Publish Date:May 13, 2024
ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ప్రక్రియ చాలా కీలకంగా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఇది అందరూ హక్కుగా చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి ఓట్లు వేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఉంటారు. అయితే ఎవరు ఎంత చెప్పినా.. కొందరు మాత్రం అస్సలు మారరు. గడప దాటరు. ఓటు వేయరు. ఏం జరిగినా మనకెందుకులే అని కూర్చొంటారు. అలాంటి వారిలో హైదరాబాదీలు కూడా ఉన్నారు.తెలంగాణలో ఇవాళ లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే… హైదరాబాదీలు మాత్రం మొద్దు నిద్ర వీడలేదు. అసలు ఓటు వేయడానికి నగరవాసులు కలవడం లేదు. ఇప్పటికే చాలాసార్లు హైదరాబాదీలు పోలింగ్ విషయంలో ప్రత్యేకంగా వార్తాల్లో నిలుస్తూనే ఉన్నారు. ఓటు వేసేందుకు నగరవాసులు ముందుకు రావడం లేదని.. సీటీ ప్రజలకు ఎందుకింత బద్ధకం అని.. ఎన్నికలు జరగినప్పుడల్లా మీడియా అనేక రకాల కథనాలు కూడా ఇస్తుంది. అటు ఎన్నికల అధికారులు, రాజకీయ నాయకుల, సెలబ్రిటీలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని.. అందరు కదిలి ఓటు వేయాలని.. మొత్తుకుంటూనే ఉన్నారు. ఇక ఎన్నికల అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు, ప్రకటనలు కూడా ఇస్తూనే ఉన్నారు. అయినా కూడా హైదరాబాదీల తీరు మాత్రం మారడం లేదు. ఎన్నికలు జరిగినప్పుడల్లా ఇదే తంతు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్లోనే తక్కువగా పోలింగ్ శాతం నమోదు అవుతుంది. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నా… ఇప్పటివరకు పోలీంగ్ శాతం తక్కువగా నమోదు అవ్వడంపై… ఎన్నికల అధికారులు సైతం షాక్ అవుతున్నారు. అయితే హైదరాబాద్లో చాలామంది ఏపీ ప్రజలు ఉంటారు. చాలామందికి ఇక్కడ అక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు ఉంది. దీంతో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో.. చాలామంది ఓటు కోసం ఏపీకి క్యూ కట్టారు. అలా కొందరు వెళ్లినా కూడా… కనీస పోలింగ్ అయినా నమోదు కావాలి. కానీ.. అలా జరగలేదు. సిటీ జనం ఇంటి గడప దాటడానికి ఇష్టపడటం లేదు. దీంతో హైదరాబాద్లో పోలింగ్ మందకొడిగా సాగింది. జంట నగరాల్లో మూడు పార్లమెంట్ స్థానల్లో అతి తక్కువ ఓటింగ్ నమోదు అయ్యింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/decreased-polling-percentage-in-hyderabad-25-175888.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.