ఈయన సేవకి... చేతులెత్తి 'మొక్క'వలసిందే!

Publish Date:Jan 27, 2017

Advertisement

మరోసారి జనవరి 26 వచ్చింది. పోయింది. గణతంత్రం ఘనంగా జరుపుకున్నాం. జెండా వందనం చేసుకున్నాం. కాని, ఒక్కసారి మన జెండా రెపరెపల మాటున  ఎజెండా ఏంటని ఆలోచించుకున్నామా? ఈ మధ్య పదే పదే వార్తల్లో వస్తోన్న విషయం ఏంటో గమనించారా? దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం! ఇక్కడ హైద్రాబాద్ లో వుండే మనకు అంతగా అర్థం కాకపోవచ్చుగాని దేశ ప్రధాన నగరంలో పరిస్థితి దారుణంగా వుంది. అస్తమా నుంచి క్యాన్సర్ వరకూ కాలుష్యం కారణంగా సోకని రొగమంటూ లేదు జనానికి. మిగతా నగరాలు, పట్టణాలు, ఆఖరుకి గ్రామాల్లో కూడా రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతూనే వుంది. ఢిల్లీ అంత కాలుష్యం అంతటా లేకున్నా ఎక్కడా స్వచ్ఛమైన గాలీ, చూడచక్కని ప్రకృతి కనిపించటం లేదు. పచ్చ నోట్ల ధ్యాసలో .. మనిషి పచ్చదనాన్ని పాతరేసేస్తున్నాడు! ఆత్మహత్యకి సిద్ధమవుతున్నాడు... 

 

 

జనవరి 26న ఎప్పటి లాగే ఈ సారి కూడా పద్మా అవార్డులు ఇచ్చారు. మన తెలుగు వ్యక్తికి కూడా ఒకాయనకి పద్మ అవార్డు దక్కింది. ఇందులో సాధారణంగా అయితే విశేషం ఏం లేదు. కాని, వాతావరణ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఢిల్లీలోనే ఆయన తన పద్మ శ్రీ అందుకున్నాడు. ఆయన గత అయిదు దశాబ్దాలుగా చేస్తున్న పనే కాలుష్యానికి విరుగుడు. ఆయనకి మోదీ సర్కార్ సగౌరవంగా పద్మా అందజేసింది! ఇది భారతీయులుగా, తెలుగు వారిగా మనం సంతోషించాల్సిన విషయమే! కాని, ఖమ్మం జిల్లాల్లోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆయన చెప్పేది ఆచరిస్తే మరింత గొప్పగా వుంటుంది. ఆయనకి అవార్డ్ ఇవ్వటం గొప్ప విషయమే కావచ్చు.. కాని, ఆయన చెప్పేది పట్టించుకోకపోవటం మన భవిష్యత్ ని మనమే చంపేసుకోవటం! అదే పెను విషాదం... 

 

 

దరిపల్లి రామయ్య... తలకి హెల్మెట్ లాగా , టోపీ లాగా ఒక అట్టతో చేసిన చక్రం బిగించుకుంటాడు. అది అలంకారం మాత్రం కాదు. అదొక సందేశం లాంటి ఆదేశం! వృక్షో రక్షతి రక్షితః అన్నది దరిపల్లి రామయ్య అందరికీ చెప్పే జీవిత సత్యం! జీవాన్నిచ్చే సత్యం! 

 

 

చెట్లు నాటమని చెప్పేవారు బోలెడు మంది వుంటారు భూమ్మీద. కాని, తీరా తాము ఇల్లు కట్టుకునే సమయం వస్తే నిర్ధాక్షిణ్యంగా ఎన్ని చెట్లైనా నరికేస్తారు. చివరకు, కార్ పార్కింగ్ చేసుకోవటం ఇబ్బంది అవుతోందని కూడా చెట్లు నరికేసే రాక్షసులు తయారయ్యారు ప్రపంచంలో. అలాంటి ఒట్టి మాటల మనిషి కాడు రామయ్య. ఆయన తన చిన్నప్పుడు ఎప్పుడో కొన్ని వేప చెట్లు గాలికి కూలిపోతే వాట్ని చూసి ప్రేరణ పొందాడు. ఎందుకంటే, అవ్వి ఇప్పుడు అరవై ఏళ్లున్న రామయ్య ముత్తాత నాటినవి.

