థూల జాతీయ ఉత్పత్తికి 35 శాతం నిధులు అందిస్తున్నాయి. 

ఈ నేపధ్యంలో ప్రగతిశీల విధానాలను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ రకమైన బహుమతి సరైనది కాదని అంటున్నారు.కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేయడం కోసమే కేంద్రం ఇలాంటి విధానాలను ప్రతిపాదిస్తున్నదని నేతలు అంటున్నారు. మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమకు ఇసుమంతైనా స్టేక్ లేని దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిథ్యం తగ్గించడమే లక్ష్యం, అదే సమయంలో తమ బలం ఎక్కువగా ఉన్నచోట మరిన్ని సీట్లు పెంచి తద్వారా దీర్ఘకాలం అధికారంలోకి ఉండాలనే స్వార్థ ప్రయోజనాల కోసమే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను తెరమీదకు తెచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

అయితే, ఇంకా ఇప్పటి వరకు డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు జరగ  లేదు. అంతకు ముందు జరగ వలసిన జనగణన ఇంత వరకు మొదలు కాలేదు.. ఈ ప్రక్రియ మొదలయ్యేందుకే .. మరో సంవత్సరకాలం  పడుతుంది. అన్నీ సక్రమంగా జరిగితే, మరో మూడేళ్ళ తరవాత 2026- 27 నాటికి కానీ  ఈ ప్రక్రియ పూర్తి కాదు .. ఈ లోగా ఏమైనా  జరగ వచ్చును. అయితే కేంద్రం ప్రతిపాదించిన జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ మాత్రం కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలను బలహీన పరచి, వారి గళం లోక్ సభలో, రాజ్యసభలో వినపడకుండా చేయాలన్న దురుద్దేశంతో చేసిందేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

By
en-us Political News

  
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నిర్లక్ష్యం సహించేది లేదని హెచ్చరించారు.
వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే ఆయనకు వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. తన హెల్త్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయాలని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
టిడిపి అంటే వీరాభిమానం 400 కిలోమీటర్లు సైకిల్ పై వచ్చిన ఈ పెద్దాయన గురించి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో చంద్రబాబు ఆయన్ను వేదికపై కి పిలిచి అందరికీ చూపిస్తూ స్ఫూర్తి దాత అంటూ కితాబిచ్చి అభినందించారు.
. వేదికపైకి చేరుకున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏర్పాట్లను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెడ్డెప్పగారి శ్రీనివాస్‌ రెడ్డిని భుజం తట్టి సీఎం మెచ్చుకున్నారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి ఆనందభాష్పాలతో చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 
రాయలసీమ నడిబొడ్డు కడప గడ్డన నిర్వహించిన పసుపు పండగ పసుపు దండు ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. ఉత్తంగ తరంగమై అన్ని దారులు కడప వైపు అన్నట్టు పెను ప్రవాహంలో తెలుగుదేశం శ్రేణులు మహానాడుకు తరలి వచ్చి జోష్ నింపారు
కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప టీడీపీ మహానాడుగ ముగింపు సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఎన్నోసార్లు కడపకు వచ్చానని.. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు. కడపలో మహానాడు పెడితే చాలామంది అనుమానించారని సీఎం అన్నారు.
పుష్ప పార్ట్ వ‌న్ ద్వారా నేష‌న‌ల్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు రాగా.. పార్ట్ టూ ద్వారా.. స్టేట్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు రావ‌డం మాములు విష‌యం కాదు. ఒక పాత్ర‌ను ద‌ర్శ‌క ర‌చ‌యిత‌లు మ‌ల‌చ‌డం ఒక ఎత్తు అయితే దాన్ని చేయ‌డం మ‌రొక ఎత్తుగా భావించాల్సి ఉంటుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత, ఆయనలో మార్పు వచ్చిందా? గతానికి భిన్నంగా.. ముఖ్యంగా అధికారుల విషయంలో కొంత కఠినంగా, ఖచ్చితంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారా? అధికారులపై, కల్లెక్టర్లపై కోపంగా ఉన్నారా? అలాగే.. మంత్రులకు మంరిత దగ్గరయ్యే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారా? అంటే ఇటు అధికార వర్గాల నుంచి, అటు రాజకీయ వర్గాల నుంచి కూడా ఔననే సమాధానమే వస్తోంది.
అధికారం అండ చూసుకుని సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిగా చెలరేగిపోయిన సజ్జల భార్గవ్ రెడ్డి సన్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు పోలీసుల విచారణలో మాత్రం . తాను సుద్దపూసననీ, తనకే పాపం తెలియదనీ చెప్పుకొచ్చారు. అసలైన విలన్స్ వేరు ఉన్నారంటూ తాను తప్పించుకోవడానికి నెపం వాలంటీర్ల మీద నెట్టేయడానికి శతధా ప్రయత్నించారు.
కడప మహానాడు బహిరంగ సభా వేదికపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ స్పృహ తప్పి పడిపోయారు.అపస్మారక స్థితిలో ఉన్న జలీల్ ఖాన్‌ను హుటాహుటిన ఆసుపత్రికి టీడీపీ శ్రేణులు తరలించారు.
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా, కోరాపూట్ అడవుల్లో భద్రతా బలగాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో హిడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యూట్యూబర్ భయ్యా సన్నీయాదవ్‌ను చెన్నై ఎయిర్పోర్టులో ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సన్నీ యాదవ్ ఇటీవలే పాకిస్తాన్‌‌‌‌లో బైక్ రైడ్ చేశారు.
కడప జిల్లా… ఎలాంటి డౌటూ లేదు.. ఈ జిల్లా జగన్ కు కంచుకోటే. అయితే ఆ కోటకు బీటలు వారాయన్నదీ అంతే నిజం. గత ఏడాది జరిగిన ఎన్నికలలో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏడింటిలో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అయినంత మాత్రాన కడపలో వైసీపీ గాలిపోయిందన్న నిర్దారణకు రావడం సరి కాదు. వైఎస్ హయాం నుంచీ కూడా ఆ కుటుంబానికి కడప జిల్లా పెట్టని కోట లాంటిది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.