ఆమ్ ఆద్మీ డిల్లీలో మళ్ళీ పోటీకి సై!

Publish Date:Jan 15, 2015

Advertisement

 

డిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి ఏడున మళ్ళీ ఎన్నికలు జరుగనున్నాయి. క్రిందటిసారి అపూర్వమయిన ప్రజాధారణ పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలిచేసి ఏకంగా దేశాన్నే ఏలేద్ధామనే దురాశతో ముఖ్యమంత్రి పదవి వదులుకొని, ప్రభుత్వాన్ని రద్దు చేసుకొన్నందుకు తగిన ఫలితం అనుభవించారు. కానీ ఆయన చేసిన తప్పు కారణంగానే డిల్లీలో మళ్ళీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈసారి తమ పార్టీకి ఓటు వేసి గెలిపించినట్లయితే అటువంటి పొరపాటు మళ్ళీ చేయబోనని ఆయన పదేపదే ప్రజల ముందు లెంపలు వేసుకోవలసి వస్తోంది. రాజకీయాలలో అటువంటి తప్పులు చేసినవారికి మళ్ళీ అధికారం దక్కడం చాలా కష్టమేనని భావించవచ్చును.

 

కానీ ఇటీవల రెండు ప్రముఖ సంస్థలు డిల్లీలో గల 70 నియోజక వర్గాలలో నిర్వహించిన సర్వేలలో 35శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సరయిన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా అమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటికీ దాని 39 శాతం ఓటు బ్యాంకు పదిలంగానే ఉన్నట్లు స్పష్టమయింది. కానీ ఈసారి డిల్లీలో 40 శాతం ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఈసారి ఎన్నికలలో పోటీ ప్రధానంగా బీజేపీ- ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యనే హోరాహోరిగా సాగబోతోందని స్పష్టం అవుతోంది.

 

ఇండియా టుడే ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో డిల్లీ శాసనసభలో ఉన్న మొత్తం 70 సీట్లలో బీజేపీకి-34 నుండి 40 వరకు, ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుండి 31 కాంగ్రెస్ పార్టీకి కేవలం 3 నుండి 5 సీట్లు మాత్రమే రావచ్చని తేల్చి చెప్పింది. బీజేపీకి మోడీ, ఆయన పరిపాలనే సానుకూలాంశాలు. ఈరోజు బీజేపీలో చేరిన మాజీ ఐ.పి.యస్. అధికారిణి కిరణ్ బేడీని బీజేపీ తమముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినట్లయితే బీజేపీ విజయావకాశాలు ఇంకా మెరుగుపడవచ్చును.

 

ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాలే ప్రధాన బలమని చెప్పవచ్చును. ఆయన తన 49 రోజుల పాలనలో తీసుకొన్న కొన్ని సాహసోపేతమయిన నిర్ణయాలు కూడా ఆయనక పార్టీకి కలిసి వచ్చే అంశాలుగానే చెప్పుకోవచ్చును. కానీ ప్రజలు ఆయనకి ఎంతో నమ్మకంతో అధికారం కట్టబెట్టినప్పటికీ, ఆయన బాధ్యతగా వ్యవహరిస్తూ తన సమర్ధతను, తన ప్రభుత్వ సమర్ధతను నిరూపించుకొనే బదులు, రోడ్ల మీద నిరసన దీక్షలు చేపట్టి చివరికి కోర్టుల చేత మొట్టి కాయలు వేయించుకోవడం, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీపై అవినీతి ఆరోపణల కేసులో బెయిలు తీసుకోవడానికి నిరాకరించి వారం రోజులు జైల్లో గడపడం వంటి అంశాలు ఆయనకు తీవ్ర ప్రతికూలాంశాలుగా నిలుస్తాయి.

 

ప్రధాని నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రచార సభలలో ఇవే అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలను తన వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తుండటం గమనిస్తే, అరవింద్ కేజ్రీవాల్ ఆనాడు ఆవిధంగా వ్యవహరించి ఎంత పెద్ద తప్పు చేసారో స్పష్టమవుతోంది. కానీ, నేటికీ ఆయన బీజేపీకి గట్టి పోటీ ఇవ్వబోతునట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గనుక ఈ ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీ మరింతగా కృషి చేయవలసి ఉంటుంది. ఈ ఎన్నికలలో గెలవడం బీజేపీకి అత్యవసరం కూడా. లేకుంటే మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ ఇదివరకు యూపీయే ప్రభుత్వానికి ఏవిధంగా పక్కలో బల్లెంలా వ్యవహరించారో ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా వ్యవహరించడం తధ్యం. కానీ మోడీ, అమిత్ షా ఇరువురూ చేతులు కలిపి ఇప్పటికే అనేక రాష్ట్రాలలో తమ పార్టీని గెలిపించుకొన్నారు కనుక డిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం ఖాయమనే భావించవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.