 

 

వందల సంవత్సరాల కిందటి ఆ వేప చెట్లు రామయ్య చిన్నతనంలో కూలిపోయాయి. అవ్వి కూలిన నాడు రామయ్య ముత్తాత పేరు చెప్పి అవ్వి ఆయన చెట్లేనని అన్నారట గ్రామస్థులు! అప్పుట్నుంచీ చెట్లు నాటటం అంటే తరతరాల మీద తన ప్రభావం చూపటమేననే విషయం రామయ్యకి అర్థమైంది. అందుకే, బడికి పోయే వయస్సు నుంచే చెట్లు నాటటం మొదలు పెట్టాడు. ఇప్పటి వరకూ కోటి మొక్కలు నాటి, రెండు కోట్ల మొక్కలకు సరిపడా విత్తనాలు వెదజల్లి... ఈ భూమికి తన దైన పచ్చటి వారసత్వాన్ని బహుకరించాడు! చెట్లు నరకటమే అభివృద్ధిగా చెలామణి  అవుతున్న ప్రస్తుత తరుణంలో చెట్లు నాటుతూ, ఉచితంగా పంచుతూ, నాటమని జనం మనస్సుల్లో నాటుకునేలా చెబుతూ యావజ్జీవితం గడిపేశాడు! మొక్క కోసం మొక్కవోని కృషి చేస్తున్నాడు!

 

 

దరిపల్లి రామయ్య తన భార్యతో కలిసి దశాబ్దాలుగా చెట్లు నాటడమే జీవితంగా గడుపుతున్నాడు. అందరిలాగే ఆయనకు పిల్లలు, సంసారం అన్నీ వున్నా ప్రధాన వ్యాపకం పచ్చదనమే. పచ్చ నోట్ల వెంట పరుగులు తీసి జీవిత చరమాంకంలో ఏమీ సాధించలేకపోయేమే అన్న బాధ పడేవాళ్లలా కాదయన. భావి తరాలకి పచ్చటి వారసత్వం తన, పరా బేధం లేకుండా అందిస్తున్నాడు. మొదట్లో కాలినడకన ఉచితంగా చెట్లు అందిస్తూ తిరిగిన ఆయన తరువాత చంద్రబాబు అందించిన సైకిల్ పై మొక్కలు పంపిణీ చేశాడు. ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి హయాంలో టీవీఎస్ అందుకుని దానిపై కూడా తన వృక్షాల వృత్తాంతాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు.

 

ఇప్పుడు కేసీఆర్ శకంలో రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు పై కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ శ్రీ పురస్కారం అందుకున్నాడు. ముఖ్య మంత్రులు మారిన దరిపల్లి రామయ్య దారి మాత్రం మారలేదు. పచ్చటి మొక్కల వెంట ఆయన సాగిపోతూనే వున్నాడు. దేవుడికి మొక్కుకోవటం ఎంత ముఖ్యమో... అంతే ముఖ్యం, ఆ దేవుడికి పళ్లు, పూలు ఇచ్చే మొక్కల్ని నాటడం అంటాడయాన! యావత్ దేశం , ప్రపంచం కాలుష్యపు కొండ చిలువ నోటిలో చిక్కిన ప్రస్తుత తరుణంలో.. అంతకంటే గొప్ప సందేశం ఏం కావాలి? అందుకే, ఆయనని ఒకప్పుడు పిచ్చివాడని అనుకున్న జనం పద్మ శ్రీతో పాటూ అనేకానేక అవార్డులు అందుకుంటుంటే.... పిచ్చి ఎవరికి పట్టిందో గ్రహిస్తున్నారు! పచ్చదనాన్ని పచ్చి అభివృద్ధి మోజులో పడి పాడు చేసుకుంటోన్న అత్యధికులే పిచ్చి వాళ్లు! రామయ్య లాంటి ఒకరిద్దరు ప్రకృతి ఆరాధకులే అసలైన సంపన్నులు! 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.