Publish Date:Feb 13, 2020
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు విషయంలో జరుగుతున్న జాప్యం పై నిర్భయ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. దోషులని వెంటనే ఉరి తీయాలని కోరుతూ మరోసారి న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు మరణశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. డెత్ వారెంట్ పిటిషన్లపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. తమ కూతురికి న్యాయం చేయాలని, దోషులను తక్షణమే ఉరి తీయాలని కోరుతూ కోర్టు మెట్లెక్కారు నిర్భయ తల్లితండ్రులు. ఏడేళ్లయినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థపై తమకు నమ్మకం పోతోందని, శిక్ష అమలుపై జాప్యం జరుగుతుండటంతో కోర్టు ఆవరణలోనే ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఉరి నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. నిజానికి ఆ నలుగురినీ జనవరి 22 నే ఉరి తీయాలని తొలుత డెత్ వారెంట్ లు జారీ కాగా, వారికి చట్ట పరంగా అన్ని హక్కులూ కల్పించాలంటూ దోషుల తరఫు లాయర్ వాదించడంతో ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు ఢిల్లీ పాటియాలా కోర్టు మరోసారి వారెంట్ లు జారీ చేసింది. వారం రోజుల్లోగా అన్ని అవకాశాలు వినియోగించాలంటూ కోర్టు డెడ్ లైన్ విధించింది. టైం దగ్గర పడిన సమయంలో లాయర్ లేడంటూ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా కోర్టుకు విన్నవించారు. దీంతో మరోసారి శిక్ష అమలులో జాప్యం నెలకొంది, పవన్ గుప్తా అభ్యర్థనపై స్పందించిన న్యాయస్థానం తక్షణ సాయం అందించింది. ఎంప్యానెల్ న్యాయవాదుల జాబితానిచ్చి లాయర్ ను ఎంచుకోవాలని సూచించింది. ఇక డెత్ వారెంట్ పిటిషన్లపై ఇవాళ కోర్టు విచారణ చేపట్టనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/delhi-court-to-hear-today-nirbhaya-parents-plea-25-94199.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.