అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం లక్ష్యం.. లోకేష్

Publish Date:Apr 25, 2023

Advertisement

పాలన కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పేర నారాలోకేష్ చేపట్టిన పాదయాత్ర సోమవారం (ఏప్రిల్ 24) 1020 కిలోమీటర్లు పూర్తయ్యింది.  గణెళికల్లు శివారులో వద్ద రైతులతో మాటామంతి నిర్వహించారు. గణెళికల్లులో లోకేశ్‌కు గ్రామస్థులు గజమాలతో  సన్మానం చేశారు. జాలిమంచి క్రాస్‌ వద్ద మహిళలు, చిన్నారులు హారతులతో లోకేశ్‌కు ఆహ్వానం పలికారు. పాండవగల్లు చెరువును ఆక్రమదారుల నుంచి రక్షించాలని గ్రామస్థులు లోకేశ్‌కు వినతి చేశారు. కుప్పగల్‌లో గ్రామస్థులు మేళతాళాలతో లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు. కుప్పగల్‌ శివారులో విడిది కేంద్రానికి చేరుకున్న లోకేశ్‌ బీసీలతో ముఖాముఖి మాట్లాడారు.

పెద్దతుంబళంకు చేరుకున్న లోకేశ్‌ మేళతాళలతో, పులవర్షం కురిపించారు. పెద్దతుంబళం శివారులో రాత్రి బస చేసే విడిది కేంద్రానికి చేరుకున్న లోకేశ్‌, 78వ రోజు 15.2 కి.విూ.నడిచారు. ఇప్పటి వరకు 1020 కి.విూ. యాత్రను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన సర్పంచ్ లకు తెలుగుదేశం ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకు వస్తుందని అన్నారు. ఒక్క ఏడాది ఓపికపట్టండి చాలు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, సర్పంచ్ ల హక్కులను తమ ప్రభుత్వం కాపాడుతుందని లోకేష్ చెప్పారు.

జగన్ సర్కార్ సర్పంచ్ ల హక్కులను పూర్తిగా కాలరాసిందని, వారికి అందాల్సిన నిధులను పక్కదారి పట్టించదని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో మాదిరిగా   సర్పంచ్‌ అకౌంట్లలోనే  నేరుగా నిధులు వేస్తామని హావిూ ఇచ్చారు. సర్పంచ్‌ల గౌరవాన్ని కాపాడుతామన్నారు. తాను హైదరాబాద్‌లో పుట్టి పెరిగానని, సీమ ప్లలెల్లో పాదయాత్ర చేస్తుంటే చాలా బాధేస్తోందని  లోకేష్‌ఆవేదన వ్యక్తం చేశారు. ప ల్లెల్లో రోడ్లు, తాగునీరు, డైనేజీ అస్తవ్యస్తంగా ఉందన్నారు. అలాగే గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు.

ఇలా ఉండగా లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. అడుగడుగునా జనం అభిమానంతో ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు.  రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలలో పనులను వదలి  వచ్చి మరీ యువ నేతతో  అడుగు కలుపుతున్నారు. తమ కష్టాలు, బాధలను వినిపిస్తూ ముందుకు సాగుతున్నారు.  కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని, రాయలసీమలో కరువు నివారణకు పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు నీరు ఇచ్చే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని హావిూ ఇచ్చారు. దామాషా ప్రకారం బీసీ కులాలకు నిధులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వివరించారు. దూదేకుల, ముస్లింలను ఆదుకుంటామని చెప్పారు.  

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.